అన్వేషించండి

Mallikarjun Kharge: ప్రభుత్వాల్ని కూల్చే కుటిల రాజకీయాలు మోదీ-షాలవి: మల్లిఖార్జున ఖర్గే

Hyderabad News: హైదరాబాద్ వచ్చిన మల్లిఖార్జున ఖర్గే బూత్ లెవెల్ కమిటీలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీపైన కూడా విమర్శలు చేశారు.

Mallikarjun Kharge in Hyderabad: బీజేపీ బెదిరింపులకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ భయపడబోరని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. మోదీ - అమిత్ షాలు ప్రభుత్వాల్ని కూల్చి వేసే కుటిల ప్రయత్నాలు చేయబోతున్నారని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్ సభ ఎన్నికల కోసం కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయాలని ఖర్గే పిలుపు ఇచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ అందరూ కష్టపడి పని చేయాలని పిలుపు ఇచ్చారు. నిత్యం ప్రజల్లో ఉంటేనే గెలుపు సాధ్యం అవుతుందని అన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన మల్లిఖార్జున ఖర్గే.. ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కమిటీలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీపైన కూడా విమర్శలు చేశారు. ప్రతి వార్తా పత్రికలో 'మోదీ గ్యారెంటీ' ప్రకటనలు వేశారని.. గతంలో బీజేపీ, మోదీ ఇచ్చిన హామీలు.. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం. నల్లధనాన్ని వెనక్కి తెస్తాం. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం అన్నారని ఖర్గే అన్నారు. కానీ, ఇంత వరకూ ఏ ఒక్కటి కూడా ప్రధాని నెరవేర్చలేదని ఆగ్రహించారు. మోదీ హమీలపై వచ్చే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రశ్నిస్తానని అన్నారు. తాము తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు హమీలు అమల్లోకి తెచ్చామని అన్నారు. మిగిలిన హామీలు కూడా అతి త్వరలోనే అమల్లోకి తెస్తామని చెప్పారు.

సమస్యలు ఎదురైనప్పుడు మోదీ ఏదో ఒక ఇష్యూతో డైవర్ట్‌ చేస్తుంటారని.. సమస్యల నుంచి దృష్టి మళ్లించడంలో మోదీ దిట్ట అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.  ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొల్పి.. ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారని అన్నారు. బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్‌ నేతలు ఎవరూ భయపడబోరని.. అన్నారు. కేసీఆర్‌ ఎప్పుడూ బీజేపీని నిలదీయలేదని.. కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ విమర్శలు చేసేవారని ఖర్గే గుర్తు చేశారు.

ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం.. ఒకసారి పాకిస్తాన్‌ ను మోదీ బూచీ చూపిస్తారని... మరోసారి దేవుడ్ని వాడుకుంటారని అన్నారు. మోదీ నేతృత్వంలో ధరలు పెరిగిపోయాయని అన్నారు. సామాన్యుల ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్‌ న్యాయ యాత్ర చేస్తున్నారని. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్యకర్తలు అదే జోష్‌తో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మల్లిఖార్జున ఖర్గే పిలుపు ఇచ్చారు.


Mallikarjun Kharge: ప్రభుత్వాల్ని కూల్చే కుటిల రాజకీయాలు మోదీ-షాలవి: మల్లిఖార్జున ఖర్గే

‘‘రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. బూత్  ఏజెంట్ల బాధ్యత చాలా ఉంది. అత్యంత కీలకమైన పని ఉంది. మీరు చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చాము.. అప్పుడే రెండు గ్యారంటీలు అమలు చేశాము. మనం ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని అమలు చేస్తాం.. మోదీ గతంలో మోడీ గ్యారంటీ అని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. రెండు కోట్ల ఉద్యోగాల గ్యారంటీ ఏమైంది. నల్లధనం వెనక్కు తెప్పిస్తాం అన్నాడు ఏం అయింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మోడీ అన్ని హామీలపై ప్రశ్నిస్తాం. దేశంలో తువాటకు పనులు లేవు.. రైతులకు పనులు లేవు. పని లేకపోతే ప్రజలకు ఉపాధి ఎలా. వారి కడుపు ఎలా నిండుతది. దేశంలో యువత ఉన్నారు వారికి ఉపాధి లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు’’ అని ఖర్గే మాట్లాడారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget