అన్వేషించండి

Shiv Sena Aditya Thackera : "చంద్రబాబూ.. మీ ప్రభుత్వం కూలిపోతుంది.." హెచ్చరించిన ఆదిత్య ఠాక్రే

శివసేన (Uddhav Balasaheb Thackeray) పార్టీ నేత ఆదిత్య ఠాక్రే చంద్రబాబును హెచ్చరించారు. బీజేపీని నమ్మితే ఏం జరుగుతుందో ముందు ముందు తెలుస్తుందన్నారు.

NDA  భాగస్వామ్యపక్షనేతలైన TDP అధ్యక్షుడు చంద్రబాబు,  JDU నేత నితీష్ కుమార్‌ లను ఉద్దేశించి శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు చర్చయనీయాంశం అయ్యాయి. బీజేపీని నమ్మితే ఏం జరుగుతుందన్నది తమను చూసి తెలుసుకోవాలని ఆదిత్య అన్నారు. బీజేపీ విషయంలో వారిద్దరికీ హెచ్చరిక చేశారు.

 

చంద్రబాబు , నితీష్ జాగ్రత్త...!

మహరాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూలదోసిన వ్యవహారాన్ని ప్రస్తావించిన ఠాక్రే, దాని వెనుక బీజేపీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. తమ పార్టీకి జరిగిన ద్రోహమే భవిష్యత్‌లో TDP, JDU కు జరిగే అవకాశం ఉందన్న ఆయన, ఈ విషయంలో ఆ పార్టీలు నేతలు చంద్రబాబు, నితీష్ కుమార్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఢిల్లీలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కావడానికి ముందు ఆదిత్య మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టంగా మారిపోయిందని, ఓట్ల జాబితాల నుంచి ఓటింగ్ మెషిన్ల వరకూ అన్నీ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. “ దేశ భవిష్యత్ ప్రమాదంలో ఉంది. అసలు ఈ దేశంలో ఎన్నికల నిస్పక్షపాతంగా జరుగుతున్నాయా.. అన్న సందేహం ఉంది. ఇతర రాజకీయ పార్టీలకు వేసిన ఓట్లు ఏమవుతున్నాయో తెలీడం లేదు. మాకు, కేజ్రీవాల్, కాంగ్రెస్‌కు జరిగిందే రేపు చంద్రబాబు, నితీష్, RJDకి కూడా జరగొచ్చు” అని కామెంట్ చేశారు.

 

ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే కుట్ర

దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ నాశనం చేసే కుట్రకు బీజేపీ తెరతీసిందని ఆదిత్య ఆరోపించారు. ఇప్పటికే చాలా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీశారని దేశం మొత్తం మీద ఏకపార్టీ విధానం తేవాలన్నది బీజేపీ లక్ష్యం అన్నారు.

“ఢిల్లీ ప్రజలకు ఎంతో చేసిన కేజ్రీవాల్ ఓడిపోయారు. పదేళ్లపాటు ఢిల్లీని మార్చడానికి ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు. అయినా కేజ్రీవాల్ ఓడిపోయారంటే.. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కీలకమైన పాత్ర పోషించడమే కారణం” అన్నారు.  ప్రభుత్వాలు, పార్టీల గురించి పట్టించుకోకుండా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని ఠాక్రే అన్నారు.

 

మా సంగతి మేం చూసుకుంటాం

శివసేన UBT వ్యాఖ్యలపై జేడీయు నేతలు స్పందించారు. తన గురించి శివసేనకు ఆందోళన అక్కర్లేదని  ఆ పార్టీ ఎంపీ సంజీవ్ కుమార్ ఝా అన్నారు. EVM లు వచ్చిన తర్వాతనే బిహార్‌లో దళితులు, బీసీలు ఓట్లు వేయగలుగుతన్నారని అంతకుముందు అంతా బూత్‌ల క్యాప్చరింగ్ ఉండేదన్న ఆయన, శివసేన మళ్లీ అలాంటి వ్యవస్థ కావాలని కోరుకుంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి అయితే దీనిపై స్పందన లేదు.

INDI కూటమిలో ఐక్యత లేకపోవడం వల్లే ఢిల్లీ ఏన్నికల్లో ఓటమి వచ్చిందన్న విశ్లేషణల మధ్య ప్రతిపక్షాలు కలిసుండాలని ఠాక్రే వ్యాఖ్యలు చేయడం ముఖ్యమైన విషయమే. అలాగే ఇండియా కూటమి పక్షాలు మాత్రమే కాకుండా ఎన్డీఏ కూటమిలోని రాజకీయ పార్టీలను కూడా జాగ్రత్త పడాలంటూ బీజేపీ గురించి హెచ్చరిస్తున్నారు. అలాగే ఎన్నికల ఫలితాల్లో ఎన్నికల సంఘం ముఖ్యపాత్ర పోషిస్తోందన్న విషయాన్ని ఇండి అలయెన్స్ పార్టీలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. మహరాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు జరిగాయని అక్కడ వయోజనుల జనాభా కన్నా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఇప్పుడు శివసేన ఢిల్లీ ఎన్నికల గురించి అదే చెబుతోంది.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget