అన్వేషించండి

Mallikarjun Kharge: ప్రభుత్వాల్ని కూల్చే కుటిల రాజకీయాలు మోదీ-షాలవి: మల్లిఖార్జున ఖర్గే

Hyderabad News: హైదరాబాద్ వచ్చిన మల్లిఖార్జున ఖర్గే బూత్ లెవెల్ కమిటీలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీపైన కూడా విమర్శలు చేశారు.

Mallikarjun Kharge in Hyderabad: బీజేపీ బెదిరింపులకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ భయపడబోరని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. మోదీ - అమిత్ షాలు ప్రభుత్వాల్ని కూల్చి వేసే కుటిల ప్రయత్నాలు చేయబోతున్నారని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్ సభ ఎన్నికల కోసం కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయాలని ఖర్గే పిలుపు ఇచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ అందరూ కష్టపడి పని చేయాలని పిలుపు ఇచ్చారు. నిత్యం ప్రజల్లో ఉంటేనే గెలుపు సాధ్యం అవుతుందని అన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన మల్లిఖార్జున ఖర్గే.. ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కమిటీలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీపైన కూడా విమర్శలు చేశారు. ప్రతి వార్తా పత్రికలో 'మోదీ గ్యారెంటీ' ప్రకటనలు వేశారని.. గతంలో బీజేపీ, మోదీ ఇచ్చిన హామీలు.. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం. నల్లధనాన్ని వెనక్కి తెస్తాం. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం అన్నారని ఖర్గే అన్నారు. కానీ, ఇంత వరకూ ఏ ఒక్కటి కూడా ప్రధాని నెరవేర్చలేదని ఆగ్రహించారు. మోదీ హమీలపై వచ్చే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రశ్నిస్తానని అన్నారు. తాము తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు హమీలు అమల్లోకి తెచ్చామని అన్నారు. మిగిలిన హామీలు కూడా అతి త్వరలోనే అమల్లోకి తెస్తామని చెప్పారు.

సమస్యలు ఎదురైనప్పుడు మోదీ ఏదో ఒక ఇష్యూతో డైవర్ట్‌ చేస్తుంటారని.. సమస్యల నుంచి దృష్టి మళ్లించడంలో మోదీ దిట్ట అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.  ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొల్పి.. ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారని అన్నారు. బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్‌ నేతలు ఎవరూ భయపడబోరని.. అన్నారు. కేసీఆర్‌ ఎప్పుడూ బీజేపీని నిలదీయలేదని.. కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ విమర్శలు చేసేవారని ఖర్గే గుర్తు చేశారు.

ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం.. ఒకసారి పాకిస్తాన్‌ ను మోదీ బూచీ చూపిస్తారని... మరోసారి దేవుడ్ని వాడుకుంటారని అన్నారు. మోదీ నేతృత్వంలో ధరలు పెరిగిపోయాయని అన్నారు. సామాన్యుల ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్‌ న్యాయ యాత్ర చేస్తున్నారని. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్యకర్తలు అదే జోష్‌తో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మల్లిఖార్జున ఖర్గే పిలుపు ఇచ్చారు.


Mallikarjun Kharge: ప్రభుత్వాల్ని కూల్చే కుటిల రాజకీయాలు మోదీ-షాలవి: మల్లిఖార్జున ఖర్గే

‘‘రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. బూత్  ఏజెంట్ల బాధ్యత చాలా ఉంది. అత్యంత కీలకమైన పని ఉంది. మీరు చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చాము.. అప్పుడే రెండు గ్యారంటీలు అమలు చేశాము. మనం ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని అమలు చేస్తాం.. మోదీ గతంలో మోడీ గ్యారంటీ అని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. రెండు కోట్ల ఉద్యోగాల గ్యారంటీ ఏమైంది. నల్లధనం వెనక్కు తెప్పిస్తాం అన్నాడు ఏం అయింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మోడీ అన్ని హామీలపై ప్రశ్నిస్తాం. దేశంలో తువాటకు పనులు లేవు.. రైతులకు పనులు లేవు. పని లేకపోతే ప్రజలకు ఉపాధి ఎలా. వారి కడుపు ఎలా నిండుతది. దేశంలో యువత ఉన్నారు వారికి ఉపాధి లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు’’ అని ఖర్గే మాట్లాడారు.

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Lok Sabha: బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
K Annamalai New Political Party: అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Crisis in TMC - Mamatha's resilience test | ఓటమిని మించిన ప్రమాదంలో మమత పార్టీ
Crisis in TMC - Mamatha's resilience test | ఓటమిని మించిన ప్రమాదంలో మమత పార్టీ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget