Snakebite: పాముని చూసి పారిపోవాలి కానీ పట్టుకుని ఆడుకుంటే కాటేస్తుంది-ఆ పెద్దాయన అదే చేసి చచ్చిపోయాడు ! వీడియో
UP man: పాములు కనిపిస్తే పారిపోవాలి. లేకపోతే స్నేక్ క్యాచర్స్ పిలవాలి. కానీ ఆ పెద్దాయన ఆ పామును పట్టుకుని అందరి ముందు గొప్పలు పోయాడు.కానీ అదే ఆయనకు చివరి రోజు అయింది.

UP man died from a snakebite while playing with poisonous snake: పాములు మునుషుల్ని చూసి భయపడి పారిపోతాయి. అలాగే మనుషులు కూడా చూసి పారిపోవాలి. లేదంటే స్నేక్ క్యాచర్స్ ను పిలిచించి వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేయాలి.కానీ వాటితో ఆటాడుకుంటే కాటేస్తాయి. బతకడం కష్టం.
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో రాంపూర్ సమీపంలోని ఒక ప్రాంతంలో ఈ భారీ సర్పం ప్రత్యక్షమైంది. ఆ పామును చూసి భయపడిన స్థానికులు దూరంగా ఉండిపోయారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి మాత్రం అందరి ముందు తనకు ఎంతో ధైర్యం అని నిరూపించాలనుకున్నారు. వెంటనే ఆ పామును పట్టుకుని ఆటలాడాడు. కాసేపు పాము విదిలించుకునేందుకు ప్రయత్నించింది కానీ వదలకపోవడంతో కాటు వేసింది. కాటు వేసిన కొద్ది సేపటికే సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి.
sometimes on the hands, sometimes around the neck-a Passion for showing off bravery became the reason for death.
— social scientist (@socialscie50255) January 15, 2026
in pipalia Gopal village of Rampur district in UP,an elderly Man was playing with a poisonous cobra like a toy.
the nearly 6-foot -long snake was being used to… pic.twitter.com/01ZrmmbKy2
సాధారణంగా అడవుల్లో ఉండే ఇటువంటి భయంకరమైన సర్పం జనావాసాల్లోకి రావడం అరుదు. కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరితమైన పాములు కాటు వేసినప్పుడు, శరీరంలోని నాడీ వ్యవస్థ క్షణాల్లో స్తంభించిపోతుందని, సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలు కాపాడటం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
Rampur: Farmer Dies After Playing with Cobra That Climbed onto His Head and Bit Him
— Atulkrishan (@iAtulKrishan1) January 14, 2026
In Rampur, a farmer named Jiraj encountered a cobra while working in his field. Instead of moving away, he picked up the snake and began playing with it.
When his brother tried to separate the… pic.twitter.com/hvWcAOqkRi
ప్రజలు ఇటువంటి విష సర్పాలను చూసినప్పుడు వాటికి దూరంగా ఉండాలని, సొంతంగా పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మృతుడి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన జీవులతో తలపడటం ఎంతటి విపత్కర పరిణామాలకు దారితీస్తుందో ఈ రాంపూర్ ఉదంతం మరోసారి నిరూపించింది.























