అన్వేషించండి

Samajwadi Party Split Rumours: యూపీలోనూ ఆపరేషన్ లోటస్ - బీజేపీతో టచ్‌లోకి 21 మంది ఎస్పీ ఎంపీలు - అఖిలేష్ ఏమంటున్నారంటే ?

Akhilesh Yadav Response To Rajbhar: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆపరేషన్ లోటస్ కలకలం రేపురోంది. ఎస్పీకి చెందిన 21 మంది ఎంపీలు బీజేపీ వైపు వస్తున్నారనే ప్రచారం జరిగింది. అఖిలేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

 UP Politics Operation Lotus 2026.  ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్ వాదీ పార్టీ ని లక్ష్యంగా చేసుకుని అధికార ఎన్డీయే కూటమి సరికొత్త వ్యూహాలకు తెరలేపింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో  పార్టీల ఎంపీలు చీలిపోయి ఎన్డీఏకు మద్దతు ప్రకటించడంతో   యూపీలోనూ అదే తరహా  రాజకీయాలు జరుగుతాయన్న చర్చ ప్రారంభమయింది.  యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో మంత్రి, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ చేసిన సంచలన వ్యాఖ్యలు యూపీ రాజకీయాల్లో పెను తుఫానును సృష్టించాయి. సమాజ్ వాదీ పార్టీకి చెందిన దాదాపు 21 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఎస్పీలో భారీ చీలిక రాబోతోందని ఆయన ప్రకటించారు. 
  
 స్కామ్‌ల ఉచ్చు.. లొంగిపోతారంటున్న మంత్రి రాజ్‌భర్! 

యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన సోషల్ మీడియా వేదికగా ఎస్పీ అగ్రనేత రామ్ గోపాల్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక రహస్య లేఖ సమర్పించారని ఆరోపించారు. యూపీని గతంలో కుదిపేసిన మైనింగ్ కుంభకోణం, గోమతి రివర్ ఫ్రంట్ స్కామ్‌ల మాస్టర్‌మైండ్ ఎవరో అందరికీ తెలుసని.. ఇప్పుడు ఆ కేసుల ఉచ్చు గట్టిగా బిగుస్తుండటంతో ఎస్పీ నేతల్లో ఆందోళన మొదలైందని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల భయంతో ,  నియోజకవర్గాల నిధుల కోసమే స మొత్తం సమాజ్ వాదీ పార్టీ  బీజేపీలో చేరేందుకు లోపాయకారీగా లైన్ క్లియర్ చేసుకుంటోందని, అందులో భాగంగానే 21 మందికి పైగా ఎంపీలు టచ్‌లోకి వచ్చారని రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 అఖిలేష్ యాదవ్ ఫైర్..  ఓడిపోయిన బీజేపీ మైండ్ గేమ్స్ ! 

మంత్రి రాజ్‌భర్ చేసిన ఈ మైండ్ గేమ్‌పై సమాజ్ వాదీ పార్టీ అధినేత, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఇవన్నీ కేవలం ఓటమి భయంతో బీజేపీ ఆడుతున్న చౌకబారు నాటకాలని కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీ ప్రజలు బీజేపీకి గట్టి బుద్ధి చెప్పారని, ఆ పరాజయాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి మైండ్ గేమ్స్ ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం లోక్‌సభలో 37 స్థానాలతో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమ  పార్టీ ఎంతో పటిష్టంగా ఉందని, తమ పార్టీ ఎంపీలు ఎవరూ కూడా ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు.  

2027 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్.. కాంగ్రెస్‌తోనే మైత్రి! 

పార్టీలో చీలిక వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అఖిలేష్ తిప్పికొడుతూ.. రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉమ్మడిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఏ విధంగానైతే మట్టికరిపించామో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఫార్ములాతో యోగి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షాల మధ్య విభేదాలు సృష్టించి మైలేజ్ పొందాలని చూస్తున్న బీజేపీ పప్పులు ఉమ్మడి యూపీలో ఉడకవని, అసలైన ప్రజా సమస్యలైన నిరుద్యోగం, ఆరోగ్య రంగా పతనంపై మాట్లాడకుండా అధికార పక్షం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 

 ఉత్కంఠ రేపుతోన్న యూపీ రాజకీయం.. తదుపరి అడుగు ఎటు 

మహారాష్ట్రలో శివసేన కి చెందిన ఎంపీలు షిండే వర్గంలో విలీనం అయ్యారు.   రాజ్‌భర్ చేసిన ఈ వ్యాఖ్యలు యూపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. లోక్‌సభలో మేజిక్ ఫిగర్ దాటినప్పటికీ, విపక్షాల బలాన్ని మరింత కుంగదీయాలనే వ్యూహంతో బీజేపీ ఆపరేషన్ లోటస్ ను దేశవ్యాప్తంగా విస్తరిస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, అఖిలేష్ యాదవ్ తన ఎంపీలు,  కేడర్‌ను కాపాడుకుంటూ 2027 పోరుకు ఎలా సిద్ధం కాబోతున్నారనేది రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల సరళిని శాసించనుంది.

 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget