అన్వేషించండి

Medigadda Barrage: డ్యాం డిజైన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, నిర్మాణం మేం చేశాం: మేడిగడ్డ బ్యారేజీపై ఎల్ అండ్ టీ ఇంజినీర్

కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై.. రాకపోకలు సాగించే వంతెన కుంగడం సర్వత్రా ఆందోళన కలిగించింది.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి ఒక్కసారిగా కొంత మేర కుంగిపోయింది. బి- బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న బ్రిడ్జి ఒక అడుగు మేర కుంగిన విషయం తెలిసిందే. అయితే ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేష్ కుమార్, డ్యామ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు డ్యామ్ కు సంబంధించి కొన్ని విషయాలను మీడియాకు వెల్లడించారు.

28.25 లక్షల క్యూసెక్కుల ఫ్లో తట్టుకునేలా డ్యాం నిర్మాణం చేపట్టామని ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 28 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదిలినా ఎలాంటి ఇబ్బందీ కలగలేదని చెప్పారు. భారీ శబ్దం వచ్చిన తర్వాత బ్లాక్ 7 లో సింకింగ్ జరిగిందని చెప్పారు.

సంఘటన జరిగిన స్థలాన్ని డిజైన్ టీమ్, ఇంజినీర్ టీమ్ పరిశీలించారని చెప్పారు. డ్యాంలో నీటి లెవెల్స్ తగ్గాక ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. డ్యాంకి ఏం జరిగినా  ఎల్ అండ్ టీ బాధ్యత వహిస్తుందని అన్నారు. స్థానిక ప్రజలకు, వాతావరణానికి ఎలాంటి హానీ కలగనివ్వమని స్పష్టం చేశారు. డ్యాం డిజైన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఇంజనీర్ సురేష్ చెప్పారు. కానీ నిర్మాణం మాత్రం తామే చేపట్టామని వెల్లడించారు.

" జులై 2022లో వరదలు వచ్చినప్పుడు కూడా బ్యారేజ్ సురక్షితంగా తట్టుకుని పని చేసింది. నిన్న సాయంత్రం బ్యారేజీ బ్లాక్-7లోని ఒక చోట పెద్ద శబ్ధం రావడంతో వంతెన భాగం కుంగిపోవడం గమనించారు. రాష్ట్ర అధికారులతో కలిసి మా సాంకేతిక నిపుణుల బృందం కారణాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ సైట్‌కు వెళ్లారు. కార‌ణాల‌ను అంచనా వేసిన తర్వాత నష్టాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యను ఎల్ అండ్ టీ తీసుకుంటుంది. వీలైనంత త్వరగా పరిష్కారానికి మార్గం చూపుతుంది" అని ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేష్ కుమార్ తెలిపారు.

అనంతరం డ్యామ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... డ్యాం వద్దకు ఎల్ అండ్ టీ కంపెనీ నిపుణులు వచ్చారని వెల్లడించారు. భారీ శబ్దంతో డ్యాం కృంగిన ప్రాంతాన్ని సంస్థ ప్రతినిధులు పరిశీలించాలని చెప్పారు. డ్యాం ఎందువల్ల కృంగిందో ఇంకా పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక నిపుణుల బృందం కూడా వచ్చి పరిశీలిస్తారని తెలిపారు. డ్యాం ఎల్ అండ్ టీ అధీనంలో ఉందని అన్నారు. డ్యాం పూర్తి బాధ్యత వాళ్లే చూసుకుంటారని చెప్పారు. 20 నంబర్ పిల్లర్ వద్ద 1.50 ఫీట్లు కృంగిందని అన్నారు. డ్యాంసింగ్ పెద్ద సమస్య కాదని వెల్లడించారు.

నిన్న రాత్రి ఎలా ఉందో ప్రస్తుతం ఇప్పుడు అలానే ఉందని చెప్పారు. ప్రజల సేఫ్టీ కోసమే ఎవరినీ అనుమతించలేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఒత్తిడి తమపై లేదని అన్నారు.  అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇంజినీర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలోనే ఉన్నందున.. అవసరమైన మరమ్మతులు ఉంటే చేపడతామని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించే దిశగా ఇంజనీర్లు చర్యలు చేపడుతున్నారని డ్యామ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Iran US War Updates: ట్రంప్ ప్రకటన తర్వాత వెనక్కి తగ్గని ఇరాన్.. కన్నుకు కన్ను కాదు, తలకు తల తీస్తామని వార్నింగ్
ట్రంప్ ప్రకటన తర్వాత వెనక్కి తగ్గని ఇరాన్.. కన్నుకు కన్ను కాదు, తలకు తల తీస్తామని వార్నింగ్
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Embed widget