అన్వేషించండి

Pavan In Delhi : ఢిల్లీలో పవన్ కల్యాణ్ - బీజేపీ ముఖ్యనేతలతో భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారని ఆ పార్టీ ప్రకటించింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లారని.. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారని ప్రకటించింది.


జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీ చేరుకుని మొదటగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా  ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారని ఆ ఆహ్వానం మేరకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని జనసేన వర్గాలు మీడియాకు సమాచారం అందించాయి. ప్రహ్లాద్ జోషి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రహ్లాద్ జోషితో పాటు బీజేపీ ముఖ్య నేతలతోనూ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారని ప్రెస్‌నోట్ విడుదల చేశారు కానీ..ఆ ముఖ్య నేతలెవరో స్పష్టత లేదు.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. శ్రీ ప్రహ్లాద్ జోషి గారితో సమావేశం అయిన తరువాత బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

— JanaSena Party (@JanaSenaParty) September 7, 2021

">

పవన్ కల్యాణ్‌ చాలా రోజుల తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో వివిధ రకాల చర్చల నిమిత్తం రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన గురించి బీజేపీ పట్టించుకోలేదు. హఠాత్తుగా ప్రహ్లాద్ జోషి పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు. ఇటీవలి కాలంలో ఏపీలో బీజేపీ-జనసేన మధ్య కోఆర్డినేషన్ దెబ్బతిన్నది. రెండు వారాల కిందట సమావేశం పెట్టుకుని కలసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నా.. ఎవరి పోరాటాలు వారు చేస్తున్నారు. రూపు మారిన రోడ్లపై జనసేన సొంతంగా డిజిటల్ ఉద్యమం చేపట్టింది.  బీజేపీ వినాయక చవితి పండుగపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను నిరసిస్తూ సొంతంగా కార్యక్రమాలు చేపడుతోంది. ఎక్కడా  రెండు పార్టీలు కలిసి రాజకీయ పయనం చేసే పరిస్థితి కనిపించడం లేదు. Also Read : ఒక్కో సినిమాకు పవన్ కల్యాణ్ ఎంత తీసుకుంటారో తెలుసా..?

 

అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలపై జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. కొంత మంది నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో బీజేపీ హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లుగా జనసేన వర్గాలు గతంలో ఆఫ్ ది రికార్డు చెప్పాయి. ప్రస్తుతం ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన నేతలకు అంతకగా సరిపడటం లేదు. విజయవాడకు చెందిన జనసేన నేత పోతిన మహేష్  బీజేపీతో పొత్తు వల్ల జనసేన తీవ్రంగా నష్టపోతోందని పలుమార్లు నేరుగా మీడియాతోనే అన్నారు. స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. Also Read : ఏపీలో ముదిరిన వినాయక చవితి ఆంక్షల వివాదం


అయితే ప్రహ్లాద్ జోషి ఏ కారణంతో పిలిచారో జనసేన స్పష్టత ఇవ్వలేదు. అలాగే బీజేపీ తరపున ఏ ముఖ్య నేతల్ని కలిశారో కూడా జనసేన చెప్పలేదు. మోడీ, అమిత్ షా , నడ్డా లాంటి పెద్ద నేతలతో భేటీ అయితే ఫోటోలతో సహా చెప్పేవారు కానీ అలాంటి ప్రకటన చేయలేదు. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Advertisement

వీడియోలు

South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Iceland Cricket Tweet on Gautam Gambhir | గంభీర్‌ను ట్రోల్ చేసిన ఐస్‌లాండ్ క్రికెట్
Ashwin Tweet on Ind vs SA Test Match | వైరల్ అవుతున్న అశ్విన్ పోస్ట్
Rohit as ambassador of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026 అంబాసిడర్‌గా రోహిత్
India vs South Africa Test Highlights | విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Raju Weds Rambai : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
Obesity Warning Signs : ఊబకాయం హెచ్చరిక సంకేతాలు.. బరువు పెరగడం నుంచి నిద్రలేమి వరకు.. జాగ్రత్త!
ఊబకాయం హెచ్చరిక సంకేతాలు.. బరువు పెరగడం నుంచి నిద్రలేమి వరకు.. జాగ్రత్త!
Hong Kong Fire Accident: హాంగ్‌కాంగ్‌లో 7 అంతస్తుల భవనాల్లో భారీ అగ్నిప్రమాదం- 44 మంది మృతి, 300 మంది అదృశ్యం!
హాంగ్‌కాంగ్‌లో 7 అంతస్తుల భవనాల్లో భారీ అగ్నిప్రమాదం- 44 మంది మృతి, 300 మంది అదృశ్యం!
Thamma OTT: డిసెంబర్‌ మొదటి వారంలోకి ఓటీటీకి రష్మిక 'థామ'... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
డిసెంబర్‌ మొదటి వారంలోకి ఓటీటీకి రష్మిక 'థామ'... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget