అన్వేషించండి

KTR Post: మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుంటే గెలిచేవాళ్లం - కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

KTR News: మొత్తమ్మీద తెలంగాణ ప్రజా తీర్పుని బీఆర్ఎస్ తనదైన శైలిలో విశదీకరిస్తోంది. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ హ్యాట్రిక్ మిస్సైందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు.

KTR Comments: తెలంగాణ ప్రజల తీర్పుని బీఆర్ఎస్ ఏ కోణంలో అర్థం చేసుకుంటోంది. ప్రజా తీర్పుని ఆ పార్టీ గౌరవిస్తోందా, లేక ఇంకా ఆ తీర్పు తప్పు అనే అనుకుంటుందా..? నాయకుల మనసులో మాట ఎలా ఉన్నా.. బయటకు వేస్తున్న ట్వీట్లు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. తాజాగా కేటీఆర్ వేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. 

 

32 మెడికల్ కాలేజీలు వర్సెస్ 32 యూట్యూబ్ ఛానెళ్లు..
తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికంటే 32 యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదని ఎవరూ ఓ కామెంట్ చేశారు. ఆ విశ్లేషణను కేటీఆర్ తన ట్విట్టర్లో పెట్టారు. ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రకరకాల విశ్లేషణలు వింటున్నాయనని, అందులో ఇది కూడా ఒకటి అని ఆయన ఈ ట్వీట్ వేశారు. కొంతవరకు తాను కూడా ఈ వాదనను అంగీకరిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. 

కేటీఆర్ ట్వీట్ కి పాజిటివ్ గా రియాక్షన్లు వచ్చాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ ఈ దిశగా ఆలోచించాలని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో మిగతా పార్టీలకు సపోర్ట్ చేసే ఛానెళ్లు చాలానే ఉన్నాయని, అయితే అవేవీ ఆ పార్టీలకు సంబంధం లేనట్టే ఉంటాయని అంటున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ కి ప్రచారం చేసే యూట్యూబ్ ఛానెళ్లు లేవని, అందుకే ఇకపై వాటిని కూడా పెట్టుకోవాలని సలహాలిస్తున్నారు. 

యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుంటే విజయం వరిస్తుందా..?
కేటీఆర్ నేరుగా ట్వీట్ చేయకపోయినా.. తన దగ్గరకు వచ్చిన విశ్లేషణల్లో ఇది కూడా ఒకటి అనిమాత్రమే ట్వీట్ వేశారు. అయితే కేటీఆర్ ఆలోచించినట్టుగా.. మీడియా మరీ అంత వన్ సైడ్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిందా అంటే అనుమానమే. వాస్తవానికి మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఇరు పార్టీలు ఎవరెవరు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడేసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికార పార్టీ కాబట్టి కాస్త ఎక్కువగానే ఆ పార్టీకి మీడియా సపోర్ట్ ఉందనే వాదన కూడా వినపడింది. అయితే ఎన్నికల వేళ.. ప్రజల్ని, సామాన్య ఓటర్లను మీడియా, సోషల్ మీడియా ఎంతవరకు ప్రభావితం చేయగలవు అనేదే అసలు ప్రశ్న. పోనీ కేటీఆర్ చెబుతున్నట్టుగా 32 యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి విపరీతంగా ప్రచారం చేస్తే ఫలితం ఎలా ఉండేది..? యూట్యూ ఛానెళ్లు చూసేవారు, సోషల్ మీడియాని నమ్మే అర్బన్ ఓటర్లు అసలు ఎన్నికలకే మొహం చాటేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ఓటింగ్ దారుణంగా పడిపోయింది. అంటే యూట్యూబ్ ఛానెళ్లలో ప్రచారం చేసినా కూడా వాటి వల్ల ప్రభావితం అయ్యే అర్బన్ ఓటరు పోలింగ్ బూత్ లకు రాలేదు కాబట్టి ఫలితం ఉండదు. మరి ఇక్కడ కేటీఆర్ లాజిక్ ఎలా కరెక్ట్ అనే వాదన కూడా వినపడుతోంది. 

మొత్తమ్మీద తెలంగాణ ప్రజా తీర్పుని బీఆర్ఎస్ తనదైన శైలిలో విశదీకరిస్తోంది. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ హ్యాట్రిక్ మిస్సైందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ఆ ప్రచారాన్ని అడ్డుకుని ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదనేది వారి వాదన. 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget