అన్వేషించండి

Sajjala : అమరరాజా చిత్తూరులో ఉండొచ్చు.. కానీ "ఆ" షరతులు పాటించాల్సిందేనని తేల్చి చెప్పిన సజ్జల..!

కాలుష్య నిబంధనలు పాటిస్తూ ఉత్పత్తి చేసుకోవడానికి అమరరాజాకు ఎలాంటి ఇబ్బంది లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయేలా ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలు పాటిస్తూ అమరరాజా కంపెనీ ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తే తమకేమీ అభ్యంతరం లేదని  ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  అమరరాజా ప్లాంట్ తమిళనాడుకు తరలిస్తున్నారన్న ప్రచారం నేపధ్యంలో  మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  " వారు వెళ్లిపోవడం కాదు.. తామే దండం పెట్టి పొమ్మని కోరుతున్నామని " చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.  ప్రజల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన తిరుపతికి వచ్చిన సందర్భంగా మీడియా ఆయనను చుట్టుముట్టింది. అమరరాజా సంస్థపై చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా  తన వ్యాఖ్యలపై  సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.  అమరరాజా ఫ్యాక్టరీ  ఆంధ్రలో ఉంటే మాకెలంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. 

ఏపీ నుంచి వెళ్లిపోయేలా...  అమరరాజా గ్రూప్‌పై ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకు రాలేదని స్పష్టం చేశారు.  గాలి,నీటిని కలుషితం చేయకుండా ఫ్యాక్టరీని నిడిపితే అభ్యంతరాలు లేవని ... ఆ నాడే ఫ్యాక్టరీ యాజమాన్యంకు తెలిపామని గుర్తు చేశారు.  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు  ఇచ్చిన సూచనల అమలు చేస్తూ అమరరాజా ఫ్యాక్టరీని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.  ఇప్పటికే అమరరాజా సంస్థ విషయంలో  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచామని సజ్జల తెలిపారు.  కోర్టు తీర్పును వెల్లడిస్తూ రెండు నెలల కాలం పాటు అమరరాజా ఫ్యాక్టరీకి గడువు ఇచ్చిందని అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమి లేదన్నారు.  .అమరరాజా కంపెనీ నుండి వెలువడే లెడ్ లాంటి విష పదార్ధాలు నీటిని కలుషితం చేస్తున్నాయని స్పష్టం చేశారు.  ఈ కారణంగానే పర్యావరణం కలుషితం చేసే ఫ్యాక్టరీలపై కేంద్ర ప్రభుత్వమే చర్యలు తీసుకుంటోందని... ..మొత్తం 60 ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకున్నామని అందులో ప్రస్తుతం 50 ఫ్యాక్టరీలను మూసి వేసినట్లు తెలిపారు. 

అమరరాజా సంస్థ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది కావడంతో ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే వేధింపులకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థను.. ఇలా పొరుగు రాష్ట్రాలకు పంపేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి.  కొత్త పరిశ్రమలు తీసుకు రాకుండా.. ఉన్న పరిశ్రమల్ని పంపిస్తే.. యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయని...  వివిధ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే..  ప్రభుత్వం .. అమరరాజా సంస్థను.. పొల్యూషన్ లేకుండా.. నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తే.. తమకేమీ అభ్యంతరం లేదని చెబుతోంది.  ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల ఇదే విషయాన్ని చెప్పారు. అయితే  ఈ మొత్తం వివాదంపై అమరరాజా కంపెనీ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hero Xoom 125 లో రెండు వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Hero Xoom 125 VX vs ZX - ₹8,000 తేడాతో ఏ ఫీచర్లు మారాయి?
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: జనం ఈ కంపెనీ కార్లను తెగ కొన్నారు, డిమాండ్‌ కూడా పెరిగింది
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: గత నెలలో ఈ కార్లకే భారీ డిమాండ్, కొనడానికి జనం క్యూ

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget