అన్వేషించండి

TTD New Board : టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా ఖరారు ! రేపోమాపో 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల లిస్ట్

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. చైర్మన్‌ కాకుండా 25 మంది సభ్యులు ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో మరో 50 మంది ఉండే అవకాశం ఉంది.


తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలోఈ సారి 75 మందికిపైగా ప్రభుత్వం చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది. ఇంత మందిని బోర్డులో చేరిస్తే భక్తల నుంచి తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో  50 మందిని ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో చేర్చాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా పాలక మండలి సభ్యుల జాబితాను ప్రభుత్వం ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

25 మందితో టీటీడీ పాలక మండలి ఏర్పాటు ! 

పాలక మండలి సభ్యులుగా ఏపీ నుండి పోకల అశోక్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ,ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి , గొల్ల బాబూరావు, మధుసూదన్ యాదవ్‌లకు చాన్సిచ్చారు. యానాంకు చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకు కూడా చోటిచ్చారు.  తెలంగాణ నుండి మైహోం అధినేత రామేశ్వర్ రావు, లక్ష్మినారాయణ, పార్థసారధి, మూరంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్ లకు అవకాశం దక్కనున్నట్లు సమాచారం. తమిళనాడు నుండి శ్రీనివాస్, ఎమ్మెల్యే నందకుమార్,కన్నయ్య, కర్ణాటక నుండి శశిధర్, ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. మహారాష్ట్ర నుండి శివసేన కార్యదర్శి మిలింద్ కు అవకాశం కల్పించారు. ప్రస్తుతం పాలక మండలి సభ్యుల జాబితాలను ప్రకటించారు. రేపో..మాపో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. Also Read : జగన్, విజయసాయిలకు ఊరట ... బెయిల్ రద్దు పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు !

రేపో,మాపో మరో 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల ప్రకటన 

టీటీడీ పాలక మండలికి ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నారు.  గత పాలకమండలి గడువు పూర్తయిన తర్వాత స్పెసిఫైడ్ అధారిటీని నియమించారు. ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డినే చైర్మన్‌గా నియమించారు. పాలక మండలి సభ్యుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. పదవీ కాలం ముగిసిపోయిన పాలక మండలిలో  చైర్మన్‌‍తో పాటు 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ఆఫీషియో సభ్యులు, ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు.  మొత్తంగా 36 మందిని పాలకమండలిలో ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ 12 మందితో టీటీడీ పాలక మండలి ఉంది. తర్వాత టీడీపీ హయాంలో ఈ సంఖ్యను 15కు పెంచారు. ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులకు చాన్సిచ్చారు. వైసీపి ప్రభుత్వం పాలక మండలి సంఖ్యను 25కి పెంచుతూ..11 మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు కల్పించింది.  ఇప్పుడు మరోసారి రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇప్పటి వరకూ ఉన్న 36 మందిని 72 మందిని చేసే ఆలోచనలో ఉంది. ఇంకా ఎక్కువే కావొచ్చని చెబుతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన చట్టంలో మార్పుల ప్రకారం  24 మంది మాత్రమే బోర్డులో ఉంటాలి. ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో ఎంత మందినైనా చేర్చుకోవచ్చు. అందుకే ఇప్పుడు కూడా ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో యాభై మంది వరకూ చేర్చే అవకాశం కనిపిస్తోంది. Also Read : వివేకా హత్య కేసు.. సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఆ నలుగురు వ్యక్తులు లోపలికి ఎలా వచ్చారు?

తమిళనాడు కోటాలో సభ్యునిగా నియమించిన కన్నయ్యపై తీవ్ర అభియోగాలు

తమిళనాడు కోటాలో నియమితులైన కన్నయ్య పై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. 2018లోనే పిఎంఓ ఆదేశాల మేరకు కన్నయ్యపై సిబిఐ విచారణ జరపాలని రైల్వే విజిలెన్స్ శాఖ కోరింది. ఆయనకు 1500 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి. కన్నయ్య ఛైర్మన్ గా ఉన్న రైల్వే సొసైటీ సంబంధించి మరో 108 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.  అయినప్పటికీ టీటీడీ పాలక మండలిలో చోట ుకల్పించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది. Also Read : ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కరణే కారణం !

లాబీయింగ్ కోసం ఎవర్నీ సభ్యులుగా నియమించలేదన్న సజ్జల

పాలక మండలి నియామకం అంశంపై కొద్ది రోజులుగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. టీటీడీ పదవుల ఆశ చూపి ఇతర పనులు చేయించుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అయితే అలాంటి అవసరం లేదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రత్యేక ఆహ్వానితులకు ప్రత్యేక అధికారాలు ఉండవని శ్రీవారి సేవ కోసమే వారికి పదవులు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.  

Also Read : ఏపీలో నేరాల విప్లవం - తెలంగాణలో సైబర్ క్రైమ్ హవా ! వెలుగులోకి కీలకమైన నేర గణాంకాలు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Political Publicity: ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
Breaking News: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం- టిప్పర్ ఢీకొని నలుగురు కూలీలు మృతి 
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం- టిప్పర్ ఢీకొని నలుగురు కూలీలు మృతి 
Prateek Yadav Snake Tattoo: వైరల్ అవుతోన్న ప్రతీక్ యాదవ్ చేతిపై పాము టాటూ! దీని అర్థం ఏంటో తెలుసా?
వైరల్ అవుతోన్న ప్రతీక్ యాదవ్ చేతిపై పాము టాటూ! దీని అర్థం ఏంటో తెలుసా?
CSK Playoff Hopes Dented: లక్నో చేతిలో ఓట‌మితో చెన్నై ప్లేఆఫ్స్ ఆశలకు గట్టి దెబ్బ! నాకౌట్ కు చేరాలంటే CSK ఏం చేయాలి..?
లక్నో చేతిలో ఓట‌మితో చెన్నై ప్లేఆఫ్స్ ఆశలకు గట్టి దెబ్బ! నాకౌట్ కు చేరాలంటే CSK ఏం చేయాలి..?

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Political Publicity: ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
Reliance AI Data Centre At Bhogapuram: ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌!భోగాపురంలో 855 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం!
ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌!భోగాపురంలో 855 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం!
Anasuya Bikini Photos: బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్
బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో సూర్య బాక్సాఫీస్ స్టామినా ఇంతేనా... వీరభద్రుడు ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో సూర్య బాక్సాఫీస్ స్టామినా ఇంతేనా... వీరభద్రుడు ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Bandi Bageerath Case: బాధితురాలు మైనర్ అని తేలితే భగీరథ్‌ను ఎవరూ కాపాడలేరు - సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే?
బాధితురాలు మైనర్ అని తేలితే భగీరథ్‌ను ఎవరూ కాపాడలేరు - సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే?
Breaking News: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం- టిప్పర్ ఢీకొని నలుగురు కూలీలు మృతి 
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం- టిప్పర్ ఢీకొని నలుగురు కూలీలు మృతి 
Anasuya Bharadwaj: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్... ఫ్యామిలీతో బీచ్ రిసార్ట్‌లో హ్యాపీ హ్యాపీగా
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్... ఫ్యామిలీతో బీచ్ రిసార్ట్‌లో హ్యాపీ హ్యాపీగా
Prateek Yadav Snake Tattoo: వైరల్ అవుతోన్న ప్రతీక్ యాదవ్ చేతిపై పాము టాటూ! దీని అర్థం ఏంటో తెలుసా?
వైరల్ అవుతోన్న ప్రతీక్ యాదవ్ చేతిపై పాము టాటూ! దీని అర్థం ఏంటో తెలుసా?
Embed widget