అన్వేషించండి

Karnataka News: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం - సీఎం సిద్ధరామయ్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన లోకాయుక్త పోలీసులు

FIR on SidhaRamayya: మైసూరు ప్లాట్ల కేటాయింపు వివాదంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. లోకాయుక్త కోర్టు ఆదేశాలతో పోలీసులు విచారణ చేసి కేసు పెట్టారు.

Lokayukta police register FIR: కర్ణాటకలో లోకాయిక్త పోలీసులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక - FIR నమోదు చేశారు. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన సతీమణి పార్వతితో పాటు మరికొందరు పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

ఏ1, ఏ2 వీరే..

మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - MUDA ప్లాట్ల కేటాయింపు వివాదంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో సిద్ధరామయ్యను A1గా పేర్కొన్న పోలుసులు ఆయన భార్య పార్వతమ్మను A2గా పేర్కొన్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రి బావమరిది మల్లికార్జున స్వామితో పాటు మరికొందరు పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కొద్ది వారాల క్రితం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఈ స్థలాల కుంభకోణంకి సంబంధించి గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ విచారణకు అనుమతించారు. జులై చివరిలో ఈ అంశంపై హైకోర్టుకు సిద్ధరామయ్య వెళ్లగా గెహ్లోత్ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే లోకాయుక్త కోర్టు జడ్డి సంతోష్ గజానన్ వెంటనే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. లోకాయుక్త కోర్టు ఆదేశాలతో పోలీసులు వివిధ చట్టాలు, సెక్షన్ల కింద సిద్ధరామయ్య దంపతులపై కేసు నమోదు చేశారు.

అసలేంటీ కుంభకోణం.?

కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన ఒక అభివృద్ధి ప్రాజెక్టు కోసం సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మ భూమిని ఇచ్చారు. భూమి కోల్పోయిన ఆమెకు పరిహారంగా మైసూరులోని అత్యంత ఖరీధైన ప్రదేశంలో 14 ప్లాట్లను కేటాయించారు. ఈ స్థలాలన్నీ మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ- ముడావి కాగా అదే కేటాయించింది. ఈ కేటాయింపులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని విపక్షాలు ఆరోపించాయి. ఈ స్కామ్‌లో ముఖ్యమంత్రి దంపతులతో పాటు ఆయన బావమరిది మల్లికార్జున స్వామి దేవరాజ్‌ కూడా భాగంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులో దళితుల భూములు కూడా ఉన్నాయంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్టీఐ కార్యకర్తలు స్నేహమయి కృష్ణ, అబ్రహం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంపై జులై చివరి వారంలో గవర్నర్ గెహ్లోత్ విచారణకు ఆదేశించగా దాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుబట్టారు. హైకోర్టులో గెహ్లోత్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. కేంద్రం తనపై కుట్ర చేస్తోందని సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈ కుట్రలకు తాను వెరవబోనని చెప్పారు. కోర్టులపై తనకు విశ్వాసం ఉందని అన్నారు.

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం హైకోర్టు సిద్ధరామయ్య పిటిషన్‌ను కొట్టేయడంతో లోకాయుక్త కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసులను ఆదేశించింది. కర్ణాటకలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులపై ఆరోపణలను ఈ కోర్టు విచారిస్తుంది. లోకాయుక్త కోర్టు ఆదేశాలతో పోలీసులు మైసూరు లోకాయుక్త కోర్టులో కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదుకు ముందు లోకాయుక్త పోలీసులు న్యాయసలహా కూడా తీసుకున్నారు. కోర్టు తీర్పు సహా మైసూరు లోకాయుక్త స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో సిద్ద రామయ్య రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget