అన్వేషించండి
ఉద్యమకారులకు శుభవార్త, కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం
Telangana CM Revanth Reddy: తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంగా ఉద్యమకారులపై నమోదైన కేసులు ఎత్తివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఉద్యమకారులకు శుభవార్త, కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం
ఉద్యమకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009 డిసెంబర్ 09 నుంచి 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై నమోదైన అన్ని కేసుల వివరాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీలను అడిషనల్ డీజీపీ (సీఐడీ) శుక్రవారం ఆదేశించారు. ఇప్పటికే తొలి కేబినెట్ భేటీలో హామీల అమలుపై చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజాగా ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరించి, కేసులన్ని ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















