అన్వేషించండి

Uttar Pradesh : హోటల్స్ , దుకాణాలపై యజమానుల పేర్లు - యూపీలో కొత్త రాజకీయం - సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court : ఉత్తరప్రదేశ్ లో దుకాణాలపై యజమాానుల పేర్లు రాయాలని ఇచ్చిన ఉత్తర్వుల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఓ వర్గం వారిని టార్గెట్ చేసుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి.

Uttar Pradesh Controversy : హోటల్స్ తో పాటు తినుబండారాలు అమ్మే దుకాణాలపై యజమానుల పేర్లు రాయాలని  ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.  ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశాయి. ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. 

కన్వర్ యాత్ర  చేసే మార్గాల్లో దుకాణాలపై ఆంక్షలు                        

శ్రావణ మాసంలో లక్షలాది కావడ్ యాత్రికులు హరిద్వార్ వెళ్లి అక్కడ గంగా నది నుంచి నీటిని తీసుకొని తిరిగొస్తారు. ఆ క్రమంలో ముజఫర్‌నగర్ మీదుగా కాలి నడకన వెళ్తారు.దీన్ని కన్వర్ యాత్ర అంటారు. ఈ ఏడాది కన్వర్ యాత్ర జులై 22 నుంచి ప్రారంభం కానుంది. వీరు వెళ్లే దారిలో హోటళ్లలోనే తింటారు. అందుకే.. ఆయా హోటళ్లపై దుకాణ యజమానుల పేర్లు రాయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే ముస్లిం యజమానులు ఉన్న హోటళ్లో హిందూయాత్రికులు తినకూడదని చెప్పేందుకు ఈ ఆదేశాల్చిచనట్లుగా దుమారం ప్రారంభమయింది. 

సుప్రీంకోర్టులో పిటిషన్                       

ఇలా దుకాణాలపై యజమానుల పేర్లు రాయమని ఆదేశించడంపై  ఓ స్వచ్ఛంద సంస్థ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అదేవిధంగా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.  మైనార్టీలను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని  పిటిషన్ దారులు సుప్రీంకోర్టులో ఆరోపించారు.  పలువురు పేదలు, కూరగాయలు, టీ దుకాణాలు నడుపుతున్నారని, ఇటువంటి చర్యల వలన వారి ఆర్థిక పరిస్థితి  క్షీణిస్తోందని వాదించారు 

మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు - స్టే                        

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మూడు రాష్ట్ర  ప్రభుత్వాలు జారీ చేసినా ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలిపాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికిప్పుడు దుకాణదారులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. తమ వద్ద ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాలు శుక్రవారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. నేమ్ ప్లేట్ వివాదంపై తదుపరి విచారణ జూలై 26న జరగనుంది.

ఇప్పటికే అనధికారికంగా అమలు                         

కన్వర్ యాత్ర చేపట్టే మార్గంలో పెద్ద ఎత్తున హోటళ్లు , దాబాలు ఉంటాయి. ఇక్కడ హిందూ దేవుల పేర్లతో హోటళ్లను ముస్లింలు నిర్వహిస్తూ ఉంటారు. వారు అపవిత్రమైన  ఆహారం పెడతారన్న ఆరోపణలతో.. వాటి యజమానుల పేర్లను బోర్డులపై రాయాలని డిమాండ్ చేస్తున్నారు. పలు చోట్ల బలవంతంగా ఆ పేర్లతో  బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం అంతకంతకూ దుమారం రేపుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget