అన్వేషించండి

COVID-19 Compensation: ఆ అనాథ చిన్నారులకు రెండు వారాల్లో పరిహారం ఇవ్వాలి - రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు వార్నింగ్

COVID-19 Compensation: కొవిడ్‌ కారణంగా అనాథలైన చిన్నారులకు పరిహారం అందించాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

COVID-19 Compensation:

పెండింగ్‌లోనే అప్లికేషన్లు..

కొవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన చిన్నారులకు పరిహారం ఇవ్వాలని సుప్రీం కోర్టు రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా చెల్లింపులు పూర్తి కావాలని తేల్చి చెప్పింది. జస్టిస్ ఎమ్ఐర్ షా, జస్టిస్‌ సుధాన్షు ధులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఎక్స్‌గ్రేషియా కోసం వచ్చిన దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వివరించాలని ఆదేశించింది. ఈ అప్లికేషన్లను పరిశీలించి నాలుగు వారాల్లోగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని రాజస్థాన్ స్టేట్ లీగల్ సర్వీస్ 
అథారిటీకి సూచించింది. "పరిహారం కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచటంపై కచ్చితంగా దృష్టి సారించాల్సిందే. కొవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన మిగతా చిన్నారులకూ పరిహారం తప్పకుండా దక్కాల్సిందే. రెండు వారాల్లోగా ఇది పూర్తి కావాలి" అని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం స్పందించింది. మొత్తం అనాథలు 718 మంది కాగా...వారిలో 191 మందికి
పరిహారం అందజేసినట్టు వెల్లడించింది. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవటం వల్ల చిన్నారులు అనాథలైన విషయాన్నీ ప్రభుత్వం ప్రస్తావించింది. జిల్లా స్థాయిలో 9,077 అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 551 పెండింగ్‌లో ఉన్నాయని, 8047 మందికి పరిహారం చెల్లించామని ప్రభుత్వం తెలిపింది. 479 అప్లికేషన్లు తిరస్కరించినట్టు వివరించింది. అంతకు ముందు సుప్రీం కోర్టులో రాజస్థాన్ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలైంది. ఆ సమయంలోనే సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై మండి పడింది. "ఎవరికీ దానం చేయటంలేదు" అంటూ ఆగ్రహించింది. అడ్వకేట్ గౌరవ్ కుమార్ బన్సాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2021లో ఇచ్చిన ఆదేశాల మేరకు..రాజస్థాన్ ప్రభుత్వం అనాథ చిన్నారులకు రూ.50,000 పరిహారం అందించటం లేదని అందులో పేర్కొన్నారు. 

దుర్వినియోగం కాకూడదు..

ఈ ఆదేశాలను ఎంత వరకు పాటించారో తెలియజేయాల్సిందిగా...స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్‌ నుంచి వివరణ కోరారు పిటిషనర్. రూ.50 వేల పరిహారాన్ని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంపై సుప్రీం కోర్టు ఆగ్రహంగా ఉంది. ఈ డబ్బుని దుర్వినియోగం అవకూడదని చెప్పింది. ఏ ప్రభుత్వమైనా సరే నిర్దేశిత పరిహారాన్ని అనాథ చిన్నారులకు అందజేయటంలో ఎలాంటి జాప్యం చేయకూడదని గతంలోనే గట్టిగా చెప్పింది. 

పరిహారం ఇందుకే అందట్లేదా..? 

మొదటి వేవ్‌ కన్నా సెకండ్ వేవ్ సమయంలో మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.  ఆ సమయలో దేశంలో స్మశానాల దగ్గర పరిస్థితి అందరితోనూ కన్నీరు పెట్టించింది. అన్ని రాష్ట్రాల్లోనూ మరణాల సంఖ్య సాధారణం స్థాయి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. అయితే ఆ మరణాలన్నీ కరోనా మరణాలు కిందకు కాలేదు. ప్రభుత్వాలు కరోనా మరణాలను తక్కువ చేసి చూపించడానికి సాధారణ మరణాలుగా చెప్పేందుకు ప్రయత్నించాయి. ఈ కారణంగా ఇప్పుడు కరోనా బారిన పడి చనిపోయినా వారి కుటుంబాలకు సాయం అందడం కష్టంగా మారనుంది. ఒక్క కరోనా కారణంగానే చనిపోరు. అప్పటికి శరీరంలో ఉన్న వివిధ అనారోగ్య సమస్యలకు కరోనా తోడైతే చనిపోతారు. అత్యధిక మందిలో జరిగింది ఇదే. కానీ మరణాల నమోదు విషయంలో కార్డియాక్ అరెస్ట్ అని.. మరొకటి అని రాసి మరణ ధృవపత్రాలు జారీ చేశారు. ఈ కారణంగా కరోనాతో చనిపోయిన కొన్ని లక్షల మందికి పరిహరం అందడం గగనంగా మారనుంది.

Also Read: Himachal Pradesh Election 2022 Date: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

టాప్ హెడ్ లైన్స్

CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

వీడియోలు

Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget