అన్వేషించండి

Nityananda: ఆ పీఠంపై కన్నేసిన నిత్యానంద.. ఒక్క ప్రకటనతో దుమారం.. వెంటనే తాళాలు వేసి, గదులు సీజ్

మధురై అధీనం తదుపరి పీఠాధిపతిగా నిత్యానంద తనను తాను ప్రకటించుకున్నారు. దీన్ని శైవ పీఠాధిపతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

వివాదాస్పద మత గురువైన నిత్యానంద స్వామి తాజాగా చేసిన ఓ ప్రకటన తమిళనాడులో సంచలనంగా మారింది. తమిళనాడులోని మధురై పీఠంపై ఆయన కన్నేశారు. మధురై అధీనం తదుపరి పీఠాధిపతిగా నిత్యానంద తనను తాను ప్రకటించుకున్నారు. మఠానికి సంబంధించిన సర్వ హక్కులు, అధికారాలు, ఆధ్యాత్మిక సంపద, మతపరమైన గౌరవాలు, పూజా కార్యక్రమాల నిర్వహణ తనకే చెందుతాయని నిత్యానంద తన లేఖలో పేర్కొన్నారు. ఆ అధీనం ప్రస్తుత పీఠాధిపతి అరుణగిరి నాథర్ అనారోగ్య సమస్యతో శుక్రవారం చెన్నైలో చనిపోయారు. అంతకుముందు అరుణగిరి నాథర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే నిత్యానంద ఆ ప్రకటన విడుదల చేశారు. అరుణగిరి నాథర్ వారసుడిగా నిత్యానంద స్వీయ ప్రకటన చేసుకోవడంతో మధురైలోని మీనాక్షి ఆలయం సమీపంలో ఉన్న మధురై అధీనం గదులను మూసివేశారు. గురువారం రాత్రి మైలాడుతురైకి చెందిన ధర్మపురం అధీనం సమక్షంలో గదులను సీల్ చేసేశారు.

వెయ్యేళ్ల చరిత్ర
మధురై అధీనం చాలా పురాతనమైనది. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ మధురై అధీనం అత్యంత పురాతన శైవ (హిందూ) పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. ఈ పురాతన అధీనానికి త్రిమన్ నాయనార్ (శివుని శిష్యులు)లలో ఒకరైన తిరుజ్ఞాన సంబంధర్ పూర్వవైభవం తెచ్చారని చెబుతారు. పెద్ద ఎత్తున ఆస్తులు ఈ మఠం సొంతం. తంజావూరు జిల్లాలో వందల ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఎన్నో స్థిరాస్తులు ఈ మఠానికి సొంతంగా ఉన్నాయి. అంతేకాక, తమిళనాడులో నాలుగు ప్రముఖ దేవాలయాలకు ఈ మఠం ట్రస్టీగా కూడా ఉంది. ఇంతటి పురాతనమైన మఠానికి 292వ పీఠాధిపతిగా అరుణగిరి నాథర్ కొనసాగారు. ఆయన 1980ల నుంచి ఆ అధీనానికి సేవలందిస్తున్నారు. ఈ ఆగస్టు 9న అరుణగిరి నాథర్‌కు శ్వాససంబంధిత సమస్యలు తలెత్తడంతో మధురైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూ తాజాగా చనిపోయారు. ప్రస్తుతం ఆయన వయసు 77 ఏళ్లు.
Also Read: Jagitial: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానన్న స్వామీజీ.. శవం దగ్గర మంత్రాలు, పూజలు.. చివరికి ఏమైందంటే..!

2012లోనే నిత్యానందను ప్రకటించిన పీఠాధిపతి
అయితే, నిత్యానంద ఇప్పుడు తనను తాను మధురై మఠం పీఠాధిపతిగా ప్రకటించుకునేందుకు ఓ కారణం ఉంది. ఆ మఠానికి నిత్యానందను యువ పీఠాధిపతిగా 2012లోనే అరుణగిరి నాథర్ ప్రకటించారు. అయితే, అదే సమయంలో కంచి, తిరువావదుతురై మఠాలు సహా.. ఇతర మఠాలకు చెందిన పీఠాధిపతులు అరుణగిరి నాథర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంపై పెద్ద దుమారమే రేగింది. దీంతో కొద్ది నెలలకే అరుణగిరి నాథర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గతంలో అరుణగిరి నాథర్‌తో నిత్యానందకు సన్నిహిత సంబంధాలుండేవి. ఆధీనాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని మఠం ఆస్తులని, విలువైన మరకత లింగాన్ని అక్రమంగా తరలించినట్టు కొన్నేళ్ల క్రితం వీడియోలు బయట పడడంతో నిత్యానంద అధీనాన్ని వదిలి వెళ్లారు.

కోర్టుకెక్కిన నిత్యానంద
ఆ తర్వాత ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ.. నిత్యానంద కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇంకా మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అంతేకాక, మఠానికి సంబంధించిన వ్యవసాయ భూములు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. వాటికి సంబంధించిన కేసులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అరుణగిరి నాథర్ ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉండగానే.. నిత్యానంద మధురై అధీనం 293వ పీఠాధిపతిగా తనని తాను ప్రకటించుకున్నారు.
Also Read: India Corona Cases: కర్ణాటకలో లాక్‌డౌన్ విధిస్తారా.. క్లారిటీ ఇచ్చిన ఆర్థికశాఖ మంత్రి

అప్పట్లో సంచలనంగా లైంగిక వేధింపుల కేసు
2010లో నిత్యానందపై లైంగిక వేధింపుల కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఓ సినీ నటితో రాసలీలలు ఆడుతున్న వీడియో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల వయసు గల నిత్యానంద పరమశివం అసలు పేరు రాజశేఖరన్. ఆయన 20 ఏళ్ల క్రితం బెంగళూరు-మైసూర్ హైవే పక్కన బిడాది అనే ప్రాంతంలో ఆశ్రమం నెలకొల్పారు.

టాప్ హెడ్ లైన్స్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడు శ్రీరామ్ రెడ్డి వాహనాలు ధ్వంసం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget