అన్వేషించండి

Puducherry Rains: వరద బాధితులకు పరిహారం ప్రకటించిన పుదుచ్చేరి సీఎం... పంట నష్టానికి రూ. 20 వేలు, దెబ్బతిన్న ఇళ్లకు రూ.25 వేల సాయం

పుదుచ్చేరి ప్రభుత్వ వరద బాధితులకు పరిహారం ప్రకటించింది. దెబ్బతిన్న ఇళ్లకు రూ. 25 వేలు, వరి పంట నష్టానికి హెక్టారుకు రూ. 20 వేలు ప్రకటించింది.

వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరం దాటినప్పటికీ మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడిస్తుంది. వర్షాల ప్రభావంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. వరద పరిస్థితులపై సమీక్షించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలకు.. హెక్టారుకు రూ.20,000 పరిహారాన్ని ప్రకటించారు. అలాగే దెబ్బతిన్న ఇళ్లకు రూ.25 వేలు సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 5000 తక్షణ సాయం ప్రకటించారు. దీంతో 48 వేల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు, 44 వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. 

Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి

పుదుచ్చేరిలో గత మూడు రోజులుగా 15 సెం.మీ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా కరైకాల్‌లో దాదాపు 5 వేల హెక్టార్లలో వరి పంట నష్టపోగా, పుదుచ్చేరిలో 25 ఇళ్లు దెబ్బతిన్నాయి. వర్షాల నష్టాన్ని అంచనా వేసి ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ ఉపశమనం కల్పించేందుకు పరిహారం అందిస్తామని సీఎం రంగసామి తెలిపారు. ఉద్యాన, ఇతర పంటలకు జరిగిన నష్టానికి పరిహారం కూడా అందజేస్తామన్నారు. 

Also Read: కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'

పశువుల నష్టానికి గాను ఆవు చనిపోతే రూ. 10,000, మేకకు రూ. 5,000 పరిహారం అందజేయనున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం నష్టాలను అంచనా వేసిన తర్వాత కేంద్రం సాయం కోరనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నష్టంపై పూర్తి నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రంగసామి సూచించారు. సెల్లిపేట బెడ్ డ్యామ్ మరమ్మతులకు చర్యలు తీసుకున్నామని, శంకరాభరణి నదిపై రూ.16 కోట్లతో మరో బెడ్ డ్యాం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని రంగస్వామి తెలిపారు. 

Also Read: కేరళలో కొత్త వైరస్.. దండయాత్ర.. ఇది మనుషులపై మహమ్మారుల దండయాత్ర!

వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు కేటాయించామని సీఎం రంగసామి తెలిపారు. ఇందులో గ్రామీణ రహదారులకు రూ.50 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల కింద రూ.36 కోట్లు కేటాయించామన్నారు. ఈ పనుల నిర్వహణకు రూ.100 కోట్ల టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. కాల్వల నిర్మాణంతో పాటు వర్షపు నీటి పారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు వచ్చే ఏడాది వరదలు లేదా నీరు నిలిచిపోకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

Also Read:  వర్షాల కారణంగా 12 మంది మృతి.. సహాయక శిబిరానికి 1700 మంది తరలింపు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget