అన్వేషించండి

Nityananda: ఆ పీఠంపై కన్నేసిన నిత్యానంద.. ఒక్క ప్రకటనతో దుమారం.. వెంటనే తాళాలు వేసి, గదులు సీజ్

మధురై అధీనం తదుపరి పీఠాధిపతిగా నిత్యానంద తనను తాను ప్రకటించుకున్నారు. దీన్ని శైవ పీఠాధిపతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

వివాదాస్పద మత గురువైన నిత్యానంద స్వామి తాజాగా చేసిన ఓ ప్రకటన తమిళనాడులో సంచలనంగా మారింది. తమిళనాడులోని మధురై పీఠంపై ఆయన కన్నేశారు. మధురై అధీనం తదుపరి పీఠాధిపతిగా నిత్యానంద తనను తాను ప్రకటించుకున్నారు. మఠానికి సంబంధించిన సర్వ హక్కులు, అధికారాలు, ఆధ్యాత్మిక సంపద, మతపరమైన గౌరవాలు, పూజా కార్యక్రమాల నిర్వహణ తనకే చెందుతాయని నిత్యానంద తన లేఖలో పేర్కొన్నారు. ఆ అధీనం ప్రస్తుత పీఠాధిపతి అరుణగిరి నాథర్ అనారోగ్య సమస్యతో శుక్రవారం చెన్నైలో చనిపోయారు. అంతకుముందు అరుణగిరి నాథర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే నిత్యానంద ఆ ప్రకటన విడుదల చేశారు. అరుణగిరి నాథర్ వారసుడిగా నిత్యానంద స్వీయ ప్రకటన చేసుకోవడంతో మధురైలోని మీనాక్షి ఆలయం సమీపంలో ఉన్న మధురై అధీనం గదులను మూసివేశారు. గురువారం రాత్రి మైలాడుతురైకి చెందిన ధర్మపురం అధీనం సమక్షంలో గదులను సీల్ చేసేశారు.

వెయ్యేళ్ల చరిత్ర
మధురై అధీనం చాలా పురాతనమైనది. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ మధురై అధీనం అత్యంత పురాతన శైవ (హిందూ) పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. ఈ పురాతన అధీనానికి త్రిమన్ నాయనార్ (శివుని శిష్యులు)లలో ఒకరైన తిరుజ్ఞాన సంబంధర్ పూర్వవైభవం తెచ్చారని చెబుతారు. పెద్ద ఎత్తున ఆస్తులు ఈ మఠం సొంతం. తంజావూరు జిల్లాలో వందల ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఎన్నో స్థిరాస్తులు ఈ మఠానికి సొంతంగా ఉన్నాయి. అంతేకాక, తమిళనాడులో నాలుగు ప్రముఖ దేవాలయాలకు ఈ మఠం ట్రస్టీగా కూడా ఉంది. ఇంతటి పురాతనమైన మఠానికి 292వ పీఠాధిపతిగా అరుణగిరి నాథర్ కొనసాగారు. ఆయన 1980ల నుంచి ఆ అధీనానికి సేవలందిస్తున్నారు. ఈ ఆగస్టు 9న అరుణగిరి నాథర్‌కు శ్వాససంబంధిత సమస్యలు తలెత్తడంతో మధురైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూ తాజాగా చనిపోయారు. ప్రస్తుతం ఆయన వయసు 77 ఏళ్లు.
Also Read: Jagitial: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానన్న స్వామీజీ.. శవం దగ్గర మంత్రాలు, పూజలు.. చివరికి ఏమైందంటే..!

2012లోనే నిత్యానందను ప్రకటించిన పీఠాధిపతి
అయితే, నిత్యానంద ఇప్పుడు తనను తాను మధురై మఠం పీఠాధిపతిగా ప్రకటించుకునేందుకు ఓ కారణం ఉంది. ఆ మఠానికి నిత్యానందను యువ పీఠాధిపతిగా 2012లోనే అరుణగిరి నాథర్ ప్రకటించారు. అయితే, అదే సమయంలో కంచి, తిరువావదుతురై మఠాలు సహా.. ఇతర మఠాలకు చెందిన పీఠాధిపతులు అరుణగిరి నాథర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంపై పెద్ద దుమారమే రేగింది. దీంతో కొద్ది నెలలకే అరుణగిరి నాథర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గతంలో అరుణగిరి నాథర్‌తో నిత్యానందకు సన్నిహిత సంబంధాలుండేవి. ఆధీనాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని మఠం ఆస్తులని, విలువైన మరకత లింగాన్ని అక్రమంగా తరలించినట్టు కొన్నేళ్ల క్రితం వీడియోలు బయట పడడంతో నిత్యానంద అధీనాన్ని వదిలి వెళ్లారు.

కోర్టుకెక్కిన నిత్యానంద
ఆ తర్వాత ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ.. నిత్యానంద కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇంకా మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అంతేకాక, మఠానికి సంబంధించిన వ్యవసాయ భూములు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. వాటికి సంబంధించిన కేసులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అరుణగిరి నాథర్ ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉండగానే.. నిత్యానంద మధురై అధీనం 293వ పీఠాధిపతిగా తనని తాను ప్రకటించుకున్నారు.
Also Read: India Corona Cases: కర్ణాటకలో లాక్‌డౌన్ విధిస్తారా.. క్లారిటీ ఇచ్చిన ఆర్థికశాఖ మంత్రి

అప్పట్లో సంచలనంగా లైంగిక వేధింపుల కేసు
2010లో నిత్యానందపై లైంగిక వేధింపుల కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఓ సినీ నటితో రాసలీలలు ఆడుతున్న వీడియో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల వయసు గల నిత్యానంద పరమశివం అసలు పేరు రాజశేఖరన్. ఆయన 20 ఏళ్ల క్రితం బెంగళూరు-మైసూర్ హైవే పక్కన బిడాది అనే ప్రాంతంలో ఆశ్రమం నెలకొల్పారు.

టాప్ హెడ్ లైన్స్

జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget