By: ABP Desam | Updated at : 16 Sep 2022 02:56 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: ANI)
Bharat Jodo Yatra: కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి సమయంలో కేరళ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఓ పని పార్టీని ఇరకాటంలో పడేసింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఓ కూరగాయల వ్యాపారి నుంచి జోడో యాత్ర కోసం డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకపోయేసరికి అతనిపై దాడికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kerala | Vegetable shop owner threatened by Congress workers for not contributing Rs 2000 in fund collection for 'Bharat Jodo Yatra' in Kollam
— ANI (@ANI) September 16, 2022
(Photo source: Screenshot from viral video) pic.twitter.com/vzQaRWqwiB
ఇదీ సంగతి
రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. అయితే ఆ యాత్ర కోసం రూ.2 వేలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కొల్లాంలో ఓ వ్యాపారిని డిమాండ్ చేశారు. కానీ ఆ కూరగాయల వ్యాపారి రూ.500 మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆ వ్యాపారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
@ANI @RahulGandhi @republic @TimesNow @IndiaToday @BJPInNews@AskAnshul @INCKerala @vdsatheesan
— Bipin Madhu (@bipinaiswarya) September 16, 2022
Congress member attack a vegetable shop and destroy their weighing machine worth 8000 Rs for not paying donation of Rs 2000 for Bharath Jodo Yatra at Kunnikodu / Kerala. pic.twitter.com/Gds6gnR7VI
కాంగ్రెస్ రియాక్షన్
ఈ ఘటనపై కేరళ కాంగ్రెస్ స్పందించింది. ఇది అల్లరిమూకలు చేసిన పని అని వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ నేరుగా ప్రజలను కలిసి, వారి సమస్యలను వింటున్నారని పార్టీ పేర్కొంది.
జోడో యాత్ర
మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్ని టార్గెట్గా పెట్టుకుంది.
కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ముకశ్మీర్లో ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయటం లేదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్లో ఉంటున్నారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేస్తున్నారు.
Also Read: Lucknow Wall Collapse: లఖ్నవూలో ఘోర ప్రమాదం- ప్రహారీ గోడ కూలి 9 మంది మృతి!
Also Read: Watch Video: ఈ వీడియో చూడండి- హెల్మెట్ విలువ తెలుస్తుంది!
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana Congress CM Candidate LIVE: తెలంగాణ సీఎంపై కొలిక్కిరాని చర్చలు, రేవంత్ ను ఒప్పుకోని సీనియర్లు! ఢిల్లీకి డీకే శివకుమార్
TSPSC Group 4 Results: టీఎస్పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?
Manipur Violence: మణిపూర్లో మళ్లీ అలజడి, రెండు తెగల మధ్య కాల్పులు - 13 మంది మృతి
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
/body>