అన్వేషించండి

Biryani: బిర్యానీ తిన్న వెంటనే పుచ్చకాయ కూడా తిన్నారు - కుటుంబం అంతా మృతి - ఇలా కూడా జరుగుతుందా?

mumbai : బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తింటే చనిపోతారా? ముంబైలో ఓ కుటుంబం అలాగే చనిపోయింది.

Watermelon after Biryani Tragedy: ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బిర్యానీ తర్వాత పుచ్చకాయ తినడం వల్ల చనిపోయారు. కుటుంబంలో నలుగురు  12 గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆహ్లాదకరంగా సాగిన ఒక విందు భోజనం.. ఒక కుటుంబం మొత్తాన్ని చిదిమేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నప్పటికీ, మరణానికి గల అసలు కారణాలపై ఇప్పుడు వైద్య నిపుణులు ,పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

 విందు భోజనం.. విషాదాంతం 

ముంబైలోని పైధోని ప్రాంతానికి చెందిన అబ్దుల్లా అబ్దుల్ కాదర్  , తన భార్య నస్రీన్  , కుమార్తెలు అయేషా (16), జైనాబ్  లతో కలిసి శనివారం రాత్రి బంధువులతో కలిసి విందులో పాల్గొన్నారు. అందరూ కలిసి రాత్రి 10:30 గంటల సమయంలో ఎంతో ఇష్టంగా బిర్యానీ తిన్నారు. ఆ సమయంలో ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఒక గంట సమయంలో పుచ్చకాయను డెజర్ట్‌గా తీసుకున్నారు. అక్కడి నుండే ఆ కుటుంబానికి మృత్యువు ముంచుకొచ్చింది.

 12 గంటల్లోనే ప్రాణాలు గాలిలో.. 

పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే, అంటే తెల్లవారుజామున 5 గంటల నుండి కుటుంబ సభ్యులందరికీ తీవ్రమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. స్థానిక డాక్టర్ వద్దకు వెళ్లినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చిన్న కుమార్తె జైనాబ్ మరణించగా, ఆమె వెంటే తల్లి నస్రీన్, అక్క అయేషా ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 10:30 గంటల సమయంలో తండ్రి అబ్దుల్లా కూడా కన్నుమూశాడు. 

పుచ్చకాయే కారణమా? 

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారు తిన్న పుచ్చకాయ ముక్కలను స్వాధీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలకు పంపారు. సాధారణంగా పుచ్చకాయ తింటే ప్రాణాలు పోవు, కానీ అందులో ఏదైనా బాహ్య విషపదార్థాలు  కలిశాయా లేదా రంగు కోసం ఏదైనా హానికరమైన రసాయనాలు వాడారా అనే కోణంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తోంది. బిర్యానీ తిన్న తర్వాత వెంటనే పుచ్చకాయ తినడం వల్ల ఏదైనా రసాయనిక చర్య జరిగిందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.   

 వైద్య పరీక్షల నివేదికపై ఉత్కంఠ 

జేజే ఆసుపత్రి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించి బాడీ శాంపిల్స్ ,  విసెరా రిపోర్టులను ఫోరెన్సిక్ విభాగానికి పంపారు. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఉందా లేక ఇతర విషతుల్య పదార్థాల ప్రభావమా అన్నది తేల్చడానికి మైక్రోబయాలజీ మరియు హిస్టోపాథాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నివేదికలు వస్తే తప్ప ముంబైని కుదిపేసిన ఈ మిస్టరీ మరణాల వెనుక ఉన్న అసలు కారణం బయటపడదు. ప్రస్తుతానికి ఈ ఘటన అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Kranti Gaud Record:  క్రాంతి గౌడ్ అరుదైన ఘ‌న‌త‌.. జులన్ గోస్వామి ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు, ఇంగ్లాండ్ ను వణికించిన 22 ఏళ్ల నయా స్పీడ్‌స్టర్! ప‌ట్టుబిగించిన టీమిండియా
క్రాంతి గౌడ్ అరుదైన ఘ‌న‌త‌.. జులన్ గోస్వామి ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు, ఇంగ్లాండ్ ను వణికించిన 22 ఏళ్ల నయా స్పీడ్‌స్టర్! ప‌ట్టుబిగించిన టీమిండియా
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget