ఉత్తరప్రదేశ్లో సంభవించిన పిడుగుపాట్లు, గోడలు కూలడం, చెట్లు విరిగిపడటం వంటి ఘటనల్లో ఇప్పటివరకు 89 మంది ప్రాణాలు కోల్పోయారు.
Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
Hailstorm Deaths: యూపీలోని పలు జిల్లాల్లో ప్రచండమైన ఈదురుగాలులు, వడగళ్ల వర్షం పెను విషాదాన్ని నింపాయి. పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.

- ఉత్తరప్రదేశ్లో పిడుగులు, వడగళ్ల వానతో 89 మంది మృతి.
- తుఫాను ధాటికి 114 పశువులు, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.
- క్యుములోనింబస్ మేఘాలు, 80-100 కి.మీ. వేగంతో గాలులే కారణం.
- ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు, మరికొన్ని చోట్ల వర్షాల హెచ్చరిక.
Rain Havoc In UP: ఉత్తరప్రదేశ్లో ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిస్తుందనుకున్న వర్షం.. రాకాసి గాలులు, వడగళ్ల వానగా మారి మృత్యుపాశం విసిరింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సంభవించిన పిడుగుపాట్లు, గోడలు కూలడం , చెట్లు విరిగి పడటం వంటి ఘటనల్లో ఇప్పటివరకు 89 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 53 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అకాల వర్షం సృష్టించిన ఈ బీభత్సం పచ్చని పొలాలను, నిరుపేదల గూడును చిన్నాభిన్నం చేసింది.
ఈ విపత్తు కేవలం మనుషులకే కాకుండా మూగజీవాలకు కూడా ప్రాణసంకటంగా మారింది. సుమారు 114 పశువులు ఈదురుగాలుల ధాటికి మరణించాయి. దాదాపు 87 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, వందలాది గృహాలకు పాక్షిక నష్టం వాటిల్లింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అనేక జిల్లాలు అంధకారంలో మునిగిపోయాయి. ఒక్కరోజులోనే ఇంత భారీ స్థాయిలో నష్టం సంభవించడం రాష్ట్ర యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
बरेली के भमोरा थाना क्षेत्र के बमियाना में तेज आंधी-बारिश के दौरान एक युवक टीन शेड के साथ हवा में उड़ गया. युवक का हवा में उड़ने का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है. हादसे में युवक के हाथ-पैर टूट गए, जिसे इलाज के लिए निजी अस्पताल में भर्ती कराया गया है.#Storm… pic.twitter.com/CSfNgtMDhE
— ABP News (@ABPNews) May 14, 2026
ఈ అకాల వర్షాలకు వాతావరణ శాస్త్రవేత్తలు క్యుములోనింబస్ మేఘాలను ప్రధాన కారణంగా చెబుతున్నారు. మండే ఎండల వల్ల ఏర్పడిన వేడి గాలి , తేమ కలవడం వల్ల ఈ మేఘాలు వేగంగా విస్తరించి, పిడుగులతో కూడిన భారీ వడగళ్ల వర్షానికి దారితీశాయి. సాధారణంగా వర్షాకాలంలో కనిపించే ఇటువంటి తీవ్రమైన పరిస్థితులు, వేసవిలో ఏర్పడటం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈదురుగాలులు గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో వీయడం విధ్వంసానికి మరో కారణమైంది.
📍This is horrific and shocking.
— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) May 14, 2026
Approx 70 people, including women & children, were killed in yesterday’s massive storm in UP.
What kind of alert system do we even have? No emergency preparedness, only reel optics.
Also look at “smart villages.”🤦pic.twitter.com/ObiUvSa6EX
గాలివాన తగ్గుముఖం పట్టినప్పటికీ, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో శిథిలాలను తొలగిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. యూపీ మళ్ళీ కోలుకోవడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
ఉత్తరప్రదేశ్లో అకాల వర్షాల వల్ల ఎంతమంది మరణించారు?
వర్షాల వల్ల ఎంతమంది గాయపడ్డారు?
ఈ అకాల వర్షాల వల్ల మరో 53 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
పశువులకు, ఇళ్లకు జరిగిన నష్టం వివరాలు ఏమిటి?
సుమారు 114 పశువులు మరణించాయి, దాదాపు 87 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, వందలాది గృహాలకు పాక్షిక నష్టం వాటిల్లింది.
వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం ఈ అకాల వర్షాలకు కారణమేమిటి?
క్యుములోనింబస్ మేఘాలు, మండే ఎండల వల్ల ఏర్పడిన వేడి గాలి, తేమ కలవడం ఈ విధ్వంసానికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రభుత్వం సహాయక చర్యల కోసం ఏమి చేస్తోంది?
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి, శిథిలాలను తొలగిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















