అన్వేషించండి

Bhagat Singh Koshyari: గవర్నర్‌ను జైల్లో పెట్టాలా తొలగించాలా నిర్ణయించుకోండి - కొష్యారి వ్యాఖ్యలపై ఠాక్రే ఆగ్రహం

Bhagat Singh Koshyari: మహారాష్ట్ర గవర్నర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: ఉద్దవ్ ఠాక్రే 

గుజరాతీలు, రాజస్థానీలు లేకపోతే రాష్ట్రానికి ఆదాయమే ఉండదన్న మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. మరాఠీలను దారుణంగా అవమానించారంటూ తీవ్రంగా మండి పడ్డారు. "నాకు గవర్నర్ హోదాలో ఉన్న వారిని కించపరచాలనే ఉద్దేశం లేదు. ఆ పదవికి నేనెంతో గౌరవమిస్తాను. కానీ భగత్ సింగ్ కొష్యారి మరాఠీలను కించపరిచారు. ప్రజల్లోనూ ఆయన వ్యాఖ్యలు ఆగ్రహం కలిగిస్తున్నాయి. మతపరంగా ప్రజల్ని విడగొట్టాలని చూస్తున్నారు. హద్దులు దాటి మరీ మాట్లాడారు" అని అసహనం వ్యక్తం చేశారు ఉద్దవ్ ఠాక్రే. "దాదాపు రెండున్నరేళ్లుగా ఆయన మహారాష్ట్రలోనే ఉంటున్నారు. ఇక్కడి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఇప్పుడాయన కొల్హాపూర్ చెప్పులను చూడాల్సిన సమయం ఆసన్నమైంది" అని కాస్త ఘాటుగానే స్పందించారు. ఆయన వెంటనే మరాఠీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయనను పదవి నుంచి తొలగించటమా లేదంటే జైల్లో పెట్టడమా అన్నది అధిష్ఠానమే నిర్ణయించుకోవాలని సూచించారు. గతంలో సావిత్రిభాయ్ ఫూలే గురించి కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు.

 

మరాఠీలకు ఇది తీరని అవమానం : సంజయ్ రౌత్ 

దాదాపు నెల రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. రోజూ శివసేన, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ వివాదం కొనసాగుతుండగానే, మరోటి తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారి చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను తీసేస్తే రాష్ట్రానికి రెవెన్యూనే ఉండదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయి, థానే నుంచి వారిని వేరు చేయలేమని, వారు అక్కడి నుంచి వెళ్లిపోతే రాష్ట్రానికి ఆదాయమే ఉండదన్న ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశారు. అంతే కాదు. ఇదే జరిగితే... ముంబయి దేశ ఆర్థిక రాజధానిగానూ కొనసాగలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఠాక్రే శివసేన తీవ్రంగా మండిపడుతోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గవర్నర్‌పై ఆగ్రహించారు. "మరాఠీలను అవమానించారు" అంటూ ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిజానికి ఎన్నో ఏళ్లుగా...మహారాష్ట్రలో మరాఠీలకు, గుజరాతీలకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాతావరణం ఉన్న రాష్ట్రంలో గవర్నర్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంపై సంజయ్ రౌత్‌ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన చేసిన కామెంట్స్‌ను
వెంటనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఖండించాలని డిమాండ్ చేశారు.

"మరాఠీల గౌరవానికి భంగం కలిగించారు" అని ట్విటర్‌లో గవర్నర్‌ ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. భాజపాకు చెందిన ముఖ్యమంత్రి రాగానే...మరాఠీలకు అవమానం జరిగిందని అన్నారు సంజయ్ రౌత్. కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, సచిన్ సావంత్ కూడా ఈ వివాదంపై స్పందించారు. గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని అన్నారు. 

Also Read: Minister Roju : ఆ ఫొటో నా జీవితాన్నే మార్చేసింది - మంత్రి రోజా

Also Read: NTR T Shirt Cost : 'బింబిసార' ఫంక్షన్‌కు ఎన్టీఆర్ వేసుకొచ్చిన టీ షర్ట్ రేటు ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Breaking News:విశాఖలో సైకిల్‌పై తిరిగిన చంద్రబాబు- మొక్కలు నాటిన వాళ్లకే టికెట్లు అంటా కామెంట్స్
విశాఖలో సైకిల్‌పై తిరిగిన చంద్రబాబు- మొక్కలు నాటిన వాళ్లకే టికెట్లు అంటా కామెంట్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేటలో అగ్ని ప్రమాదంతో మెట్రో పిల్లర్‌లో పగుళ్లు రాలేదు" హైదరాబాద్‌ మెట్రో ఎండీ వివరణ 
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
Embed widget