అన్వేషించండి

Maharashtra Politics: ఠాక్రే ప్రభుత్వం కుప్పకూలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది, ఎన్నికల్లో గెలిచేది మేమే - ఫడణవీస్

Maharashtra Politics: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా తామే గెలుస్తామని ఫడణవీస్ ధీమా వ్యక్తం చేశారు.

Maharashtra Politics:

తప్పకుండా గెలుస్తాం: ఫడణవీస్ 

మహారాష్ట్ర రాజకీయాల్లో మూడు, నాలుగు నెలల్లో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాం. ఎవరూ ఊహించని రీతిలో ఠాక్రే ప్రభుత్వం కుప్ప కూలిపోవటం, తరవాత శిందే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావటం చకచకా జరిగిపోయాయి. డిప్యుటీ సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ బాధ్యతలు చేపట్టారు. నిజానికి..ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారని భావించినా..చివరకు లెక్కలన్నీ మారిపోయాయి. శిందే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై ఇటీవల దేవేంద్ర ఫడణవీస్‌ కొన్ని వ్యాఖ్యలు చేసారు. సీఎం శిందే నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. కచ్చితంగా తమ పార్టీ గెలుస్తుందన్న నమ్మకముందని స్పష్టం చేశారు. దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చారన్న విమర్శలపైనా ఆయన స్పందించారు. "వెన్నుపోటు పొడిచినందుకు పగ తీర్చుకున్నారు" అని మహా వికాస్ అఘాడీ కూటమి పడిపోవటానికి కారణమైన నేతలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల గురించీ ప్రస్తావించారు. శిందే నేతృత్వంలో మున్సిపల్ ఎన్నికలతో పాటు, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలనూ ఎదుర్కొంటామని వెల్లడించారు. ఇదే సమయంలో "ఠాక్రే ప్రభుత్వం పడిపోవటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు" అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దేవేంద్ర ఫడణవీస్. అధిష్ఠానంతో తనతో సంప్రదింపులు జరిపిన తరవాతే...ఏక్‌నాథ్ శిందేని ముఖ్యమంత్రిగా ప్రకటించారని స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవిని తాను కోరుకోలేదని, కానీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను డిప్యుటీ సీఎం పదవిని అంగీకరించానని తెలిపారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

మున్సిపల్ ఎన్నికలు..

శిందే, ఠాక్రే సేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల గుర్తు విషయంలో ఈ రెండు పార్టీలకూ ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నాళ్లు తమ పార్టీకి ఉన్న గుర్తుని కూడా వినియోగించుకోకుండా చేసినందుకు శిందే వర్గంపై ఠాక్రే వర్గం ఆగ్రహంగా ఉంది. ఈ రాజకీయ వేడి పెరుగుతుండగానే...బృహణ్ ముంబయి కార్పొరేషన్ (BMC)ఎన్నికలు సమీపించాయి. ఈ ఎన్నికలు కూడా మహారాష్ట్ర రాజకీయాలను మరో మెట్టు ఎక్కించాయి. భాజపా, శివసేన మధ్య వైరాన్ని, దూరాన్ని ఇంకాస్త పెంచనున్నాయి. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు "మరాఠీ ముస్లిం"ల చుట్టూ తిరుగుతున్నాయి. ఉద్దవ్ ఠాక్రే వర్గం "మరాఠీ ముస్లింల" మద్దతు తమకే ఉంటుందని స్పష్టం చేస్తోంది. అటు భాజపా దీన్ని కొట్టి పారేస్తోంది. అక్టోబర్ 22న శివసేన మ్యాగజైన్ "Saamana"లో ఫ్రంట్ పేజ్‌లోనే మరాఠీ ముస్లింలు తమకు మద్దతునిస్తున్నారని ప్రచురించింది. వెంటనే భాజపా స్పందించింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడింది. ముంబయి భాజపా అధ్యక్షుడు ఆశిష్ షెలార్ తీవ్రంగా విమర్శలు చేశారు. "ముంబయిలోని మరాఠీలు, ముస్లింలు మద్దతు కోసం ఉద్ధవ్ వర్గం తాపత్రయపడుతోంది. కానీ చాలా తెలివిగా ఈ రెండు పదాలని కలిపి మరాఠీ ముస్లింల మద్దతు తమకే ఉందని చెప్పుకుంటోంది" అని అన్నారు.  నిజానికి...మహారాష్ట్రలో రాజకీయాలు మునుపటిలా లేవు. చాలా మార్పులు వచ్చేశాయి. ఫలితంగా...ఆయా పార్టీల ఓటు బ్యాంకులోనూ మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఏ వర్గం ఎటువైపు నిలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. 

Also Read: Twitter Blue Tick: ఇండియాలోనూ ట్విటర్ బ్లూ ఫీచర్, మరో నెల రోజుల్లో వచ్చేస్తుందన్న మస్క్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Old Age Homes: హైదరాబాద్‌లో కట్టెల పొయ్యితో ఈ వృద్దులు బతికేదెట్టా..! వృద్దాశ్రమాల్లో LPG కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం
హైదరాబాద్‌లో కట్టెల పొయ్యితో ఈ వృద్దులు బతికేదెట్టా..! వృద్దాశ్రమాల్లో LPG కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం
Hyderabad- Vijayawada Toll Charges: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
CSK Without Dhoni, Raina For The 1st Time: సీఎస్‌కే చరిత్రలో తొలిసారి: ధోనీ, రైనా లేని 'యెల్లో ఆర్మీ'.. యువతరంతో బరిలోకి దిగిన రుతురాజ్ సేన!
సీఎస్‌కే చరిత్రలో తొలిసారి: ధోనీ, రైనా లేని 'యెల్లో ఆర్మీ'.. యువతరంతో బరిలోకి దిగిన రుతురాజ్ సేన!
IPL 2026 RR VS CSK Result Update: వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad- Vijayawada Toll Charges: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
IPL 2026 RR VS CSK Result Update: వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
Mahieka Sharma News: హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
CNG Car Safety Tips: ఒకవేళ CNG కారు పికప్ అకస్మాత్తుగా తగ్గిపోతే ఇంత డేంజరా? ఈ భాగాన్ని చెక్ చేయకుంటే కారు పనికిరాకుండా పోతుంది!
ఒకవేళ CNG కారు పికప్ అకస్మాత్తుగా తగ్గిపోతే ఇంత డేంజరా? ఈ భాగాన్ని చెక్ చేయకుంటే కారు పనికిరాకుండా పోతుంది!
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
Embed widget