అన్వేషించండి

Maharashtra Politics: ప్రధాని మోదీ ఫోన్‌ కాల్, మాట కాదనలేకపోయిన ఫడణవీస్

ప్రధాని మోదీ కాల్‌ చేశాకే దేవేంద్ర ఫడణవీస్‌ డిప్యుటీ సీఎం పదవికి అంగీకరించారని భాజపా వర్గాలు చెబుతున్నాయి.

డిప్యుటీ సీఎంగా ఫడణవీస్..ఎవరూ ఊహించని ట్విస్ట్ 

మహారాష్ట్రలో ఠాక్రే సర్కార్ కుప్పకూలిపోయాక ఎవరు సీఎం అవుతారు అన్నది చివరి వరకూ సస్పెన్స్‌గానే ఉంది. దేవేంద్ర ఫడణవీస్‌కే మళ్లీ ఈ పదవి దక్కుతుందని భావించినా చివర్లో భాజపా అదిష్ఠానం ట్విస్ట్ ఇచ్చింది. రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండేకే ఆ సీటు కట్టబెట్టింది. ఫడణవీస్‌ను డిప్యుటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఇదే ఎవరూ ఊహించలేదు. భాజపా సీనియర్ నేతను కాదని, షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం ఏంటని రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దీని వెనక ఓ కథ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ మలుపులన్నింటినీ ఫడణవీస్ పరిశీలించారని, నిజానికి ఆయన ఇంటిలిజెన్స్ వల్లే ఇదంతా సాధ్యమైందని భాజపా వర్గాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు ఫడణవీస్‌ను ఎందుకు సీఎం చేయలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికీ సమాధానమిస్తున్నారు పలువురు నేతలు. 

ప్రధాని మోదీ కాల్‌ చేసి మాట్లాడారా..? 

ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు రెండు సార్లు కాల్ చేసిన ఫడణవీస్‌తో మాట్లాడారని, అధిష్ఠాన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆయన డిప్యుటీ సీఎం పదవిని అంగీకరించారని భాజపా శ్రేణులు అంటున్నాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోం మంత్రి అమిత్‌షా కూడా ఈ విషయమై ఫడణవీస్‌తో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇదంతా జరగకముందు తాను ప్రభుత్వంలో ఏ విధమైన పదవిలోనూ ఉండనని, తనదంటూ ఎలాంటి భాగస్వామ్యం ఉండదని ప్రకటించారు ఫడణవీస్. ఈ ప్రకటన తరవాతే అధిష్ఠానం ఫడణవీస్‌తో మాట్లాడినట్టు సమాచారం. ఫడణవీస్ లాంటి నేత ప్రభుత్వంలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తే రాష్ట్రానికి, పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని  అధిష్ఠానంభావించిందట. అందుకే వెంటనే ఆయనతో మంతనాలు జరిపింది. "ప్రభుత్వంలో ఉండను" అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించిందనీ తెలుస్తోంది. పెద్దల మాట కాదనలేక ఫడణవీస్‌ డిప్యుటీ సీఎం కుర్చీలో కూర్చునేందుకు ఒప్పుకున్నారట. 

అయితే అంతకు ముందు ఎన్‌సీపీ నేత శరద్ పవార్ మాత్రం ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రి పదవికే పరిమితం చేయటాన్ని దేవేంద్ర ఫడణవీస్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. "నెంబర్ 2 పొజిషన్‌లో ఉండటం ఫడణవీస్‌కు ఇష్టం లేదు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతోంది ఎంత అసంతృప్తితో ఉన్నారో" అంటూ కామెంట్ చేశారు పవార్. ఫడణవీస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పని చేశారని, అధిష్ఠానం ఎలా చేయమంటే అలా చేయటం ఆయన పని అని వ్యాఖ్యానించారు. "ఇది నిజంగా సర్‌ప్రైజ్. నాకు తెలిసి రెబల్ ఎమ్మెల్యేలు కూడా తమ లీడర్ సీఎం అవుతారని ఊహించి ఉండరు. మరో సర్‌ప్రైజ్ ఏంటంటే..ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన ఫడణవీస్‌కు డిప్యుటీ సీఎం ఇవ్వటం" అని అన్నారు శరద్ పవార్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Adultery Case: భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Adultery Case: భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
Tirumala News: తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
Telugu TV Movies Today: చిరు ‘పసివాడి ప్రాణం’, బాలయ్య ‘పైసా వసూల్’ to మహేష్ ‘టక్కరి దొంగ’, విజయ్ ‘లియో’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరు ‘పసివాడి ప్రాణం’, బాలయ్య ‘పైసా వసూల్’ to మహేష్ ‘టక్కరి దొంగ’, విజయ్ ‘లియో’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget