అన్వేషించండి

Kidney Problems: పెరుగుతున్న కిడ్నీ బాధితులు, పట్టించుకోరా అంటూ విపక్షాల గగ్గోలు!

Kidney Problems: ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Kidney Problems: ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో చీమలపాడు హరిజనవాడ పెద్ద తండా, చైతన్య నగర్ తండాల్లో కిడ్నీ బాదితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బాధితులు పెరుగుతుండటంతో స్దానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. కిడ్నీ బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారంటూ విపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. అయినా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌టం లేద‌ని విమర్శలు గుప్పిస్తున్నారు. 

అప్పుడు హామీ ఇచ్చారు ఇప్పుడు పట్టించుకోరా..

ఎన్నిక‌ల వాగ్ధానాలు అమ‌లు కాని వైనంపై స్దానిక నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పింఛన్లు, ప్రభుత్వ సహాయం అంద‌క ఆస్తులు అమ్మ‌కుంటున్నామ‌ని బాధితులు ఆవేద‌న చెందుతున్నారు. క‌నీసం మంచి నీరు, మందులు కూడా పంపిణీ చేయ‌టం లేద‌ని ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.

ఏకొండూరులో పర్యటించిన నాయకులు..

కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంపై.. సీపీఎం నాయ‌కుల బృందం ఏకొండురూలో పర్య‌టించింది. ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని సీపీఎం డిమాండ్ చేసింది. ఎన్‌.టి.ఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో కిడ్నీ వ్యాధుల వరుస మరణాలు చోటు చేసుకున్న నేప‌థ్యంలో సి.పి.ఎం. బృందం బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది.

బాధితులను పరామర్శించిన నేతలు..

ఏకొండూరు మండలంలో చీమలపాడు హరిజన వాడ పెద్ద తండా, చైతన్య నగర్ తండాలలో పర్యటించి కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై నాయకులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించిన వారిలో సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 

బాధితులను పట్టించుకోరా?

ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల వలన వరుస మరణాలు చోటు చేసుకుంటున్నా విషయాన్ని సిపిఎం పార్టీ ఆందోళనలు నిర్వహించి వెలుగులోకి తెచ్చిందని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం గర్హనీయమని సీపీఎం నేతలు అన్నారు. 2022వ సంవత్సరంలో ఇప్పటి వరకు 20 మంది వరకు కిడ్నీ వ్యాధుల వలన మృతి చెందారని అంతకుముందు ఇక్కడ సంభవించిన మరణాలు లెక్కకు మించి ఉన్నాయని అన్నారు. తాము పర్యటించిన గ్రామాల్లో గిరిజన తండాలలో ఇంటికి ఒకరు చొప్పున కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఉన్నారని గత ప్రభుత్వం కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులను గాలికి వదిలేసిందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా కిడ్నీ వ్యాధి గ్రస్తుల సమస్యలు పట్టించుకోవడంలేదని విమ‌ర్శించారు.

ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు?

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కిడ్నీ వ్యాధుల విషయమై ఆరోగ్య శాఖ అధికారులతో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని సీపీఎం నేతలు అన్నారు. ఇది బాధ్యతా రాహిత్యమేనని వారు విమర్శించారు. కిడ్నీ బాధితులు మంచాలలో ఉండి డయాలసిస్ చేయించుకునే వారు డబ్బుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం నుండి వారికి ఎలాంటి సాయం అందడం లేదని ఆరోపించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలను వారి వద్దకు వెళ్లి వింటుంటే హృదయం ద్రవించుకుపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

కనీసం ఆరోగ్యశ్రీ  అందించండి..

బాధితులు డయాలసిస్ కోసం ఆస్పత్రులకు వెళితే వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని వాగ్దానం చేసిన సీఎం.. ఆ విషయాన్ని మర్చిపోయారని అన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని సీపీఎం నేతలు విమర్శించారు. మండలంలో ఇప్పటి వరకు కిడ్నీ వ్యాధులతో మరణించిన వారి వివరాలను ప్రభుత్వం సేకరించి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సర్కారు స్పందించకుంటే ఉద్యమమే..

కిడ్నీ బాధితుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని సీపీఎం నాయకులు హెచ్చరించారు. మండలంలో నానాటికి కిడ్నీ వ్యాధులు ఎక్కువవుతున్నాయని ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. చీమలపాడు పెద్ద తండాకు చెందిన రాంబాబు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 73 సార్లు డయాలసిస్ చేయించుకున్నా.. ఇప్పటి వరకు ఆ బాధితుడికి పెన్షన్ మంజూరు కాలేదని తెలిపారు. ఈ విషయాన్ని మండల పరిషత్ ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటున్నారని ఇది కిడ్నీ రోగుల పట్ల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు అన్నారు. జిల్లా కలెక్టరు దృష్టికి కూడా తీసుకువెళ్ళారన్నారు. కిడ్నీ వ్యాధులతో అల్లాడుతున్న ఏకొండూరు మండల ప్రజానీకానికి తాగు నీటి కొరకు ఇప్పటివరకు కృష్ణా జలాలను సరఫరా చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
Yograj VS Kapil Dev Controversy: యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
Mbappe VS Paraguayan Senator: ఎంబాప్పేపై పరాగ్వే మహిళా సెనేటర్ తిట్ల పురాణం.. జైల్లో పెడతానంటూ ఓపెన్ వార్నింగ్, ఫ్రెంచ్ కోచ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!
ఎంబాప్పేపై పరాగ్వే మహిళా సెనేటర్ తిట్ల పురాణం.. జైల్లో పెడతానంటూ ఓపెన్ వార్నింగ్, ఫ్రెంచ్ కోచ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Embed widget