అన్వేషించండి

Medigadda Barrage: డ్యాం డిజైన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, నిర్మాణం మేం చేశాం: మేడిగడ్డ బ్యారేజీపై ఎల్ అండ్ టీ ఇంజినీర్

కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై.. రాకపోకలు సాగించే వంతెన కుంగడం సర్వత్రా ఆందోళన కలిగించింది.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి ఒక్కసారిగా కొంత మేర కుంగిపోయింది. బి- బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న బ్రిడ్జి ఒక అడుగు మేర కుంగిన విషయం తెలిసిందే. అయితే ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేష్ కుమార్, డ్యామ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు డ్యామ్ కు సంబంధించి కొన్ని విషయాలను మీడియాకు వెల్లడించారు.

28.25 లక్షల క్యూసెక్కుల ఫ్లో తట్టుకునేలా డ్యాం నిర్మాణం చేపట్టామని ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 28 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదిలినా ఎలాంటి ఇబ్బందీ కలగలేదని చెప్పారు. భారీ శబ్దం వచ్చిన తర్వాత బ్లాక్ 7 లో సింకింగ్ జరిగిందని చెప్పారు.

సంఘటన జరిగిన స్థలాన్ని డిజైన్ టీమ్, ఇంజినీర్ టీమ్ పరిశీలించారని చెప్పారు. డ్యాంలో నీటి లెవెల్స్ తగ్గాక ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. డ్యాంకి ఏం జరిగినా  ఎల్ అండ్ టీ బాధ్యత వహిస్తుందని అన్నారు. స్థానిక ప్రజలకు, వాతావరణానికి ఎలాంటి హానీ కలగనివ్వమని స్పష్టం చేశారు. డ్యాం డిజైన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఇంజనీర్ సురేష్ చెప్పారు. కానీ నిర్మాణం మాత్రం తామే చేపట్టామని వెల్లడించారు.

" జులై 2022లో వరదలు వచ్చినప్పుడు కూడా బ్యారేజ్ సురక్షితంగా తట్టుకుని పని చేసింది. నిన్న సాయంత్రం బ్యారేజీ బ్లాక్-7లోని ఒక చోట పెద్ద శబ్ధం రావడంతో వంతెన భాగం కుంగిపోవడం గమనించారు. రాష్ట్ర అధికారులతో కలిసి మా సాంకేతిక నిపుణుల బృందం కారణాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ సైట్‌కు వెళ్లారు. కార‌ణాల‌ను అంచనా వేసిన తర్వాత నష్టాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యను ఎల్ అండ్ టీ తీసుకుంటుంది. వీలైనంత త్వరగా పరిష్కారానికి మార్గం చూపుతుంది" అని ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేష్ కుమార్ తెలిపారు.

అనంతరం డ్యామ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... డ్యాం వద్దకు ఎల్ అండ్ టీ కంపెనీ నిపుణులు వచ్చారని వెల్లడించారు. భారీ శబ్దంతో డ్యాం కృంగిన ప్రాంతాన్ని సంస్థ ప్రతినిధులు పరిశీలించాలని చెప్పారు. డ్యాం ఎందువల్ల కృంగిందో ఇంకా పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక నిపుణుల బృందం కూడా వచ్చి పరిశీలిస్తారని తెలిపారు. డ్యాం ఎల్ అండ్ టీ అధీనంలో ఉందని అన్నారు. డ్యాం పూర్తి బాధ్యత వాళ్లే చూసుకుంటారని చెప్పారు. 20 నంబర్ పిల్లర్ వద్ద 1.50 ఫీట్లు కృంగిందని అన్నారు. డ్యాంసింగ్ పెద్ద సమస్య కాదని వెల్లడించారు.

నిన్న రాత్రి ఎలా ఉందో ప్రస్తుతం ఇప్పుడు అలానే ఉందని చెప్పారు. ప్రజల సేఫ్టీ కోసమే ఎవరినీ అనుమతించలేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఒత్తిడి తమపై లేదని అన్నారు.  అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇంజినీర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలోనే ఉన్నందున.. అవసరమైన మరమ్మతులు ఉంటే చేపడతామని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించే దిశగా ఇంజనీర్లు చర్యలు చేపడుతున్నారని డ్యామ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్MS Dhoni Heroics vs LSG | IPL 2025 లో లక్నోపై విరుచుకుపడిన మహేంద్ర సింగ్ ధోనీLSG vs CSK Match Highlights IPL 2025 | లక్నో పై 5వికెట్ల తేడాతో చెన్నై సంచలన విజయం | ABP DesamNani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
Telangana Politics: కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు, ఎమ్మెల్యేలను సైతం కొనేందుకు రెడీ!: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం
Telangana Politics: కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు, ఎమ్మెల్యేలను సైతం కొనేందుకు రెడీ!: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం
Chittoor Crime News: లవ్ మ్యారేజ్ చేసుకుందని కూతుర్ని చంపేశారు! చిత్తూరులో పరువుహత్య కలకలం
లవ్ మ్యారేజ్ చేసుకుందని కూతుర్ని చంపేశారు! చిత్తూరులో పరువుహత్య కలకలం
Embed widget