అన్వేషించండి

India Plan : పద్దతిగా, అంటు కట్టినట్లుగా పాక్‌పై ఎటాక్‌కు భారత్ ప్లాన్ - అమెరికా మీడియా సంచలన కథనం

Pehalgam Attack Case: పాకిస్తాన్ పై దాడికి భారత్ పద్దతిగా సన్నాహాలు చేస్తోందని అమెరికా మీడియా చెబుతోంది. దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ కు మద్దతు రాకుండా అందరికీ ముందుగానే సమాచారం ఇస్తోంది.

India Preparing For Attack: ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చాలా పక్కాగా ప్లాన్ చేస్తోందని అమెరికన్ మీడియా చెబుతోంది. ముఖ్యంగా దాడులపై అంతర్జాతీయంగా ముఖ్యమైన దేశాలకు భారత్ సమాచారం ఇస్తోంది. వంద మందికిపైగా దౌత్యవేత్తలకు ఇప్పటికే పిలిచి చెప్పిందని.. అంటున్నారు.  భారత్ యుద్ధం చేయాలనుకోవడం లేదు కానీ ఉగ్రవాద శిబిరాలను మాత్రం వదలాలని అనుకోవడం లేదని అంటున్నారు.  అయితే దూకుడుగా.. ఆవేశంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా.. ఉగ్రవాదుల వల్ల జరిగే నష్టం.. వారిపై దాడులు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు.  

ఉగ్రవాద శిబిరాలపై దాడులు తప్పని సరి !

పహల్గాం ఎటాక్ తర్వాత భారత్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా ఉంది. 
ఉగ్రవాద బాధిత దేశంగా.. తమ పై మరోసారి అలాంటి దాడులు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికి వంద దేశాలకుపైగా ప్రతినిధులకు భారత ప్రభుత్వం ఈ మేరకు సమాచారం ఇచ్చిందని అమెరికా మీడియా చెబుతోంది. కొంత మంది దౌత్యవేత్తలకు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల గురించి ఆధారాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  ఇటీవల హమాస్ కు చెందిన వారు కూడా వచ్చి పాక్ సైన్యం ప్రేరేపిత లష్కరే ఉగ్రవాదులతో చర్చలు జరిపారని వివరాలు బయటకు వచ్చాయి. 

పీవోకే లో ఉగ్రవాద శిబిరాలపై పూర్తి సమాచారం 

 పీవోకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలన్నింటిపై భారత్ పూర్తి సమాచారం సేకరించింది. అక్కడ జరుగుతున్న కార్యకలాపాల గురించి.. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద ప్రోత్సాహం గురించి పూర్తి సాక్ష్యాలను సేకరించింది. ఉగ్రవాదుల్ని అంతం చేయాలంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో దాడులు చేయక తప్పదని భారత్ వాదిస్తోంది. తాము ఆ పని చేయబోతున్నామని ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయవద్దని విజ్ఞప్తి చేస్తోంది. అలా చేయడం ఉగ్రవాదుల్ని సమర్థించడమే అవుతుందన్న సంకేతాలను భారత ప్రభుత్వం  పంపుతోంది. పీవోకే ప్రస్తుతం పాక్ అధీనంలోనే ఉంది. భారత్ దాడి చేస్తే అది పాక్ భూభాగంలో చేసినట్లుగా అవుతుంది.  

 

సన్నాహాలు పూర్తి చేసిన కేంద్రం

కేంద్రం  రోజువారీగా ఉగ్రవాదులపై దాడుల సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  దీంతో పాకిస్తాన్  ఉన్న పళంగా వారిని పీవోకే నుంచి ఉగ్రవాద క్యాంపుల్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పాకిస్తాన్ సైన్యం వారిని తొందరపెడుతున్నట్లుగా  నిఘా వర్గాలు చెబుతున్నాయి.  తమ భూభాగంపై దాడి చేసినా.. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే.. ప్రపంచం మద్దతు భారత్ కే ఉంటుందని పాకిస్తాన్ కూడా అంచనా వేస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Iran US War: మారుతున్న యుద్ధ సమీకరణాలు.. ఇరాన్‌ను నడిపిస్తున్నది ఎవరు! US- ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న సపోర్ట్
మారుతున్న యుద్ధ సమీకరణాలు.. ఇరాన్‌ను నడిపిస్తున్నది ఎవరు! US- ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న సపోర్ట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే

వీడియోలు

Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Embed widget