అన్వేషించండి

Krishna District News: చనిపోయి మూడ్రోజుల తర్వాత లేస్తానంటూ పాస్టర్ ప్రచారం, పోలీసులు ఎంట్రీ!

Krishna District News: కృష్ణా జిల్లాలలోని ఓ పాస్టర్ చనిపోయి మూడ్రోజుల తర్వాత లేస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. అంతేకాదు ప్లెక్సీని కూడా రూపొందించి ప్రజల్లోకి పంపారు. 

Krishna District News: కల్యాణి నూనెతో పూనకాలు రప్పిస్తాం, ఒకే ఒక్క స్పర్షతో మీ ఆరోగ్య సమస్యలు, రోగాలు తీరుస్తామని చెప్పే పాస్టర్ లను మనం చాలానే చూశాం. ఇందుకు సంబంధించిన వందల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. దేవుని వాగ్ధానం పొందుకుని యోషయా 32:8 యేసు ప్రభువు పిలుపుతో మరణించి తిరిగి లేవబోతున్న దేవుడి సేవకుడు అంటూ చిత్రీకరించిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది.  యేసు ప్రభువు దేవుడు కాదు అనేవారి కోసం, పరలోకం, నరకం, ఆత్మ లేవు అనే వారి కోసం, తెలిసి కూడా వాటిని భయపడి జీవించలేని వారి కోసం ఇలా చేస్తున్నట్టు ఓ పాస్టర్ ప్రచారం చేస్తున్నారు.  

కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లపల్లికి చెందిన పాస్టర్ పులపాక నాగభూషణం... చనిపోయి మూడ్రోజుల తర్వాత తిరిగిన లేచొస్తానంటూ ప్రచారం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆయన సియోను బ్లెస్సింగ్ మెనిస్ట్రీస్ పేరిట స్థానికంగా చర్చి నిర్వహిస్తున్నారు. ఆయన చనిపోయి మూడ్రోజుల తర్వాత లేస్తానంటూ సంఘస్థులతో చెప్పాడని పలువురు తెలిపారు. నాగభూషణం తన సమాధికి స్థలం కూడా సిద్దం చేసినట్లు పేర్కొంటూ ఫ్లెక్సీని రూపొందించడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మతిస్థిమితం సరిగా లేకే నాగ భూషణం ఇలా ప్రవర్తిస్తున్నాడని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. పాస్టర్ కు ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నట్లు తెలుస్తోంది. 

గతేడాది ఆఫ్రికాలో సమాధిలోకి వెళ్లిపోయిన పాస్టర్.. తవ్వి చూస్తే!

మానవ అవతారం దాల్చిన దేవుళ్లకు చావు ఉండదని, సజీవంగా సమాధిలోకి వెళ్లిపోతారని కొంతమంది నమ్ముతారు. సమయం వచ్చినప్పుడు మళ్లీ సమాధి నుంచి ప్రాణాలతో బయటకు వస్తారని అనుకుంటారు. ఆఫ్రికాకు చెందిన ఓ పాస్టర్ కూడా ఇదే అనుకున్నాడు. ‘‘నేను దేవుడి.. బతికుండగానే నన్ను సమాధి చేయండి. మూడు రోజుల తర్వాత జీసస్‌లా ప్రాణాలతో తిరిగి వస్తా..’’ అని తన అనుచరులకు చెప్పాడు. అది నిజమే కాబోలు అనుకుని వారు అతడు చెప్పినట్లే చేశారు. మరి, అతడు మూడు రోజులైనా సమాధిలో బతికే ఉన్నాడా? ప్రాణాలతో బయటకు వచ్చాడా? 

జాంబియన్ పట్టణంలోని జియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల జేమ్స్ సకారా.. తనని తాను దైవం పంపిన దూతగా భావించేవాడు. జీసస్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవాడు. అయితే, ప్రజల్లో నమ్మకం కలగడం లేదనే కారణంతో సజీవ సమాధిలోకి వెళ్లాలని ప్లాన్ చేశాడు. తన అనుచరులు వద్దని వారిస్తున్నా.. అతడు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. పిక్నిక్ వెళ్లిన ఈజీగా మూడు రోజులు సమాధిలో ఉండి వచ్చేస్తానని చెప్పాడు. 

‘‘ఆ దేవుడి బిడ్డలా నేను నేను కూడా మూడు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చేస్తాను. మీరెవరూ ఆందోళన చెందవద్దు’’ అని తెలిపాడు. అయితే, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. ముగ్గురు చర్చి సిబ్బందితో కలిసి ఈ ప్లాన్ చేశాడు. సుమారు నాలుగు అడుగుల గొయ్యి తవ్వారు. ఆ తర్వాత జేమ్స్ చేతులను వెనక్కి కట్టేసి బతికుండగానే అతడిని పూడ్చిపెట్టేశారు. మూడు రోజుల తర్వాత.. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పారు. పాస్టర్ జేమ్స్ సమాధి నుంచి బయటకు రానున్నారని చెప్పారు. దీంతో జనమంతా అక్కడ గుమిగూడారు. 

చర్చి సిబ్బంది సమాధి తవ్వారు. జేమ్స్ బతికి ఉంటాడని భావించారు. బ్యాడ్ లక్.. అప్పటికే జేమ్స్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు గాఢ నిద్రలో ఉన్నాడని, తప్పకుండా బతుకుతాడంటూ అతడి అనుచరులు ప్రార్థనలు చేశారు. కానీ, జేమ్స్ బతకలేదు. అతడిని సమాధిలో పడుకోబెట్టిన ముగ్గురు సిబ్బందిలో ఒకరు పోలీసులకు లొంగిపోయాడు. మిగతా ఇద్దరు పరారిలో ఉన్నారు. అయితే, ఇలాంటి స్టంట్లు ఆఫ్రికాలో సర్వసాధారణమే. అక్కడి ప్రజలను నమ్మించేందుకు కొంతమంది ఇలాంటి స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విశ్వాసం ఉండవచ్చు.. కానీ, మూఢ విశ్వాసం ఉండకూడదని పలువురు హితవు పలుకుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Suryapeta Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryapeta Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget