అన్వేషించండి

3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !

State Votes: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పుదుచ్చేరి, అసోం, కేరళల్లో పోలింగ్ ముగిసింది. భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Massive polling recorded in Assam, Kerala and Puducherry : అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న  మూడు ముఖ్యమైన రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కేరళ, అసోం ,  కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో భద్రపరిచారు. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన అధికారిక గణాంకాలను బట్టి చూస్తే, ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినట్లు స్పష్టమవుతోంది.
  
కేరళ: హోరాహోరీ పోరులో  భారీ  ఓటింగ్

కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఎల్డీఎఫ్ (LDF) , యూడీఎఫ్ (UDF) మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఈ రాష్ట్రంలో ఓటర్లు ఎప్పటిలాగే చైతన్యాన్ని చాటారు. సాయంత్రం 5 గంటల సమయానికి కేరళలో సుమారు 75శాతానికిపైగా  పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు క్యూలైన్లలో అధిక సంఖ్యలో కనిపించారు. క్యూలో ఉన్న వారందరికీ ఓటు  వేసే అవకాశం లభిస్తుంది. అందుకే పోలింగ్ శాతం ఎనభై శాతం వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి .కేరళలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, మెట్రో మ్యాన్ ఈ.శ్రీధరన్ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.   

 
అసోంలో రికార్డు స్థాయి పోలింగ్ 

అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఒకే విడతలో  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  84.42% భారీ ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన  తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన కుటుంబంతో కలిసి జలుక్‌బరీలో ఓటు వేయగా, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ జోర్హాట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు, ఒకచోట పోలింగ్ కేంద్రం లోపల వీడియో తీసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు కావడం వంటి చిన్న చిన్న సంఘటనలు మినహా, 31,490 కేంద్రాల్లో పోలింగ్ సజావుగా సాగింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హ్యాట్రిక్ విజయం కోసం చూస్తుండగా, పదేళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి గట్టిగా పోరాడుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.  

పుదుచ్చేరిలోనూ ఓటెత్తిన జనం
  
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు  ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  82.35%   భారీ ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు, ముఖ్యంగా మహిళా ఓటర్లు , యువత అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్‌ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి , కాంగ్రెస్-డీఎంకే కూటమిల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఈ ఎన్నికలలో, అక్కడక్కడా ఈవీఎంల సాంకేతిక సమస్యలు మినహా పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా సాగింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి, ఇతర రాజకీయ ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటు వేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగిన ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.    turnout records Puducherry leads with 86.92 per cent, followed closely by Assam at 84.42 per cent, and Kerala at 75.01 per cent.#Assemblypolls

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Breaking News: సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Embed widget