అన్వేషించండి

Maha kumbh Mela 2025 : ప్రపంచ హిందువుల మహా సమ్మేళనం మహాకుంభమేళా - 45 కోట్ల మంది వచ్చే మహా ఉత్సవం - ఇవే ఫుల్ డీటైల్స్

Maha kumbh Mela 2025 : ప్రపంచ హిందువుల మహా సమ్మేళనం మహాకుంభమేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయ. 45 కోట్ల మంది ఈ సారి మేళాకు హాజరవుతారు.

Maha Kumbh Mela: ప్రపంచంలో అతి పెద్ద హిందూ సమ్మేళనంమహా కుంభమేళా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం,కేంద్రం వేల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఈ మేళాను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.  ఈ సారి మహా కుంభమేళాలో 40 కోట్ల నుండి 45 కోట్ల మంది భక్తులు గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రయాగరాజ్ కి వస్తారని అంచనా వేస్తున్నారు.దానికి  తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. 

ఇప్పటికే యూపీ ప్రభుత్వం అధికారికంగా సీఎంలను సహా అన్ని స్థాయిలో అధికారవర్గానికి ఆహ్వానం  పలుకుతోంది.  వచ్చే ఏడాది జనవరి 13న మొదలై.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ కుంభమేళకు లక్షలాది అఘోరీలు అక్కడికి చేరుకుంటారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తుంటారు. మరోవైపు ఈ మహాకుంభమేళ కార్యక్రమం కోసం యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.   

4,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న 25 సెక్టార్లలో మహా కుంభమేళా  ఏర్పాట్లు చేశారు.  ఏర్పాట్లలో 12 కి.మీ. పొడవైన ఘాట్‌లు, 1,850 హెక్టార్లలో పార్కింగ్ సౌకర్యాలు, 450 కి.మీ. చెక్కిన ప్లేట్లు, 30 పాంటూన్ వంతెనలు, 67,000 వీధి దీపాలు, 1,50,000 మరుగుదొడ్లు, 1,50,000 టెంట్లు, 25,000 కంటే ఎక్కువ ప్రజా వసతి గృహాలు నిర్మించారు. అదనంగా పౌష్ పూర్ణిమ, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి, మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి వంటి కీలకమైన స్నాన పండుగల సమయంలో భద్రత, సౌకర్యాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.ట్లు యోగి తెలిపారు. హనుమాన్ మందిర్ కారిడార్, అక్షయవట్ పాతాళపురి, సరస్వతీ కూప్, భరద్వాజ ఆశ్రమం, ద్వాదశ మాధవ్ ఆలయం, శివాలయ పార్క్, దశాశ్వమేధ, నాగ్వాసుకి ఆలయాలు వంటి వివిధ పవిత్ర స్థలాలలో  ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
 
ప్రయాగరాజ్‌లో కుంభమేళా లేదా మహా కుంభమేళా జరిగినప్పుడల్లా పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానం ఆచరించడానికి వస్తారు. అయితే, ఇప్పటివరకు వీరి సంఖ్యను లెక్కించడానికి ఖచ్చితమైన సాంకేతికత లేదు. ఈసారి యోగి సర్కార్ AI కెమెరాలతో పాటు అనేక ఇతర సాంకేతికతలను ఉపయోగిస్తోంది, తద్వారా మహా కుంభమేళాకు వచ్చే ప్రతి భక్తుడిని లెక్కించి, వారిని ట్రాక్ చేయవచ్చు. ఈ విషయమై మండల కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ మాట్లాడుతూ, ఈసారి మహా కుంభమేళా 2025 లో 40 కోట్లకు పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని, ఇది ఇప్పటివరకు అతిపెద్ద రికార్డు అవుతుందని చెప్పారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను లెక్కించడానికి మరియు ట్రాక్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   
 
మహా కుంభమేళాకు వచ్చే భక్తుల హెడ్‌కౌంట్ కోసం AI కెమెరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ కెమెరాలు ప్రతి నిమిషం డేటాను అప్‌డేట్ చేస్తాయి. ఘాట్‌కు వచ్చే భక్తులపై పూర్తి దృష్టి ఉంటుంది. ఈ వ్యవస్థ ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పూర్తిగా చురుగ్గా ఉంటుంది, ఎందుకంటే స్నానం చేసే ప్రధాన సమయం ఇదే. ఇంతకు ముందు మాఘ మేళా సమయంలో కూడా ఈ పద్ధతులను ఉపయోగించారు. దీని ద్వారా హెడ్‌కౌంట్‌ను 95 శాతం వరకు ఖచ్చితంగా అంచనా వేయవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget