అన్వేషించండి

Top Headlines Today: ఈనెల 16న వైసీపీ అభ్యర్థుల జాబితా- ప్రెస్‌మీట్‌ నుంచే బీఆర్‌ఎస్‌ నేతను తీసుకెళ్లిపోయిన మాజీ మంత్రి

AP Telangana Latest News 13 March 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Telugu News Today: ఈనెల 16న వైసీపీ అభ్యర్థుల జాబితా- ఇడుపులపాయలో ప్రకటించనున్న జగన్
ఈనెల 16న వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో జగన్ ప్రకటించనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఫైనల్‌ జాబితా సిద్ధమైపోయింది. దీన్ని ఆ పార్టీ అధినేత జగన్ ఈ నెల 16వ తేదీన ప్రకటించనున్నారు. ఇడుపులపాయ వేదికగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా - కార్ల ర్యాలీ కూడా ! అసలేం జరిగింది?
వైసీపీలో ముద్రగడ చేరిక వాయిదా పడింది. ఈ నెల 14న   తన అనుచరులతో సహా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని గతంలో ప్రకటించారు. ఇందు కోసం ఏర్పాట్లు చేసుకున్నారు.  ద్ద సంఖ్యలో అనుచరులు వాహనాల్లో తరలి రండి, ఎవరి భోజనాలు వారే తెచ్చుకోండి అంటూ ఆమధ్య ముద్రగడ ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. అయితే అనూహ్యంగా ఆయన మళ్లీ తన అనుచరులకు మరో లేఖ రాశారు. చేరిక వాయిదా పడిందని సమాచారమిచ్చారు.  మరో తేదీలో తాను ఒక్కడినే వెళ్లి పార్టీలో చేరుతానని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ప్రెస్‌మీట్‌ నుంచే బీఆర్‌ఎస్‌ నేతను తీసుకెళ్లిపోయిన మాజీ మంత్రి- హనుమకొండలో హైడ్రమా
లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో పరిస్థితులు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అధికారానికి దూరమైన కారణంగా చాలా మంది నేతలు ఆ పార్టీని వీడి వేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇది ఆ పార్టీ కేడర్‌కు తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అలా పార్టీ మారాలని ఆలోచన ఉన్న వారిలో హనుమకొండకు చెందిన ఆరూరి రమేష్‌. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన రోజే కేంద్రం కీలక నిర్ణయం- సెప్టెంబర్‌ 17 అధికారిక కార్యక్రమాలు నిర్వహించేలా గెజిట్
ఓ వైపు అమిత్‌షా పర్యటన మరోవైపు లోక్‌సభ ఎన్నికలు ఇలాంటి టైంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో వివాదానికి కారణమవుతున్న సెప్టెంబర్‌ 17ను అధికారికం చేసింది. ఇకపై ఆ రోజును "హైదరాబాద్‌ లిబరేషన్ డే"గా నిర్వహించాలని కేంద్రం గెజిట్‌ జారీ చేసింది. సెప్టెంబర్‌ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని దీన్ని స్వేచ్ఛకు గుర్తుగా ప్రజలను భాగస్వాములను చేయాలని ఎప్పటి నుంచో బీజేపీతోపాటు చాలా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

చిలకలూరిపేట సభ ఏర్పాట్లు ప్రారంభం- ప్రాంగణంలో లోకేష్ పూజలు
ఈనెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే "టీడీపీ-జనసేన-బీజేపీ" సభ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సభా స్థలి వద్ద టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ భూమి పూజ చేసి ప్రక్రియ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్‌తోపాటు బీజేపీ, జనసేన నాయకులు హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని నారా లోకేష్ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద పనులను ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget