అన్వేషించండి

22nd July 2024 News Headlines: జులై 22న మీ స్కూల్‌ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్‌ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు

22nd July School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.

22nd July 2024 News Headlines in Telugu For School Assembly: 
1. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభను వాయిదా వేసి బీఏసీ సమావేశం నిర్వహించి ఎజెండాపై చర్చిస్తారు. కూటమి ప్రభుత్వం సభలో మూడు శ్వేతపత్రాలను విడుదల చేయనుంది.  ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసే బిల్లును రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు.
 
2. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో భారీగా పంటనష్టం సంభవించింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునగడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. వరద ఉద్ధృతికి వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజికి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
 
3. ఐఏఎస్‌ అధికారిణి స్మిత సబర్వాల్‌ చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఏఎస్‌ సర్వీసుల్లోకి దివ్యాంగులు ఎందుకంటూ ఆమె చేసిన పోస్ట్‌ పెద్ద దుమారమే రేపింది. దీనిపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై దివ్యాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
4. ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టలకు జలకళ వచ్చింది. దుమ్ము గూడెం వద్ద తొమ్మిది లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి వరద పెరుగుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
 
5. కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పూరిస్థాయి బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి కోసం పట్టుబడుతున్న ప్రతిపక్షాలు ఇవాళ సభలోనూ ఆ అంశంపై పట్టుబట్టే అవకాశం ఉంది. ఆగస్టు 12 వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతాయి.
 
6. ఇటీవల తీసుకొచ్చిన ఆరో తరగతి సోషల్‌, విజ్ఞాన శాస్త్ర పుస్తకంలో ఎన్‌సీఈఆర్‌టీ  పలు మార్పులు చేసింది. గ్రీనిచ్‌ రేఖ, కులవివక్ష ప్రస్తావన, అంబేడ్కర్‌ అనుభవించిన వివక్ష అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఎక్స్‌ప్లోరింగ్‌ సొసైటీ ఇండియా అండ్‌ బియాండ్‌ పేరుతో ఉన్న ఈ పుస్తకంలో కుల వ్యవస్థ గురించి కాకుండా వేదాల అంశాలను ప్రస్తావించారు. 
 
7. ఊహాగానాలను నిజం చేస్తూ అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ తప్పుకున్నారు. బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని ఇప్పటికే సొంత పార్టీ నేతలు చాలామంది డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్‌ వెల్లడించారు. అగ్రరాజ్య ప్రజలకు ఓ లేఖ కూడా రాశారు. ఇక బైడెన్‌ స్థానంలో అధ్యక్ష స్థానానికి ఎవరు పోటీ పడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 
8. ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు దూకుడు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన మహిళల జట్టు... రెండో మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేశారు. టీ 20 మ్యాచ్‌లో భారత్‌ తొలిసారిగా 200కుపైగా పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 201 పరుగులు చేయగా... యూఏఈ 123 పరుగులే చేసింది. 
 
9. భారత్‌లో వృద్ధుల జనాభా పెరుగుతోంది. 2050 నాటికి దేశంలో వృద్ధుల జనాభా రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2050 నాటికి దేశంలో 60 సంవత్సరాల వయసు దాటిన వారి సంఖ్య 34 కోట్లకు చేరుతుందని తెలిపింది. అలాగే దేశంలో పల్లెటూర్లు కూడా తగ్గుతాయని 2050 నాటికి 50 శాతం సిటీలే ఉంటాయని వెల్లడించింది. 
 
10. ఆత్మవిశ్వాసం మనిషికి పెట్టని ఆభరణం- స్వామి వివేకానంద
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget