అన్వేషించండి

28th August 2024 School News Headlines Today: ఆంధ్రప్రదేశ్ లో నేడు ఈ-కేబినెట్ భేటీ, పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్‌ ప్రారంభం

28th August 2024 School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.

28th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత
  • భారతీయ సితార్ విధ్వాంసుడు విలాయత్ ఖాన్ జయంతి
  • తెలుగు సినిమా నటుడు సుమన్ జననం
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు: 
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఈ-కేబినెట్ భేటీ జరగనుంది. 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. ఈ సమావేశంలో అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకు అన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేస్తుంది. ఈ-కేబినెట్ నిర్వహణపై ఇప్పటికే మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది.
 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజైన సెప్టెంబరు 2న క్లీన్‌ ఆంధ్ర - గ్రీన్‌ ఆంధ్ర’ పేరుతో ఊరూవాడా పరిశుభ్రతకార్యక్రమాలు చేపట్టనున్నారు. జనసేనాని జన్మదినం సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
తెలంగాణ వార్తలు: 
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో కవిత మంగళవారం రాత్రి జైలు నుంచి బయటకు వచ్చారు. తాను కేసేఆర్‌ కుమార్తెనని..ఎప్పుడు తప్పు చేయబోనని కవిత స్పష్టం చేశారు.
 
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల 17 నుంచి రేషన్‌కార్డులు, ఆరోగ్యకార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబరు 17 నుంచి పది రోజులపాటు ప్రజా పాలన నిర్వహించి అర్హులకు రేషన్‌కార్డులు, ఆరోగ్య కార్డులు అందజేయాలని రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.
 
జాతీయ వార్తలు: 
అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబాన్సిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు లోయలో పడి ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. మరణించిన వారిని హవల్దార్ నఖత్ సింగ్, నాయక్ ముకేశ్ కుమార్, గ్రెనేడియర్ అశిశ్‌గా గుర్తించారు. 
 
విద్యార్థులు చేప‌ట్టిన న‌బ‌న్నా అభియాన్‌ నిర‌స‌న‌పై పోలీసులు ఉక్కుపాదం మోప‌డానికి నిరసనగా నేడు పశ్చిమ బెంగాల్ బంద్‌కు BJP పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం 6 వర‌కు బంద్ కొన‌సాగుతుంద‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి తెలిపారు. 
 
దేశంలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా రాష్ట్రాల్లో పీఎం 2.5 స్థాయి కంటే అధికంగా వాయు కాలుష్యం ఉంది. ఇది పిల్లలు, పెద్దలకు అత్యంత ప్రమాదకరమని అంతర్జాతీయ జనాభా శాస్త్రాల సంస్థ అధ్యయనం హెచ్చరించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించాలని పిలుపునిచ్చింది. 
 
దేశంలోని జాతీయ రహదారుల్లో ఆక్రమణలను తొలగించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రహదారుల ఆక్రమణలపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. హైవేల్లో ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
 
క్రీడా వార్తలు: 
నేటి నుంచి పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీలో వివిధ దేశాల నుంచి మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. ఇక భారత్‌ ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి 84 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. 
 
బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుత చైర్మన్‌ గ్రెగ్ బార్క్‌లే పదవీ కాలం నవంబర్‌‌ 30వ తేదీతో ముగియనుంది. దీంతో చైర్మన్‌గా జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది. డిసెంబర్‌‌ 1వ తేదీన ఐసీసీ చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నారు.
 
మంచిమాట
నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే, ఎన్నటికీ విజయం సాధించలేం.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Embed widget