అన్వేషించండి

3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !

State Votes: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పుదుచ్చేరి, అసోం, కేరళల్లో పోలింగ్ ముగిసింది. భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Massive polling recorded in Assam, Kerala and Puducherry : అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న  మూడు ముఖ్యమైన రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కేరళ, అసోం ,  కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో భద్రపరిచారు. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన అధికారిక గణాంకాలను బట్టి చూస్తే, ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినట్లు స్పష్టమవుతోంది.
  
కేరళ: హోరాహోరీ పోరులో  భారీ  ఓటింగ్

కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఎల్డీఎఫ్ (LDF) , యూడీఎఫ్ (UDF) మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఈ రాష్ట్రంలో ఓటర్లు ఎప్పటిలాగే చైతన్యాన్ని చాటారు. సాయంత్రం 5 గంటల సమయానికి కేరళలో సుమారు 75శాతానికిపైగా  పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు క్యూలైన్లలో అధిక సంఖ్యలో కనిపించారు. క్యూలో ఉన్న వారందరికీ ఓటు  వేసే అవకాశం లభిస్తుంది. అందుకే పోలింగ్ శాతం ఎనభై శాతం వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి .కేరళలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, మెట్రో మ్యాన్ ఈ.శ్రీధరన్ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.   

 
అసోంలో రికార్డు స్థాయి పోలింగ్ 

అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఒకే విడతలో  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  84.42% భారీ ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన  తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన కుటుంబంతో కలిసి జలుక్‌బరీలో ఓటు వేయగా, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ జోర్హాట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు, ఒకచోట పోలింగ్ కేంద్రం లోపల వీడియో తీసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు కావడం వంటి చిన్న చిన్న సంఘటనలు మినహా, 31,490 కేంద్రాల్లో పోలింగ్ సజావుగా సాగింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హ్యాట్రిక్ విజయం కోసం చూస్తుండగా, పదేళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి గట్టిగా పోరాడుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.  

పుదుచ్చేరిలోనూ ఓటెత్తిన జనం
  
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు  ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  82.35%   భారీ ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు, ముఖ్యంగా మహిళా ఓటర్లు , యువత అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్‌ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి , కాంగ్రెస్-డీఎంకే కూటమిల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఈ ఎన్నికలలో, అక్కడక్కడా ఈవీఎంల సాంకేతిక సమస్యలు మినహా పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా సాగింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి, ఇతర రాజకీయ ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటు వేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగిన ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.    turnout records Puducherry leads with 86.92 per cent, followed closely by Assam at 84.42 per cent, and Kerala at 75.01 per cent.#Assemblypolls

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
RCB vs GT Head to Head: ఫైనల్లో బెంగళూరు, గుజరాత్ మధ్య హోరాహోరీ తప్పదా.. ముఖాముఖి పోరులో విజేత ఎవరు
ఫైనల్లో బెంగళూరు, గుజరాత్ మధ్య హోరాహోరీ తప్పదా.. ముఖాముఖి పోరులో విజేత ఎవరు
ABP Desam Top 10, 31 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 31 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Advertisement

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
Embed widget