అన్వేషించండి

students strike: నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళన

నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా నాసిరకం భోజనం పెడుతున్నా ఉన్నతస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం  చేశారు. నాసిరకం భోజనం తినడంతో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. అర్థ ఆకలితోనే బాధపడతున్నారు. నాణ్యమైన ఆహారం పెట్టాలని పలుమార్లు ఆర్జీయూ కేటీ అధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని అధికారల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ఆందోళనలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఉడకని అన్నం, రుచిపచి లేని పప్పు కూర, నీళ్ల రసం, గట్టి ఇడ్లీ, కుళ్లిన కోడి గుడ్లు, నాసిరకం చికెన్ పెట్టడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అశుభ్ర వాతావరణంలో మెస్‌లు కొనసాగిస్తున్నా.. ట్రిపుల్ ఐటీ అధికారులు పర్యవేక్షించడం లేదని విద్యార్థులు అంటున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మానేసిన విద్యార్థులు నూజివీడు ట్రిపుల్ ఐటీలో బైఠాయించి ఆందోళనకు దిగారు.నాణ్యమైన ఆహారం అందించే వరకు ఆందోళనలను విరమించబోమని విద్యార్థులు డిమాండ్ చేశారు.

భోజనంలో నాణ్యత  పాటించకుండా వడ్డించడం సరికాదన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థులు ఆందోళన చెందారు. గత కొన్ని రోజుల నుంచి భోజనం బాగోలేదంటూ తమగోడు వినిపించిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆలోచించారు. కొన్నిసార్లు భోజనం చేయకుండా తరగతులకు హాజరవుతున్నామని దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నారు వెల్లడించారు. భోజనం బాగో లేకపోవడంతో బయటకు వెళ్లి తింటున్నామని దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే భోజన ఏజెన్సీని తొలగించి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...భోజనం అసలు బాగోవడంలేదని, పెరుగులో పిండి కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కూడా తినేందుకు లేకుండా భోజనం తయారు చేస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. తమకు నాలుగు ఐదు కూరలతో భోజనాలు వద్దని వండే ఒక కూర అయినా తాము తినేలా ఉండాలని విద్యార్థుల విన్నవిస్తున్నారు. ఉదయం పూటైతే గారెలు గోడకు కొట్టినా కూడా పగలని విధంగా పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ఆందోళనను చూసి త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. 

విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండేలా చూస్తానని త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సరైన భోజనం పెట్టకపోతే మెస్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తానే స్వయంగా ఒక పది రోజులు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని  త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మెస్ నిర్వహకులు వచ్చి తనను కలవాలని నూజివీడు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. త్రిబుల్ ఐటీ డైరెక్టర్ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. తమ సమస్యను, ఇబ్బందులను  పరిష్కరించిన త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసరావుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Israel-Iran War: ఒకే దాడిలో 48 మంది ఇరాన్ నేతలు మృతి, కొత్త నాయకత్వంతో చర్చలకు రెడీ: డొనాల్డ్ ట్రంప్
ఒకే దాడిలో 48 మంది ఇరాన్ నేతలు మృతి, కొత్త నాయకత్వంతో చర్చలకు రెడీ: డొనాల్డ్ ట్రంప్
Ind vs WI Highlights: సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్‌పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్‌పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
CM Revanth Reddy: గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
Israel Strike on Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ మృతి.. కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ మృతి.. కొనసాగుతున్న ఉద్రిక్తతలు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget