అన్వేషించండి

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో ముదిరిన ఆర్థిక సంక్షోభం, పప్పు ఉప్పు కొనడానికీ నానాతిప్పలు

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, ధాన్యం కొనేందుకూ వీల్లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

Bangladesh Economic Crisis: బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాదాపు నెల రోజులుగా అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. రాజకీయంగా అనిశ్చితి నెలకొంది. ఆపద్ధర్మ ప్రధానిగా మహమ్మద్ యూనస్‌ బాధ్యతలు చేపట్టినా పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. రిజర్వేషన్ కోటా విషయంలో విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటు హిందువులపైనా తీవ్ర దాడులు జరుగుతున్నాయి. మొత్తంగా దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ క్రమంలోనే ఆర్థికంగానూ బంగ్లాదేశ్‌ చతికిలబడింది. Bangladesh Bureau of Statistics వెల్లడించిన వివరాల ప్రకారం జులై నాటికి ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుంది. 11.66%గా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 14%కి పెరిగింది. 13 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనల కారణంగా సప్లై చెయిన్‌కి అంతరాయం కలుగుతోంది. 

ఇక వ్యాపార రంగమూ గట్టిగానే దెబ్బ తింది. సెంట్రల్ బ్యాంక్‌ ఆంక్షల కారణంగా నగదు చెలామణి పూర్తిగా తగ్గిపోయింది. బ్యాంక్ నుంచి రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తం విత్‌డ్రా చేసుకోకుండా రూల్ పెట్టారు. అమెరికా డాలర్‌తో పోల్చి చూస్తే బంగ్లాదేశ్ కరెన్సీ టాకా విలువ రోజురోజుకీ పడిపోతోంది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. లాభాల్లేక వ్యాపారులు దిగాలుగా ఉన్నారు. త్వరలోనే ధరలు మరింత పెరిగే అవకాశముందని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే మార్కెట్‌లు ఇప్పుడు జనమే లేక వెలవెలబోతున్నాయి. 

పప్పులు, ధాన్యాలతో పాటు మిగతా నిత్యావసరాలు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికైతే వ్యాపారులు నష్టాలకే సరుకులు అమ్ముకుంటున్నారు. వచ్చే నెల కచ్చితంగా ధరలు పెంచుతామని కొత్త ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బంగ్లాదేశ్‌ పెద్ద ఎత్తున డ్రైఫ్రూట్స్‌, పప్పులు, సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేసుకుంటోంది. భారత్‌ కూడా బంగ్లాకి వీటిని ఎగుమతి చేస్తోంది. సప్లై చెయిన్‌పై ప్రభావం పడడం వల్ల ఇవన్నీ ఆగిపోయాయి. ఇక బంగ్లాదేశ్‌లో విదేశీ మారక నిల్వలు జులైలో 21.78 బిలియన్ డాలర్లుగా ఉండగా ప్రస్తుతం అవి 20.48 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతానికి వాణిజ్యం కూడా అంతంతమాత్రంగానే సాగుతోంది. త్వరలోనే చమురు ధరలూ పెరిగే ప్రమాదముందని స్థానిక నేతలు చెబుతున్నారు. 

ఇప్పటి వరకూ బంగ్లాలో జరిగిన అల్లర్లలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాలు ప్రవేశపెట్టినందుకు ప్రధాని షేక్ హసీనాపై తిరగబడ్డారు విద్యార్థులు. ఫలితంగా ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఇండియాకి వచ్చేశారు. ఇక్కడే ఆశ్రయం పొందాలని భావించినా మోదీ సర్కార్ అందుకు అంగీకరించలేదు. ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సున్నితంగానే మందలించింది. తాత్కాలికంగా భారత్‌లోనే ఉన్న షేక్ హసీనా త్వరలోనే మళ్లీ బంగ్లాదేశ్‌కి వెళ్లిపోయే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఎన్నికలు ప్రకటించిన వెంటనే వెళ్లి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్టు షేక్ హసీనా కొడుకు సాజీబ్ వెల్లడించారు. అయితే...ఈ సంక్షోభం వెనక అమెరికా హస్తం ఉందని ఆమె చేసిన ఆరోపణలు సంచలనమవుతున్నాయి. 

Also Read: Kolkata Doctor Case: కూతురి డెడ్‌బాడీ చూసేందుకు 3 గంటల ఎదురు చూపులు, కోల్‌కత్తా డాక్టర్‌ తల్లిదండ్రుల నరకయాతన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
MLC BJP Won: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
Congress Mallanna: కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
Nara Lokesh: అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
Singer Kalpana Daughter: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
Embed widget