అన్వేషించండి

PM Modi : ప్రధాని మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు - కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా శరద్ పవార్ !

ప్రధాని మోదీకి ఆగస్టు 1న తిలక్ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శరద్ పవార్ ను ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది.


PM Modi :    ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత నాయకత్వానికి గుర్తింపుగా, పౌరుల్లో దేశభక్తిని పెంపొందించినందుకు గాను ఆగస్టు 1న పూణేలో లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నారు.   "తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ (హింద్ స్వరాజ్ సంఘ్) లోకమాన్య తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ అవార్డునుప్రకటించింది.   ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు దీపక్ తిలక్ ప్రకటించారు.  

ఆత్మనిర్భర్ భారత్ కాన్సెప్ట్‌లో ప్రధానమంత్రి అత్యున్నత నాయకత్వంలో భారతదేశం అద్భుతమైన  ప్రగతి సాధించిందని "తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ (హింద్ స్వరాజ్ సంఘ్) ప్రశంసించింది.  పౌరులలో దేశభక్తి భావనను మేల్కొలిపి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచారు. ఆయన పట్టుదల, కృషి, ఆయన కృషికి ప్రాధాన్యతనిస్తూ తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ధర్మకర్తలు ఆయనను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశామని తెలిపింది.                        

ఈ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఆహ్వానించారు. ఆయన కూడా హాజరవ్వాలని నిర్ణయించారు. ఇతర ఆహ్వానితులలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్ మరియు అజిత్ పవార్ ఉన్నారు. ఈ ఆహ్వానితుల జాబితా కూడా ఆసక్తికరంగా మారింది. 

ఎన్సీపీలో చీలిక తెచ్చి  మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన (ఏక్‌నాథ్ షిండే) ప్రభుత్వంలో చేరిన శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ‘మహా’ రాజకీయాలను ఓ కుదుపు కుదిపారు. త్వరలోనే  వీరిద్దరూ కిలిస తిలక్ అవార్డు ప్రదానోత్సవ వేడుకలో పాల్గొనుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వేదిక పంచుకోబోతున్నారు.  ఎన్సీపీకి అజిత్ గుడ్‌బై చెప్పిన తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించనుండడం అదే తొలిసారి అవుతుంది.                         

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు పూర్తిగా బీజేపీ కనుసన్నల్లో జరిగాయని శరద్ పవార్ ఆరోపిస్తున్నారు. అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని అంటున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రధాని మోదీకి అవార్డు బహుకరణ వేడుకకు.. శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యేందుకు అంగీకరించడం .. రాజకీయంగా పెను సంచలనం అయ్యే అవకాశం ఉంది. పార్టీని కాపాడుకునేందుకు శరద్ పవార్ కూడా బీజేపీతో చేతులు కలుపుతారన్న  ప్రచారం ఓ వైపు జరుగుతున్న సమయంలో.. ఈ అవార్డు ప్రధానోత్సవ వేడుక హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. శరద్ పవార్ ఎప్పుడు ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టం. అందుకే ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుక.. తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు మరింత మారే అవకాశం ఉంది.                                            
 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
Embed widget