Telangana Andhra Pradesh Rains Update: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు - హైదరాబాద్లో మళ్లీ జడివాన - ఆదివారం ఎలా ఉంటుందంటే ?
Southwest Monsoon Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

IMD Orange Alert Hyderabad: తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇన్నాళ్లూ ఉక్కిరిబిక్కిరి చేసిన ఎండ తీవ్రతకు ఎట్టకేలకు తెరపడింది. నైరుతి రుతుపవనాల విస్తరణతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు ఉభయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు ఏపీలోని సెంట్రల్ కోస్తా, రాయలసీమ ప్రాంతాలను వరుణుడు పలకరించడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ.. ఒక్కసారిగా కురిసిన కుండపోత వానల వల్ల పలు చోట్ల జనజీవనం స్తంభించింది.
#Tellapur to Osman Nagar road Flooded.
— Hyderabad Rains (@Hyderabadrains) June 13, 2026
⚠️ Traffic Advisory: Commuters are advised to avoid this route and use alternative roads until waterlogging reduces. pic.twitter.com/GzzFJHjXDd
హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి వర్షం
హైదరాబాద్ నగరంలో శనివారం మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఐఎండీ హైదరాబాద్ కేంద్రం నగరానికి ఎల్లో, పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోటి, సుచిత్ర, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నాంపల్లి, మియాపూర్, మాదాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈకల గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకస్మికంగా కురిసిన ఈ వాన వల్ల ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే చర్యలు చేపట్టాయి. తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు శనివారం రాత్రి వరకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
#13JUNE 5:10PM⚠️
— Hyderabad Rains (@Hyderabadrains) June 13, 2026
Steady light rains continue across Western Hyderabad 🌧️ and are likely to persist for the next 1 hour.
Meanwhile, powerful thunderstorms are moving down from Medak ⛈️⚡
So within the next 30 minutes, there are chances for another heavy spell depending on band… pic.twitter.com/czyfg8k09g
ఏపీలోనూ బలంగా రుతుపవనాల ప్రభావం
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ రుతుపవనాల ప్రభావం బలంగా కనిపిస్తోంది. సెంట్రల్ ఆంధ్రా పరిధిలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి శనివారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయవాడ నార్త్ నియోజకవర్గంలో అత్యధికంగా 102 మిమీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా విజయవాడలోని పలు ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. అలాగే రాయలసీమలోని కర్నూలు మంత్రాలయం 50 మిమీ , అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతుండటంతో రైతన్నలు సాగు పనులకు సిద్ధమవుతున్నారు.
⛈️ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ☁️ మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 13, 2026
🌩️పిడుగులతో తేలికపాటి వర్షాలు: శ్రీకాకుళం, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ జిల్లాల్లో (1/2) pic.twitter.com/kLOJL4Kwxa
మరో రోజు ఈదురుగాలులతో వర్షం
భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో జూన్ 14 వరకు భారీ వర్షాలు, ఈదురు గాలులు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్లు జారే ప్రమాదం ఉన్నందున వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















