అన్వేషించండి

Monsoon News: దేశంలో 80 శాతానికిపైగా ప్రాంతాలను తాకిన రుతుపనాలు- ఈసారి విస్తరణలో చిత్రవిచిత్రాలు!

Monsoon News: ఈ ఏడాది దేశంలో ఇప్పటి వరకు 80 శాతానికి పైగా నైరుతి రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 

Monsoon News: ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు భారతదేశంలో 80 శాతానికి చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా విస్తరించాయని చెప్పింది. రుతుపవనాలు ఆదివారం ఒకే రోజు ఢిల్లీ, ముంబైకి చేరుకున్నాయి. 62 ఏళ్ల తర్వాత ఇది జరిగిందని ఐఎండీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముంబయిలో రెండు వారాలు ఆలస్యంగా, ఢిల్లీలో రెండు రోజుల ముందుగా నైరుతి రుతు పవనాలు ప్రవేశించడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని వివరించారు. అయితే దీనిని నేరుగా వాతావరణ మార్పులతో ముడి పెట్టలేమని.. కాబట్టి దీన్ని గుర్తించడానికి 30 నుంచి 40 సంవత్సరాల డేటాను చూడాల్సి వస్తుందని చెప్పారు. రుతుపవనాలు ఈ ఏడాది కొత్త తరహాలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి.

గాలులు మరింత పెరగడానికి కారణాలు ఇవే..!

"సాధారణంగా, రుతుపవనాలు అల్పపీడనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. అల్పపీడన వల్ల ఏర్పడే గాలుల కారణంగా విస్తారంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి. దీని వల్ల వర్షం కురిసింది" అని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ వెల్లడించారు. అరేబియా సముద్రం నుంచి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈటైంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఈ గాలులు మరింత పెరిగాయన్నారు. దీని ఫలితంగా ముంబైతో సహా మహారాష్ట్రలో వర్షాలు కురిశాయని, అదే సమయంలో అల్పపీడన ప్రభావం ఢిల్లీ సహా వాయువ్య భారతదేశం వైపు విస్తరించింది. ఫలితంగా గాలులు వీచాయి. ఇలా ఈసారి రుతుపవనాలు రెండు ప్రాంతాలను ఒకేసారి కవర్ చేసింది. అసోంపై మేఘాలు కమ్ముకున్నాయని, అయితే అక్కడ చెప్పుకోదగ్గ వర్షాలు కురిసే అవకాశం లేదని ఐఎండీ అంచనా వేస్తోంది. 

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు..

నైరుతి రుతుపవనాల కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దేశంలోని చాలా ప్రాంతాల్లో వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. పంజాబ్, హర్యానాలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు ఇది కొనసాగనుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాను ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి. 200 మందికిపైగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. కులులో అనేక వాహనాలు కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. ఛత్తీస్ గఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు

 రుతుపవనాలు కారణంగా తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుంచి మోస్తారు  వర్షాలు  ఈ రెండు రోజులు కొన్ని చోట్ల ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో  కూడిన వర్షములు  ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.  ఈ రోజు భారీ వర్షాలు రాష్ట్రంలో ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ  వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఏపీలో చూసుకుంటే... ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే ఛాన్స్ ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget