By: Ram Manohar | Updated at : 10 Mar 2023 12:37 PM (IST)
ఢిల్లీ, ముంబయి, పాట్నాలలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
Land For Jobs Scam Case:
సోదాలు..
ఈడీ దూకుడు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఢిల్లీ, ముంబయి, పాట్నాలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ విచారణలో భాగంగా ఈ మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు అధికారులు. ఢిల్లీలోనే 15 చోట్ల సోదాలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూతుళ్ల ఇంట్లోనూ రెయిడ్స్ జరిగాయి. వీరితో పాటు ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే అబు దోజన ఇంట్లోనూ సోదాలు చేశారు. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు ఉచ్చు బిగుసుకుంటోంది. రెండ్రోజుల క్రితమే ఢిల్లీలో ఆయనను విచారించారు సీబీఐ అధికారులు. అటు ఈడీ కూడా వరుసగా సోదాలు చేపడుతూనే ఉంది. బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇంట్లోనూ సోదాలు చేస్తున్నట్టు సమాచారం. లాలూ హయాంలో ఈ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు చోట్ల స్థలాలను లంచంగా తీసుకున్నట్టు చెబుతోంది ఈడీ. 2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఈ స్కామ్ జరిగినట్టు ED అధికారులు ఆరోపిస్తున్నారు. ముంబయి, జబల్పూర్, కోల్కత్తా, జైపూర్, హాజిపూర్లలో పలువురికి గ్రూప్ D పోస్ట్లు ఇచ్చారని, అందుకు బదులుగా తమ పేరు మీద స్థలాలు రాయించుకున్నారని చెబుతున్నారు. AK Infosystems Private Limited పేరు మీద కూడా స్థలాలు రాయించారని ED వివరిస్తోంది. ఆ తరవాత ఈ కంపెనీ ఓనర్షిప్ను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల పేరుపై మార్చారన్న ఆరోపణలున్నాయి.
Enforcement Directorate conducts raids at 12 locations including premises of RJD chief Lalu Yadav's CA and Tejashwi Yadav's residence in Delhi, in connection with alleged land for jobs scam.
— ANI (@ANI) March 10, 2023
Bihar | Enforcement Directorate conducts a raid at ex-RJD MLA Syed Abu Dojana's premises at Phulwari Sharif in Patna. pic.twitter.com/acIjns71rh
— ANI (@ANI) March 10, 2023
Bihar | Enforcement Directorate conducts a raid at ex-RJD MLA Syed Abu Dojana's premises at Phulwari Sharif in Patna.
— ANI (@ANI) March 10, 2023
A team of four members from Patna ED is here for investigation in a disproportionate assets case; further probe underway, says an ED official. pic.twitter.com/b8J7brbdvk
2004లో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ నమోదు చేసిన కేసులో అక్రమంగా లబ్ది పొందారని తేజస్వి యాదవ్.. రబ్రీదేవీలను కూడా సీబీఐ నిందితులుగా చేర్చింది. అయితే తాను అప్పట్లో స్కూలుకు వెళ్తూంటానని.. ఆ స్కాంతో తనకేం సంబంధం అని తేజస్వి యాదవ్ చెబుతూ ఉంటారు. అయితే ఆ కేసు నమోదు చేసిన సీబీఐ .. దర్యాప్తు కూడా జరిపించి. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వియాదవ్లతో పాటు మరో పదకొండు మంది నిందితులుగా ఉన్నారు. వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. మొదట ఓ ఉద్యోగి... తనపై సీబీఐ అక్రమ కేసు పెట్టిందని.. దర్యాప్తు కోసం ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకోలేదని పిటిషన్ వేశారు. ఆ తర్వాత మరో ఇద్దరు నిందితులు పిటిషన్లు వేశారు.
Also Read: Xi Jinping: రికార్డు సృష్టించిన జిన్పింగ్, ముచ్చటగా మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు
SEBI: మ్యూచువల్ ఫండ్స్ నామినేషన్ గడువు పొడిగింపు, మరో 6 నెలలు ఊరట
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం
లోక్సభ స్పీకర్పై అవిశ్వాసం ప్రవేశపెట్టే యోచనలో కాంగ్రెస్-విపక్షాలతో మంతనాలు
Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్
Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత
SSMB 28 Title : మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేది ఆ రోజే