అన్వేషించండి

MP Kanimozhi: ఖుష్భూ, నమితపై డీఎంకే నేత అసభ్యకర వ్యాఖ్యలు- కనిమొళి క్షమాపణలు!

MP Kanimozhi: భాజపాలో ఉన్న సీనియర్ హీరోయిన్లు ఖుష్భూ, నమితపై డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

MP Kanimozhi: భాజపాలో చేరిన హీరోయిన్స్ ఖుష్భూ, నమిత, గౌతమి, గాయత్రి రఘురామన్‌లపై డీఎంకే నేత సాధైయ్ సాధిక్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై డీఎంకే నాయకురాలు కనిమొళి.. బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

అనుచిత వ్యాఖ్యలు

ఆర్కే నగర్‌లో ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో డీఎంకే నేత సాధైయ్ సాధిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. భాజపాలో ఉన్న సీనియర్‌ నటీమణులు ఖుష్బూ, నమితా, గౌతమి, గాయత్రి రఘురామన్‌లు 'ఐటమ్‌'లు అంటూ వ్యాఖ్యానించారు.

" తమిళనాడులో భాజపా బలపడుతుందని ఖుష్బూ చెబుతున్నారు. అమిత్‌షా తలపై వెంట్రుకలైనా మొలుస్తాయోమో కానీ తమిళనాడులో కమలం మాత్రం వికసించదు. డీఎంకేను నాశనం చేసి భాజపాని బలోపేతం చేసేందుకు ఈ ఐటమ్స్ ఉపయోగపడతారా? ఇది వారి వల్ల కాదు. "
-                                                            సాధైయ్ సాధిక్, డీఎంకే నేత

అంతటితో ఆగని సాధిక్.. ఖుష్భూపై రాయలేని భాషలో అసభ్య పదజాలాన్ని వినియోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై భాజపా నేత ఖుష్భూ తీవ్రంగా స్పందించారు. ఇదేనా సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ మోడల్ పాలన అంటూ విమర్శించారు.

" పురుషులు స్త్రీలను దుర్భాషలాడటం.. అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ పురుషులు.. స్త్రీ గర్భాన్ని అవమానిస్తారు. అలాంటి పురుషులు  తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇదేనా సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ నమూనా పాలన.                                   "
- ఖుష్భూ, భాజపా నేత

క్షమాపణలు

ఖుష్భూ చేసిన ట్వీట్‌పై డీఎంకే నేత కనిమొళి స్పందించారు. ఖుష్బూకి క్షమాపణలు తెలియజేశారు.

" మహిళలను కించపరుస్తూ మా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేం. మా నాయకుడు సీఎం స్టాలిన్‌ గానీ, పార్టీ అధిష్టానం కానీ ఇలాంటి చర్యలను ఉపేక్షించదు.                                                  "
- కనిమొళి, డీఎంకే నాయకురాలు 

Also Read: Delhi News: రోడ్డుపై చెలరేగిన గొడవ- ముగ్గురిని కారుతో ఢీ కొట్టి డ్రైవర్ పరార్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget