అన్వేషించండి

Lok Sabha Elections 2024: మార్చి 13 తరవాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్! ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఈసీ

Lok Sabha Elections 2024: మార్చి 13వ తేదీ తరవాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Lok Sabha Elections Dates 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని మార్చి 13 తరవాత విడుదల చేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియంతా పూర్తైన వెంటనే షెడ్యూల్ విడుదల చేయనుంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం బృందం తమిళనాడులో పర్యటిస్తోంది. ఆ తరవాత యూపీ, జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తుంది. మార్చి 13లోగా ఈ పర్యటనలు ముగించుకుని ఆ వెంటనే పోలింగ్ తేదీలు విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. కొద్ది రోజులుగా అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వరుస భేటీలు నిర్వహించింది ఈసీ. పలు ప్రాంతాల్లోని సమస్యలు, ఈవీఎమ్‌లు తరలించేందుకు ఎదురయ్యే సవాళ్లు, ఇతరత్రా భద్రతా పరమైన సమస్యలపై చర్చించింది. నిఘా పెంచాలని అధికారులను ఆదేశించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లో త్వరలోనే ఈసీ బృందాలు పర్యటించనున్నాయి. మార్చి 13వ తేదీన జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తాయని తెలుస్తోంది. ఓటర్ల సంఖ్యని 97 కోట్లుగా తేల్చి చెప్పింది ఈసీ. వీళ్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని వెల్లడించింది 2019తో పోల్చి చూస్తే ఓటర్ల సంఖ్య 6% మేర పెరిగింది. కొద్ది రోజుల క్రితమే ఓటర్ల జాబితాని పబ్లిష్ చేసింది. 

ఈ సారి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీ సాయంతో ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే వాటిని తొలగించేందుకు ఈ AI టీమ్‌ సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే ఇందుకోసం ప్రత్యేకంగా ఓ డివిజన్‌ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇలాంటి పోస్ట్‌లను తొలగించినప్పటికీ పదే పదే వాటిని ప్రచారం చేసినా...ఈసీ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆయా పార్టీల సోషల్ మీడియా అకౌంట్‌లను సస్పెండ్‌ చేస్తామని తేల్చి చెబుతున్నారు. వీటితో పాటు ఫ్యాక్ట్ చెకింగ్‌పైనా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. భద్రతాపరమైన సమస్యలు రాకుండా ఇలాంటి వార్తలకి కళ్లెం వేయనుంది. 

ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ ఇటీవలే కీలక విషయాలు వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. ఈ క్రమంలోనే ఒడిశా ఎన్నికల గురించి మాట్లాడారు రాజీవ్ కుమార్. దాదాపు 50% మేర పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. దివ్యాంగులు, మహిళల్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.

"ఒడిశాలోని 50% మేర పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పిస్తాం. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 37809 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తాం. అందులో  22,685 బూత్‌లలో వెబ్‌కాస్టింగ్  సౌకర్యం ఉంటుంది. దివ్యాంగులు, మహిళలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 300 పోలింగ్‌ బూత్‌లను దివ్యాంగులే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం"

-సీఈసీ రాజీవ్ కుమార్ 

Also Read: Ideas of India 2024: అయోధ్య రామ మందిరం హిందుత్వాన్ని బలపరిచింది - ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Zoom App : జూమ్‌ యాప్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన;  ప్రమాదంలో వినియోగదారుల డేటా!
జూమ్‌ యాప్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన; ప్రమాదంలో వినియోగదారుల డేటా!
Telangana Bandh: బీసీ సంఘాలకు మద్దతుగా కదలిన రాజకీయ పార్టీలు- ఎవరి అజెండాతో వాళ్లు ఐక్య పోరాటం
బీసీ సంఘాలకు మద్దతుగా కదలిన రాజకీయ పార్టీలు- ఎవరి అజెండాతో వాళ్లు ఐక్య పోరాటం
Garib Rath Express: గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
Kavitha Son Aditya Political Entry: బీసీల కోసం రోడ్లపై ధర్నా చేసిన కవిత కుమారుడు ఆదిత్య- రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టేనా?
బీసీల కోసం రోడ్లపై ధర్నా చేసిన కవిత కుమారుడు ఆదిత్య- రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టేనా?
Advertisement

వీడియోలు

Rohit Sharma Records | India vs Australia | వణికిస్తున్న రోహిత్ శర్మ రికార్డ్స్
What is Test Twenty | టెస్టు ట్వంటీ పేరుతో కొత్త ఫార్మాట్
Mohammed Shami Comments in Selection Committee | టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌పై షమీ కామెంట్స్
India vs Australia ODI 2025 Head to Head Records | భారత్ - ఆస్ట్రేలియా రికార్డ్స్
6 ఏళ్ల వేట సక్సెస్.. పట్టుబడ్డ రోలెక్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Zoom App : జూమ్‌ యాప్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన;  ప్రమాదంలో వినియోగదారుల డేటా!
జూమ్‌ యాప్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన; ప్రమాదంలో వినియోగదారుల డేటా!
Telangana Bandh: బీసీ సంఘాలకు మద్దతుగా కదలిన రాజకీయ పార్టీలు- ఎవరి అజెండాతో వాళ్లు ఐక్య పోరాటం
బీసీ సంఘాలకు మద్దతుగా కదలిన రాజకీయ పార్టీలు- ఎవరి అజెండాతో వాళ్లు ఐక్య పోరాటం
Garib Rath Express: గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
Kavitha Son Aditya Political Entry: బీసీల కోసం రోడ్లపై ధర్నా చేసిన కవిత కుమారుడు ఆదిత్య- రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టేనా?
బీసీల కోసం రోడ్లపై ధర్నా చేసిన కవిత కుమారుడు ఆదిత్య- రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టేనా?
Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ! - ఆ డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ
పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ! - ఆ డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ
Sonakshi Sinha: గుప్త నిధుల కోసం వేట... రక్తం తాగే రాక్షసత్వం - ఈ 'ధన పిశాచి'ని చూడాలంటే ధైర్యం కావాల్సిందే...
గుప్త నిధుల కోసం వేట... రక్తం తాగే రాక్షసత్వం - ఈ 'ధన పిశాచి'ని చూడాలంటే ధైర్యం కావాల్సిందే...
OnePlus 15 5G Vs Samsung Galaxy S25 5G: ఏ ఫ్లాగ్‌షిప్ ఎక్కువ సూపర్ పవర్ ఏదీ? ఫీచర్ల నుంచి ధర వరకు ప్రతిదీ తెలుసుకోండి
OnePlus 15 5G Vs Samsung Galaxy S25 5G: ఏ ఫ్లాగ్‌షిప్ ఎక్కువ సూపర్ పవర్ ఏదీ? ఫీచర్ల నుంచి ధర వరకు ప్రతిదీ తెలుసుకోండి
What is Test Twenty | టెస్టు ట్వంటీ పేరుతో కొత్త ఫార్మాట్
What is Test Twenty | టెస్టు ట్వంటీ పేరుతో కొత్త ఫార్మాట్
Embed widget