అన్వేషించండి

Wayanad: కన్నీళ్లు పెట్టుకున్న వయనాడ్ బాధితులు, ఓదార్చిన ప్రధాని మోదీ - వీడియో

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ వయనాడ్‌లోని రిలీఫ్ క్యాంప్‌లను సందర్శించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలోనే కొందరు కన్నీళ్లు పెట్టుకోగా మోదీ ఓదార్చారు.

Wayanad Landslides: ప్రధాని నరేంద్ర మోదీ వయనాడ్‌లో పర్యటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు కేంద్రమంత్రి సురేశ్ గోపీ ఉన్నారు. ఏరియల్ సర్వే పూర్తైన తరవాత వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మోదీ. సహాయక చర్యలు ఎలా చేపడుతున్నారో ఆరా తీశారు. బాధితులను ఎక్కడికి తరలించారో అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు ప్రస్తుత పరిస్థితులను మోదీకి వివరించారు. ఆ తరవాత ఆయన రిలీఫ్ క్యాంప్‌లలోని బాధితులను పరామర్శించారు. ఈ ముప్పు నుంచి తృటిలో తప్పించుకుని బయట పడ్డ వాళ్లతో మాట్లాడారు. అయిన వాళ్లను పోగొట్టుకున్న చాలా మంది ఇక్కడే తలదాచుకుంటున్నారు.

ప్రధాని మోదీ కనిపించగానే వాళ్లు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న బాధలో కన్నీళ్లు పెట్టుకున్నారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని తలుచుకుని బాధితులు ఎమోషనల్ అయ్యారు. వాళ్లను ఓదార్చిన ప్రధాని మోదీ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మోదీతో మాట్లాడుతూ ఓ యువకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ యువకుడి భుజం తడుతూ మోదీ ఓదార్చారు. 

హాస్పిటల్‌లో పరామర్శ..

ఆ తరవాత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులనూ పరామర్శించారు ప్రధాని. పేరుపేరునా అందరినీ పలకరించి వాళ్ల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. వైద్యం సరిగా అందుతుందా లేదా అని ఆరా తీశారు. (Also Read: Viral News: పరువు హత్య నేరం కాదు, అది కూడా ఓ రకం ప్రేమే - తమిళ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు)

 

అంతకు ముందు వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మోదీ. ఇండియన్ ఆర్మీ నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్‌పై నడిచారు. అక్కడ సహాయక చర్యలు ఎలా చేపట్టారో అడిగి తెలుసుకున్నారు. రిలీఫ్ క్యాంప్‌లలో దాదాపు 25 నిముషాల పాటు గడిపారు. ఎక్కువగా ప్రభావితమైన చూరల్‌మలలోనూ పర్యటించారు. ఇక్కడే దాదాపు 226 మంది ప్రాణాలు కోల్పోయారు. 120 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. ఇళ్లు, ఆస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

Also Read: India Maldives: ఇకపై మాల్దీవ్స్‌లోనూ యూపీఐ చెల్లింపులు, త్వరలోనే అందుబాటులోకి వచ్చేలా కీలక ఒప్పందం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Land Slide: వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Lavanya theft case against Raj Tarun : బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
Devara Movie Stills: 'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వర్షం కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థుల తిప్పలుఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ రేటు ఎంత?బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్‌ తగ్గించేందుకు అధికారుల యత్నంవరద బాధితులకు చిన్నారుల సాయం, వీడియో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land Slide: వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
వరద విషాదాలు - విజయవాడలో కొండచరియలు విరిగి ఒకరు మృతి, కాకినాడలో వరదలో చిక్కుకున్న యువకులు
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Lavanya theft case against Raj Tarun : బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
బంగారం కొట్టేశాడు - రాజ్ తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
Devara Movie Stills: 'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
GST On Cancer Drugs: కేన్సర్‌ మందుల నుంచి చిరుతిళ్ల వరకు రేట్లు భారీగా తగ్గుతున్నాయ్‌! ఎందుకంటే?
కేన్సర్‌ మందుల నుంచి చిరుతిళ్ల వరకు రేట్లు భారీగా తగ్గుతున్నాయ్‌! ఎందుకంటే?
CM Chandrbabu: సాధారణ స్థితికి విజయవాడ - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సాధారణ స్థితికి విజయవాడ - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Prakasam News: ఆడిట్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - దారి కాచి కళ్లల్లో కారం కొట్టి దారుణం, ప్రకాశం జిల్లాలో ఘటన
ఆడిట్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - దారి కాచి కళ్లల్లో కారం కొట్టి దారుణం, ప్రకాశం జిల్లాలో ఘటన
Janhvi Kapoor : ఈసారి జాన్వీ వయ్యారం ఓణి కాదు చీర కట్టింది..  దేవర ప్రమోషన్స్​లో దేవకన్య వైబ్స్ ఇస్తోన్న బ్యూటీ
ఈసారి జాన్వీ వయ్యారం ఓణి కాదు చీర కట్టింది.. దేవర ప్రమోషన్స్​లో దేవకన్య వైబ్స్ ఇస్తోన్న బ్యూటీ
Embed widget