అన్వేషించండి

International Yoga Day 2024: శ్రీనగర్లో యోగా డే వేడుకల్లో పాల్గొననున్న మోదీ, 7వేల మందితో కలిసి యోగాసనాలు

PM Modi Yoga Day: యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆటగాళ్లతో సహా వందలాది మంది ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు

International Yoga Day 2024:  ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. జూన్ 21న ఈ కార్యక్రమం దాల్ సరస్సు సమీపంలో ఉన్న షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో జరగనుంది. వివిధ రంగాలకు చెందిన 7,000 మందికి పైగా ప్రజలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (Yoga Day 2024) రోజున ప్రధాని ఇక్కడకు రావడం కాశ్మీర్ లోయ మొత్తానికి  గర్వకారణమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. జమ్మూ కాశ్మీర్‌తో ప్రధానికి ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే ఆయన శ్రీనగర్‌లో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారని ఎల్‌జీ  మనోజ్ సిన్హా చెప్పారు. కొన్ని నెలల్లో కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్​లో ఎన్నికల జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం అసెంబ్లీకి తొలిసారి ఎన్నికలు జరగనున్న సందర్భంలో ప్రధాని మోదీ యోగా దినోత్సవాన్ని శ్రీనగర్​లో జరుపుకోవడానికి ప్రాధాన్యత పెరిగింది.  

 యోగాకు అంతర్జాతీయ గుర్తింపు
పదేళ్లలో యోగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 23.5 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో గతేడాది 23 లక్షల మంది ప్రజలు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రతిరోజూ యోగా చేసే వారి సంఖ్య పెరుగుతుంది. ఒత్తిడి లేని జీవితం కోసం ప్రజలు యోగా వైపు మొగ్గు చూపుతున్నారని ఎల్‌జీ  మనోజ్ సిన్హా తెలిపారు.  కాశ్మీర్ ప్రజలతో ప్రధాని మోదీకి ఉన్న సంబంధం ఏంటో  ఈ ఏడాది మార్చిలో బక్షి స్టేడియంలో జరిగిన బహిరంగ సభ రుజువు చేసిందన్నారు. మూడు నెలల క్రితం ఆయన స్టేడియంలో ప్రసంగించినప్పుడు చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారని ఆయన చెప్పారు.  ప్రధాని మోదీ వివిధ మాధ్యమాల ద్వారా ఇక్కడి స్థానికులతో నిరంతరం టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

కశ్మీర్ కు పెరిగిన పర్యాటకులు
అమర్‌నాథ్ యాత్రకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. మొహర్రం కూడా దగ్గరపడుతుండడంతో అన్నీ పక్కాగా ఉండేలా చూసుకుంటామన్నారు.  గతేడాది జీ20 సదస్సు (G20 Summit) విజయవంతంగా నిర్వహించిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకుల రాక పెరిగిందన్నారు. గతంలో కంటే 2.5 శాతం మంది ఎక్కువ ప్రయాణికులు కశ్మీర్ ను సందర్శిస్తున్నారని ఎల్ జీ పేర్కొన్నారు. కాబట్టి ఈ ఈవెంట్‌ కు కూడా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.  జీ20 సదస్సు తర్వాత ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు కశ్మీర్‌కు వస్తున్నారని ఎల్‌జీ వెల్లడించారు. కశ్మీర్‌కు కచ్చితంగా ప్రపంచ గుర్తింపు వస్తుందని, ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ నమోదైన తర్వాత ఈ కేంద్ర పాలిత ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిందని సిన్హా అన్నారు.

రెడ్ జోన్ గా కశ్మీర్
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ పర్యటనకు ముందు, జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం నగరాన్ని తాత్కాలిక 'రెడ్ జోన్'గా ప్రకటించారు. డ్రోన్ల ఆపరేషన్‌ను నిషేధించారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ గురువారం తొలిసారి శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా డ్రోన్‌ల ఆపరేషన్‌పై నిషేధం గురించి శ్రీనగర్ పోలీసులు 'X'లో పోస్ట్ చేశారు.  యోగా కార్యక్రమంలో ఆటగాళ్లతో సహా వందలాది మంది ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. పాల్గొనేవారిని షార్ట్‌లిస్ట్ చేశామ, వారికి వివిధ 'ఆసనాలలో' శిక్షణ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం థీమ్ '  స్వీయ, సమాజం కోసం యోగా' అని జమ్మూ కశ్మీర్ ఆయుష్‌ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్‌ తెలిపారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
IAS Karthikeya Mishra: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా - సీఎస్ ఉత్తర్వులు
సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా - సీఎస్ ఉత్తర్వులు
Axar Patel: శ్రీలంకకు ఆ జయసూర్య, భారత్‌కు ఈ జయసూర్య - అక్షర్ పటేల్‌‌పై ప్రశంసలు
శ్రీలంకకు ఆ జయసూర్య, భారత్‌కు ఈ జయసూర్య - అక్షర్ పటేల్‌‌పై ప్రశంసలు
Mann Ki Baat: అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
ICC T20 World Cup 2024: మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పై వివాదం, బౌండరీ లైన్ ను సూర్య తగిలాడా?
మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పై వివాదం, బౌండరీ లైన్ ను సూర్య తగిలాడా?
Embed widget