అన్వేషించండి

PM Kisan Samman Nidhi: ఏపీ రైతుల పాలిట శాపంగా మారిన ఈ కేవైసీ - ప్రతీ ఏడాది తగ్గుతున్న పీఎం కిసాన్ అర్హుల సంఖ్య !

PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ కింద అర్హత కల్గిన వారి సంఖ్య ప్రతీ ఏటా తగ్గతూ వస్తోంది. ముఖ్యంగా ఏపీలో అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా నిధులు అందడం లేదు. విపరీతమైన షరతులు పెట్టడమే అందుకు కారణం. 

PM Kisan Samman Nidhi: దేశంలో ఉన్న రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద చాలా మంది రైతులు లబ్ధి పొందడం లేదు. ఏటా లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. సాగుభూమి ఉన్న రైతులందరికీ పీఎం కిసాన్ కింద ఏటా 6 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామన్న కేంద్రం.. ఈ కేవైసీ నిబంధనలు పెట్టడంతో వేలాది మంది రైతులు ఈ పథకానికి అర్హత కోల్పోతున్నారు. ఈ పథకానికి అర్హత పొందేందుకు ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. ఏటా జనవరిలో మూడో విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న కేంద్రం ఈ కేవైసీ పూర్తి కాలేదన్న నెపంతో చెల్లింపులు జరపడం లేదు. రైతుల ఈ కేవైసీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను నియమించింది. అయితే ప్రభుత్వం ఆర్బీకేల్లో ధాన్యం సేకరణ, ఈ కేవైసీ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. 

ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇప్పటికే మూడుసార్లు గడువును పొడిగించారు. తాజాగా ఈనెల 15వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. అయినా ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి కాలేది సమాచారం. ఈ కేవైసీ పూర్తి కాకపోతే పీఎం కిసాన్ సమ్ము రైతుల ఖాతాల్లో పడదని కేంద్ర ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. పీఎం కిసాన్ 13వ విడతకు అర్హులైన రైతుల ఖాతాల్లో మార్చి 8వ తేదీ హోలి పండుగనాడు డబ్బులు జ మ చేయనున్నట్లు సమాచారం. అయితే పీఎం కిసాన్ పథకం కోసం రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కేంద్రం 12 విడతలు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. మొదట్లో 50 లక్షల మందికి పైగా లబ్ధి పొందగా ఆ తర్వాత ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. 

ఏపిలో 60,77,808 మంది పథకానికి నమోదు చేసుకోగా 2022-23లో  ఏప్రిల్‌-జులై  మాసాలకు 46,62,768 మందికి జమ పడింది.  ఆగస్టు-నవంబర్‌ కు 27,55,285 మందికే ఇప్పటి వరకు జమ పడింది. రిజిస్టరైన వారిలో సుమారు 33 లక్షల మందికి పడలేదు. ముందటి కిస్తు పడ్డ వారిలో 19 లక్షల మందికి కోత పడింది. అంతకు ముందు లబ్ధిదారుల్లో 20 లక్షల మంది తగ్గారు. ఇంత భారీగా ఎందుకు తగ్గుతారన్నదానిపై స్పష్టత లేదు.  ఏపీలో కావాలేన తగ్గిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 

రైతు భరోసా నిధులు కూడా అవే.. రైతులకు ఇబ్బందులు ! 

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వ్యవసాయదారులకు రైతు భరోసా పథకాన్ని పీఎం కిసాన్‌తో కలిపి అమలు చేస్తోంది. రెండు పథకాలకూ కలిపి లబ్ధిదారులను రాష్ట్రమే నిర్ణయిస్తోంది. ఏడాదిలో రైతులకు మూడు విడతల్లో మొత్తం రూ.13,500 అందాలి. మేలో ఇచ్చే తొలి కిస్తు రూ.7,500లో రాష్ట్రం 5,500, కేంద్రం 2,000 ఇవ్వాలి. నవంబర్‌లో ఇచ్చే రెండవ కిస్తులో రాష్ట్రం 2 వేలు, కేంద్రం 2 వేలు ఇవ్వాలి. మూడవ కిస్తు 2 వేలనూ కేంద్రమే ఇస్తుంది. అందులో రాష్ట్ర వాటా లేదు.  భూమి యజమానులకు రాష్ట్రం ఇచ్చే సాయం పడుతోంది తప్ప కేంద్రం ఇచ్చేది సకాలంలో పడట్లేదు. లక్షలాది మంది రైతులు కేంద్ర సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అయినా జమ చేస్తుందా అంటే..  అదీ చేయడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

NCRB Report: తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
FIFA World Cup Record: గోల్స్ సునామీతో 68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026వ ఎడిష‌న్.. డచ్ టీమ్ హిస్టారికల్ ఫీట్
గోల్స్ సునామీతో 68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026వ ఎడిష‌న్.. డచ్ టీమ్ హిస్టారికల్ ఫీట్
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
MI, RR మధ్య ట్రేడ్ డీల్.. రాజస్థాన్‌కు హార్దిక్ పాండ్యా?.. ముంబై కెప్టెన్‌గా తెలుగు తేజం
MI, RR మధ్య ట్రేడ్ డీల్.. రాజస్థాన్‌కు హార్దిక్ పాండ్యా?.. ముంబై కెప్టెన్‌గా తెలుగు తేజం

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
NCRB Report: తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Embed widget