అన్వేషించండి

students strike: నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళన

నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా నాసిరకం భోజనం పెడుతున్నా ఉన్నతస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం  చేశారు. నాసిరకం భోజనం తినడంతో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. అర్థ ఆకలితోనే బాధపడతున్నారు. నాణ్యమైన ఆహారం పెట్టాలని పలుమార్లు ఆర్జీయూ కేటీ అధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని అధికారల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ఆందోళనలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఉడకని అన్నం, రుచిపచి లేని పప్పు కూర, నీళ్ల రసం, గట్టి ఇడ్లీ, కుళ్లిన కోడి గుడ్లు, నాసిరకం చికెన్ పెట్టడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అశుభ్ర వాతావరణంలో మెస్‌లు కొనసాగిస్తున్నా.. ట్రిపుల్ ఐటీ అధికారులు పర్యవేక్షించడం లేదని విద్యార్థులు అంటున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మానేసిన విద్యార్థులు నూజివీడు ట్రిపుల్ ఐటీలో బైఠాయించి ఆందోళనకు దిగారు.నాణ్యమైన ఆహారం అందించే వరకు ఆందోళనలను విరమించబోమని విద్యార్థులు డిమాండ్ చేశారు.

భోజనంలో నాణ్యత  పాటించకుండా వడ్డించడం సరికాదన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థులు ఆందోళన చెందారు. గత కొన్ని రోజుల నుంచి భోజనం బాగోలేదంటూ తమగోడు వినిపించిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆలోచించారు. కొన్నిసార్లు భోజనం చేయకుండా తరగతులకు హాజరవుతున్నామని దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నారు వెల్లడించారు. భోజనం బాగో లేకపోవడంతో బయటకు వెళ్లి తింటున్నామని దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే భోజన ఏజెన్సీని తొలగించి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...భోజనం అసలు బాగోవడంలేదని, పెరుగులో పిండి కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కూడా తినేందుకు లేకుండా భోజనం తయారు చేస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. తమకు నాలుగు ఐదు కూరలతో భోజనాలు వద్దని వండే ఒక కూర అయినా తాము తినేలా ఉండాలని విద్యార్థుల విన్నవిస్తున్నారు. ఉదయం పూటైతే గారెలు గోడకు కొట్టినా కూడా పగలని విధంగా పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ఆందోళనను చూసి త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. 

విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండేలా చూస్తానని త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సరైన భోజనం పెట్టకపోతే మెస్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తానే స్వయంగా ఒక పది రోజులు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని  త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మెస్ నిర్వహకులు వచ్చి తనను కలవాలని నూజివీడు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. త్రిబుల్ ఐటీ డైరెక్టర్ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. తమ సమస్యను, ఇబ్బందులను  పరిష్కరించిన త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget