అన్వేషించండి

students strike: నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళన

నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా నాసిరకం భోజనం పెడుతున్నా ఉన్నతస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం  చేశారు. నాసిరకం భోజనం తినడంతో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. అర్థ ఆకలితోనే బాధపడతున్నారు. నాణ్యమైన ఆహారం పెట్టాలని పలుమార్లు ఆర్జీయూ కేటీ అధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని అధికారల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ఆందోళనలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఉడకని అన్నం, రుచిపచి లేని పప్పు కూర, నీళ్ల రసం, గట్టి ఇడ్లీ, కుళ్లిన కోడి గుడ్లు, నాసిరకం చికెన్ పెట్టడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అశుభ్ర వాతావరణంలో మెస్‌లు కొనసాగిస్తున్నా.. ట్రిపుల్ ఐటీ అధికారులు పర్యవేక్షించడం లేదని విద్యార్థులు అంటున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మానేసిన విద్యార్థులు నూజివీడు ట్రిపుల్ ఐటీలో బైఠాయించి ఆందోళనకు దిగారు.నాణ్యమైన ఆహారం అందించే వరకు ఆందోళనలను విరమించబోమని విద్యార్థులు డిమాండ్ చేశారు.

భోజనంలో నాణ్యత  పాటించకుండా వడ్డించడం సరికాదన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థులు ఆందోళన చెందారు. గత కొన్ని రోజుల నుంచి భోజనం బాగోలేదంటూ తమగోడు వినిపించిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆలోచించారు. కొన్నిసార్లు భోజనం చేయకుండా తరగతులకు హాజరవుతున్నామని దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నారు వెల్లడించారు. భోజనం బాగో లేకపోవడంతో బయటకు వెళ్లి తింటున్నామని దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే భోజన ఏజెన్సీని తొలగించి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...భోజనం అసలు బాగోవడంలేదని, పెరుగులో పిండి కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కూడా తినేందుకు లేకుండా భోజనం తయారు చేస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. తమకు నాలుగు ఐదు కూరలతో భోజనాలు వద్దని వండే ఒక కూర అయినా తాము తినేలా ఉండాలని విద్యార్థుల విన్నవిస్తున్నారు. ఉదయం పూటైతే గారెలు గోడకు కొట్టినా కూడా పగలని విధంగా పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ఆందోళనను చూసి త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. 

విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండేలా చూస్తానని త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సరైన భోజనం పెట్టకపోతే మెస్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తానే స్వయంగా ఒక పది రోజులు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని  త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మెస్ నిర్వహకులు వచ్చి తనను కలవాలని నూజివీడు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. త్రిబుల్ ఐటీ డైరెక్టర్ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. తమ సమస్యను, ఇబ్బందులను  పరిష్కరించిన త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Embed widget