అన్వేషించండి

Pawan Kalyan: మత్స్యకారుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధం : పవన్ కల్యాణ్

మత్స్యకారుల పొట్టకొట్టేందుకే ప్రభుత్వం జీవో 217 తీసుకొచ్చిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జీవో 217తో మత్స్యకారులు నష్టపోతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించారు. ఈ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోని లేని విధంగా జీవో 217ను ఏపీలో అమలు చేస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభి రాష్ట్రమంతా అమలు చేస్తారన్నారు. జీవో 217కు వ్యతిరేకంగా మత్స్యకారుల పోరాటానికి అండగా ఉంటానన్నారు. జీవో పేపర్లను పవన్ వేదికపై చింపేశారు. మత్స్యకారుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జీవో కాపీ చింపితే చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని, కేసులు పెట్టినా భయపడనన్నారు. మత్స్యకారులకు ఇళ్లు నిర్మించలేదని, తుపాను షెల్టర్లు కూడా కట్టలేదని ఆరోపించారు. జనసేన అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఈ జీవోలు రద్దు చేస్తామన్నారు. 

2024 సాధారణ ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలని పవన్ పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు సమస్యలు పరిష్కారం పేరుతో అనేక ఇబ్బందులు పెడతారని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది మటన్‌, చికెన్‌ షాపులు పెట్టడానికా అని పవన్ ప్రశ్నించారు. పాదయాత్రలో ప్రజలకు వేటకు వెళ్లి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు కానీ మూడేళ్లలో 64 మత్స్యకార కుటుంబాలకు మాత్రమే పరిహారం అందిందని పవన్ అన్నారు. చట్టాలు పాటించేలా ముందు వైకాపా నేతలను నిలదీయాలన్నారు. గంగవరం జెట్టీ పేరుతో మత్స్య కారులను నిరాశ్రయులను చేశారన్నారు. మత్స్యకారులు అండగా ఉంటే సమస్యలు పరిష్కరిస్తామని పవన్ హామీఇచ్చారు. జీవో 217ను వెనక్కి తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. 

రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడిన పవన్ రాజమహేంద్రవరం నుంచి నరసాపురం వస్తుంటే దారి పొడవునా గోతులే అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జనసేన సభకు చక్కని ఏర్పాట్లు చేసిందని, దారంతా గొయ్యిలే చక్కటి అభివృద్ధి అని వ్యంగ్యంగా అన్నారు. రోడ్లపై పడవ ప్రయాణం ఊగుతూ వస్తుంటే మాయాబజార్‌లో లాహిరి లాహిరి పాట గుర్తొచ్చిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా గెలిచిన జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చేస్తున్నారన్న, భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. జనసైనికులకు పార్టీ ఎప్పుడూ ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ నేతల బెదిరింపులకు జనసైనికులు భయపడరన్నారు. అక్రమ కేసులు పెట్టి హింసిస్తే ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారుల పొట్టకొట్టేందుకు జీవో 217 తీసుకొచ్చారన్నారు. జనసేనకు పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 చించిపారేసే వాళ్లమన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Embed widget