అన్వేషించండి

Pavan In Delhi : ఢిల్లీలో పవన్ కల్యాణ్ - బీజేపీ ముఖ్యనేతలతో భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారని ఆ పార్టీ ప్రకటించింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లారని.. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారని ప్రకటించింది.


జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీ చేరుకుని మొదటగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా  ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారని ఆ ఆహ్వానం మేరకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని జనసేన వర్గాలు మీడియాకు సమాచారం అందించాయి. ప్రహ్లాద్ జోషి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రహ్లాద్ జోషితో పాటు బీజేపీ ముఖ్య నేతలతోనూ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారని ప్రెస్‌నోట్ విడుదల చేశారు కానీ..ఆ ముఖ్య నేతలెవరో స్పష్టత లేదు.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. శ్రీ ప్రహ్లాద్ జోషి గారితో సమావేశం అయిన తరువాత బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

— JanaSena Party (@JanaSenaParty) September 7, 2021

">

పవన్ కల్యాణ్‌ చాలా రోజుల తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో వివిధ రకాల చర్చల నిమిత్తం రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన గురించి బీజేపీ పట్టించుకోలేదు. హఠాత్తుగా ప్రహ్లాద్ జోషి పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు. ఇటీవలి కాలంలో ఏపీలో బీజేపీ-జనసేన మధ్య కోఆర్డినేషన్ దెబ్బతిన్నది. రెండు వారాల కిందట సమావేశం పెట్టుకుని కలసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నా.. ఎవరి పోరాటాలు వారు చేస్తున్నారు. రూపు మారిన రోడ్లపై జనసేన సొంతంగా డిజిటల్ ఉద్యమం చేపట్టింది.  బీజేపీ వినాయక చవితి పండుగపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను నిరసిస్తూ సొంతంగా కార్యక్రమాలు చేపడుతోంది. ఎక్కడా  రెండు పార్టీలు కలిసి రాజకీయ పయనం చేసే పరిస్థితి కనిపించడం లేదు. Also Read : ఒక్కో సినిమాకు పవన్ కల్యాణ్ ఎంత తీసుకుంటారో తెలుసా..?

 

అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలపై జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. కొంత మంది నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో బీజేపీ హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లుగా జనసేన వర్గాలు గతంలో ఆఫ్ ది రికార్డు చెప్పాయి. ప్రస్తుతం ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన నేతలకు అంతకగా సరిపడటం లేదు. విజయవాడకు చెందిన జనసేన నేత పోతిన మహేష్  బీజేపీతో పొత్తు వల్ల జనసేన తీవ్రంగా నష్టపోతోందని పలుమార్లు నేరుగా మీడియాతోనే అన్నారు. స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. Also Read : ఏపీలో ముదిరిన వినాయక చవితి ఆంక్షల వివాదం


అయితే ప్రహ్లాద్ జోషి ఏ కారణంతో పిలిచారో జనసేన స్పష్టత ఇవ్వలేదు. అలాగే బీజేపీ తరపున ఏ ముఖ్య నేతల్ని కలిశారో కూడా జనసేన చెప్పలేదు. మోడీ, అమిత్ షా , నడ్డా లాంటి పెద్ద నేతలతో భేటీ అయితే ఫోటోలతో సహా చెప్పేవారు కానీ అలాంటి ప్రకటన చేయలేదు. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 DC VS KKR Result Update: డీసీ క‌న్సోలేష‌న్ విన్.. హ్యాట్రిక్ గెలుపుతో టోర్నీకి బై.. రాణించిన రాహుల్, కుల్దీప్, ఎంగిడి
డీసీ క‌న్సోలేష‌న్ విన్.. హ్యాట్రిక్ గెలుపుతో టోర్నీకి బై.. రాణించిన రాహుల్, కుల్దీప్, ఎంగిడి, KKR ఘోర పరాజయం
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget