అన్వేషించండి

Pakistan Economic Crisis- పాకిస్థాన్ మరో శ్రీలంకగా మారనుందా..?

పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దేందుకు అక్కడి ప్రభుత్వం ధరల బాదుడు విధానాన్నే నమ్ముకుంది. ఆహార పదార్థాల నుంచి పెట్రో ఉత్పత్తుల వరకూ అన్నీ ప్రియమైపోయాయి. 

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో ప్రపంచమంతా గమనిస్తూనే ఉంది. ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుంది. ఓ పూట తిండి తినేందుకూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మన దాయాది దేశం పాకిస్థాన్ దుస్థితీ ఇలానే ఉంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయే నాటికే పాక్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. దేశం అప్పుల కుప్పగా మారింది. తీసుకున్న అప్పులు కట్టలేక, కొత్త అప్పు పుట్టక తిప్పలు పడుతోంది పాకిస్థాన్.

అంచనాలకు మించిన ద్రవ్యోల్బణం
ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 13.37% గా నమోదైంది. మే నాటికి ఇది 13.8%కి పెరిగింది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సరుకుల ధరలపెరిగిపోయాయి. ఫలితంగా ఆహార పదార్థాలు ప్రియంగా మారాయి.  కరెన్సీ విలువ రోజురోజుకీ పడిపోతోంది. ఈ పరిస్థితులు చక్కదిద్దేందుకు పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంకు రంగంలో దిగింది. వడ్డీ రేట్లను 675 బేస్ పాయింట్లు పెంచింది. ఆహార పదార్థాల ధరలు 17.3% మేర పెరిగాయంటే అక్కడ సరుకుల ధరల ఏ విధంగా మండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

పెట్రో ధరల మంట
వీటికి తోడు పెట్రోల్ ధరలూ పరుగులు పెడుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా ౩౦ రూపాయల మేర పెంచింది పాక్ సర్కార్. పెరిగిన ధరలతో చూసుకుంటే లీటర్ పెట్రోల్ ధర 179 రూపాయలకు పైగానే  ఉండగా, లీటర్ డీజిల్ ధర 174 రూపాయలకు పైగానే పలుకుతోంది. ఆ దేశ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి-IMFతో చర్చలు జరిగిన తరవాతే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే పెట్రో ఉత్పత్తులపై రాయితీలు తీసేయాలని సూచించింది ఐఎమ్‌ఎఫ్. కానీ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆ సూచనండా స్ను పట్టించుకోకుండా 
ధరలు పెంచకుండా స్థిరంగా ఉండేలా చూశారు. ఎప్పుడైతే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారో అప్పటి నుంచి పెట్రో ధరల బాదుడు మొదలైంది. 
ంది. 
ప్రజలకు కరెంట్ షాక్..!
పెట్రో ధరల పెంపుతోనే పాకిస్థాన్ ప్రజలు సతమతం అవుతుంటే ఇప్పుడు మరో బాదుడుకి సిద్ధమవుతోంది ప్రభుత్వం. యూనిట్‌కి ఏకంగా 7 రూపాయల మేర పెంచేందుకు సిద్ధమవుతోంది. 
 ఇప్పటికే ఐఎమ్‌ఎఫ్ సూచనల మేరకు ప్రభుత్వ పరిధిలోని డిస్కమ్‌లను ప్రైవేటీకరణ చేసింది పాక్ సర్కార్. ఇప్పుడు కరెంట్ ఛార్జీలనూ పెంచాలని నిర్ణయించుకుంది. 

ఈ నిర్ణయాలు ఐఎమ్‌ఎఫ్ రుణం కోసమేనా..? 
పలు దేశాలు పాకిస్థాన్‌కు సాయం చేసేందుకు ముందుకొస్తున్నప్పటికీ పాకిస్థాన్ చూపు మాత్రం IMFవైపే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ భద్రంగా ఉండాలంటే అది IMFద్వారానే సాధ్యమవుతుందని పాక్ బలంగా నమ్ముతోంది. 
పాకిస్థాన్ డాలర్ బాండ్‌ల విలువ దారుణంగా పడిపోయిన సందర్భంలో పెట్రో ధరలు పెంచింది పాకిస్థాన్. ఇలా పెంచమని సలహా ఇచ్చింది IMFసంస్థే. ఇలా చేస్తే తప్ప ఆ సంస్థ నుంచి నిధులు పొందేందుకు పాకిస్థాన్‌కు అర్హత సాధించలేదు. అందుకే షెహబాజ్ షరీఫ్ ఆ నిర్ణయం తీసుకున్నారు. 

ఇలా అయితే గానీ పాక్ పాట్లు తీరవు
ఇప్పటికిప్పుడు 36 నుంచి 37 బిలియన్ డాలర్ల నిధులు అందితే తప్ప పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం తీరేలా లేదన్నది అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం. ఒక్కసారి IMFతో ఒప్పందం కుదిరితే 
ప్రపంచ బ్యాంకు సహా చైనా లాంటి దేశాలు పాకిస్థాన్‌కు సహకరించేందుకు ముందుకొచ్చే అవకాశముంటుంది. తద్వారా ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. అందుకే IMF సూచనల మేరకు నడుచుకుంటూ 
ప్రజలపై ధరాభారం మోపుతోంది పాకిస్థాన్ ప్రభుత్వం. మరి ఈ నిర్ణయాలు పాక్‌ను గట్టెకిస్తాయో లేదో చూడాలి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
TS Inter Results 2026 2nd Year: తెలంగాణ ఇంటర్ సెకండియర్‌లో 70.58 శాతం పాస్.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ పొందండి
తెలంగాణ ఇంటర్ సెకండియర్‌లో 70.58 శాతం పాస్.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ పొందండి
TS Inter Results 2026 LIVE: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోండి
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోండి
TS Inter 1st Year Results 2026: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం విద్యార్థులు పాస్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం విద్యార్థులు పాస్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

వీడియోలు

Payyavula Kesav on Botsa | జగన్ విషయంలో బొత్స అన్నమాటలనే కదా మేం చెప్పాం
Vybhav Sooryavanshy: హేజిల్‌వుడ్డా.. గాడిదగుడ్డా...? Title:దిగ్గజ బౌలర్లను ఉతికారేస్తున్న వైభవ్
Accident on Vijayawada Highway: విజయవాడ హైవేపై BMWపై బోల్తా పడిన ట్యాంకర్
Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
TS Inter 1st Year Results 2026: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం విద్యార్థులు పాస్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం విద్యార్థులు పాస్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
US Iran Peace Talks: అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. ఇస్లామాబాద్ నుంచి మధ్యలోనే తిరిగి వెళ్తున్న జేడీ వాన్స్ టీం
అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. ఇస్లామాబాద్ నుంచి మధ్యలోనే తిరిగి వెళ్తున్న జేడీ వాన్స్ టీం
TG Inter Results 2026 Link: ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
Amaravati News: అమరావతిపై వైసీపీ విష‌ప్ర‌చారం.. మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
అమరావతిపై వైసీపీ విష‌ప్ర‌చారం.. మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
Macherla ASI Suspension: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
Heatwave Alert in AP: ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
IPL 2026 CSK VS DC Result Update: ఎట్ట‌కేల‌కు చెన్నై బోణీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన సీఎస్కే.. స‌త్తా చాటిన ఓవ‌ర్ట‌న్.. ఢిల్లీకి వ‌రుస‌గా రెండో ఓట‌మి
ఎట్ట‌కేల‌కు చెన్నై బోణీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన సీఎస్కే.. స‌త్తా చాటిన ఓవ‌ర్ట‌న్.. ఢిల్లీకి వ‌రుస‌గా రెండో ఓట‌మి
Embed widget