అన్వేషించండి

Sharmila : విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం

YS Jayanti : విజయవాడలో జరగనున్న వైఎస్ జయంతికి రావాలని రేవంత్, భట్టి విక్రమార్కలను షర్మిల కోరారు. హైదరాబాద్‌లోని వారి నివాసాల్లో షర్మిల సమావేశం అయ్యారు.

Sharmila Invited Revanth and Bhatti Vikramarka  :  ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో సమావేశం అయ్యారు.  జూలై ఎనిమిదో తేదీన వైఎస్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విజయవాడలో భారీ ఏర్పాట్లు చేసుకుటున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని ఆహ్వానిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో  తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలను కూడా షర్మిల ఆహ్వానించారు. 

వైఎస్‌తో అనుబంధం ఉన్న  వారందరికీ పిలుపు                      

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉన్న వారినందర్నీ ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో షర్మిల సొంత పార్టీ పెట్టుకున్న సమయంలో కూడా వైఎస్ జయంతిని భారీగా నిర్వహించారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. అప్పట్లో షర్మిల వేరే పార్టీ పెట్టుకోవడమే దీనికి కారణం. ఈ సారి పెద్ద ఎత్తున తెలంగాణలోని వైఎస్ ఆత్మీయులు విజయవాడలో జరగబోయే వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదా అన్నదానిపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నేతలతో వైఎస్ కు ప్రత్యేక అనుబంధముంది. భట్టి విక్రమార్క ఇప్పటికీ వైఎస్ ఫోటోను తన ఇంట్లో ఉంచుకుంటారు. రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఆయనకు దండం  పెట్టుకునే  బయలుదేరుతారు. తెలంగాణలో అనేక మంది సీనియర్ నేతలకు వైఎస్ తో కలిసి పని చేశారు. 

వైఎస్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు షర్మిల వ్యూహం             

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. వైసీపీలోని వైఎస్ ఆత్యంత ఆత్మీయులకు కూడా ఆహ్వానాలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన వారసురాలిగా ప్రజల్లో గుర్తింపు పొందేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించడాన్ని టాస్క్ గా తీసుకున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు వైఎస్ జయంతి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. ఓటమి భారంలో ఉన్ నవారు.. వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించే పరిస్థితుల్లో లేరు. 

ఏ కార్యక్రమం నిర్వహించే స్థితిలో లేని వైసీపీ              

అయితే ఇప్పుడు షర్మిల ఘనంగా వైఎస్ జయంతిని వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నందున తాము పట్టించుకోకపోతే వైఎస్ అభిమానులంతా కాంగ్రెస్ వైపు వెళ్లిపోతారన్న ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది. అందుకే తమ పార్టీ నేతల్ని వైఎస్ జయంతి కార్యక్రమానికి వెళ్లకుండా చేయాలని అనుకుంటున్నారు. కానీ కొంత మంది నేతలు మాత్రం.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వారు.. వెళ్లే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ అగ్రనేతలు కూడా పోటీగా వైఎస్ జయంతి కార్యక్రమం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Top 10, 11 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 11 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget