అన్వేషించండి

తమిళులపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ తరవాత క్షమాపణలు

Shobha Karandlaje: తమిళులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి ఆ తరవాత క్షమాపణలు చెప్పారు.

Shobha Karandlaje Tamilians Remark: కేంద్రమంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసు నిందితుడు తమిళనాడుకి చెందిన వ్యక్తే అని అన్నారు. దీనిపై తమిళులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ కూడా ఈ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. తమిళనాడుకి చెందిన వ్యక్తే కేఫ్‌లో బాంబు పెట్టాడంటూ శోభా చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. స్టాలిన్ విమర్శలకి కౌంటర్ ఇచ్చిన ఆమె ఆ తరవాత క్షమాపణలు చెప్పారు. రామేశ్వరం పేలుడు కేసులో ప్రధాన నిందితుడు తమిళాడులోని కృష్ణగిరి అడవుల్లోనే శిక్షణ పొందాడని ఆరోపించారు శోభ కరంద్లాజే. ఆమె చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

"తమిళనాడుకి చెందిన వాళ్లే ఈ అడవుల్లోకి వస్తుంటారు. ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటారు. బాంబులు ఎలా పెట్టాలో నేర్చుకుంటారు. అలా నేర్చుకున్న వ్యక్తే రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టాడు"

- శోభా కరంద్లాజే 

ఈ వీడియోని రీట్వీట్ చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ తీవ్రంగా మండి పడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"ఎలాంటి ఆధారాల్లేకుండా ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదు. బీజేపీని పక్కన పెట్టేయడంలో తమిళులు, కన్నడిగులు ఒకేరకంగా ఆలోచిస్తారు. జాతీయ సమైక్యతకి, శాంతియుత వాతావరణానికి ఇబ్బంది కలిగించే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రతి ఒక్కరూ ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్లే. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించాలి"

- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి

ఆ తరవాత కేంద్రమంత్రి క్షమాపణలు చెబుతూ X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తమిళ ప్రజలందరినీ క్షమాపణలు కోరారు. మనోభావాలు దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. 

"తమిళనాడు ప్రజలందరినీ క్షమాపణలు చెబుతున్నాను. మీ మనోభావాలు దెబ్బ తీయాలని నేనీ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం కృష్ణగిరి అడవుల్లో ట్రైనింగ్ అవుతున్న వారి గురించి మాత్రమే మాట్లాడాను. నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధ పడి ఉంటే క్షమించండి. ఆ వ్యాఖ్యల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను"

- శోభా కరంద్లాజే, కేంద్ర మంత్రి

 

 

Also Read: రామ్ దేవ్ బాబాకి సుప్రీంకోర్టు నోటీసులు, పతంజలి ప్రకటనలపై తీవ్ర అసహనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget