అన్వేషించండి

26/11 Mumbai Attack: ఆ మారణహోమం నుంచి పాఠం నేర్చుకున్న భారత్, ఉగ్రపోరులో మారిన వ్యూహాలు

26/11 Mumbai Attack: 26/11 దాడుల తరవాత ఉగ్రపోరులో భారత్ వ్యూహాలు మార్చింది.

26/11 Mumbai Attack:

14 ఏళ్లు..

ముంబయిలో తాజ్‌ హోటల్‌పై ఉగ్రదాడి జరిగి నేటికి 14 ఏళ్లు. దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని భయంకరమైన సంఘటన అది. దేశమంతా వణికిపోయిన దారుణమది. 2008 నవంబర్ 26న జరిగిన ఈ మారణహోమం...ఎన్నో కుటుంబాలకు కన్నీళ్లు మిగిల్చింది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టింది. 166 మంది ప్రాణాలను బలిగొంది. ఈ దాడి తరవాత ఉగ్రవాదంపై భారత్ కొనసాగిస్తున్న పోరాటం తీరు పూర్తిగా మారిపోయింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ 
వచ్చింది. దాదాపు 4 రోజుల పాటు కొనసాగిన ఆ ఉగ్రదాడి...భారత రక్షణ వ్యవస్థలోని లూప్‌హోల్స్‌ను బయటపెట్టింది. అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తక్షణమే స్పందించి..ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. దేశ అంతర్గత భద్రతను పటిష్ఠం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడం వల్ల తీరప్రాంతాల్లోని నగరాల్లో భద్రతలో లోపాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అందుకే..అప్పటికప్పుడు తీర ప్రాంతాల రక్షణ నిర్వహణలో సంస్కరణలు తీసుకొచ్చారు. తీర ప్రాంతాల్లో నిఘా పెంచేందుకు సాగర్ ప్రహరి బల్ (SPB) బలగాలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు Fast Interceptor Crafts (FIC)ను అందుబాటులోకి తీసుకొచ్చింది..అప్పటి ప్రభుత్వం. 26/11 దాడి జరిగినప్పటి నుంచి గతేడాది నవంబర్ వరకూ... 300 సార్లు తీర ప్రాంతాల్లో విన్యాసాలు చేపట్టారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ వీటికి నేతృత్వం వహించింది. 

ఎన్నో సంస్కరణలు..

2018లో సముద్ర జలాలపై నిఘా ఉంచాలన్న ఉద్దేశంతో..కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్‌సైజ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. 2019 నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ సంయుక్తంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.  2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం National Investigation Agency (NIA) చట్టాన్ని ఆమోదించింది. అప్పుడే NIAని ఏర్పాటు చేసింది. ఉగ్రవాదానికి సంబంధించిన ఏ కేసునైనా
పరిశీలించేందుకు ఈ సంస్థకు పూర్తి అధికారాలు అప్పగించింది. ఇక ముంబయిలోనూ పోలీసింగ్ విధానంలో చాలా మార్పులు వచ్చాయి. మునుపటి కన్నా..అత్యాధునిక వ్యవస్థలు అందుబాటులోకి తెచ్చుకున్నారు. ఇతర భద్రతా సంస్థలతోనూ సమన్వయం చేసుకుంటూ నిఘా పెంచారు. ఇతర దేశాల భద్రతా సంస్థలతో ఇంటిలిజెన్స్ షేరింగ్ విషయంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించింది. 2008 నాటి పరిస్థితులతో పోల్చుకుంటే..ఇప్పుడు చాలా ముందంజలో ఉంది. ఉగ్రదాడులు జరిగినా వెంటనే స్పందించి ముష్కరుల ఆట కట్టించేందుకు వీలుగా...పలు రాష్ట్రాల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) హబ్స్‌ను ఏర్పాటు చేశారు. 

ఇలా జరిగింది..

2008, నవంబర్ 26 రాత్రి 8 గంటల ప్రాంతంలో 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు స్పీడ్‌బోట్లలో ముంబయిలోని కొలాబా తీర ప్రాంతానికి చేరుకొన్నారు. ఆ తర్వాత రెండు బృందాలుగా విడిపోయారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రద్దీగా ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌లోకి ఇద్దరు ముష్కరులు చొరబడ్డారు. ఏకే-47 తుపాకులతో ప్రజలపై తూటాల వర్షం కురిపించారు. పోలీసులు అక్కడకు చేరుకునే లోపే 58 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్‌, నారిమన్‌ లైట్‌ హౌస్‌ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ కేసులో అతడికి శిక్ష పడటంతో ఆ తర్వాత నాలుగేళ్లకు ఉరితీశారు. 

Also Read: ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Telangana Group 2 Result: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
FASTag New Rules: బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
Nara Lokesh At Prayagraj: మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.