అన్వేషించండి

Bharat Jodo Yatra: వ్యాపారిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి- జోడో యాత్రకు డబ్బులు ఇవ్వలేదని!

Bharat Jodo Yatra: కేరళలో ఓ వ్యాపారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. భారత్ జోడో యాత్ర కోసం డబ్బులు ఇవ్వకపోయేసరికి దాడికి దిగారు.

Bharat Jodo Yatra: కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి సమయంలో కేరళ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఓ పని పార్టీని ఇరకాటంలో పడేసింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఓ కూరగాయల వ్యాపారి నుంచి జోడో యాత్ర కోసం డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకపోయేసరికి అతనిపై దాడికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ సంగతి

రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. అయితే ఆ యాత్ర కోసం రూ.2 వేలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొల్లాంలో ఓ వ్యాపారిని డిమాండ్ చేశారు. కానీ ఆ కూర‌గాయ‌ల వ్యాపారి రూ.500 మాత్ర‌మే ఇచ్చాడు. దీంతో ఆ వ్యాపారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.

" భార‌త్ జోడో యాత్ర ఫండ్ పేరుతో మా ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బు వ‌సూల్ చేస్తున్నారు. క‌స్ట‌మ‌ర్ల‌ను కూడా కార్య‌క‌ర్త‌లు అవ‌మానించారు. యూత్ కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ హెచ్ అనీశ్ ఖాన్ ఆ గ్యాంగ్‌లో ఉన్నారు.                                                     "
-   ఫవజ్, బాధిత వ్యాపారి

కాంగ్రెస్ రియాక్షన్

ఈ ఘటనపై కేరళ కాంగ్రెస్ స్పందించింది. ఇది అల్ల‌రిమూక‌లు చేసిన ప‌ని అని వారిపై చ‌ర్య‌లు తీసుకున్నట్లు తెలిపింది. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ నేరుగా ప్రజలను కలిసి, వారి సమస్యలను వింటున్నారని పార్టీ పేర్కొంది.

జోడో యాత్ర

మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.

కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ముకశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయటం లేదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటున్నారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేస్తున్నారు.

Also Read: Lucknow Wall Collapse: లఖ్‌నవూలో ఘోర ప్రమాదం- ప్రహారీ గోడ కూలి 9 మంది మృతి!

Also Read: Watch Video: ఈ వీడియో చూడండి- హెల్మెట్ విలువ తెలుస్తుంది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం  - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
L And T Chairman: ఆదివారం సెలవు అవసరమా అన్న వ్యక్తే లీవ్‌ తీసుకోమంటున్నారు- ఎల్ అండ్ టి ఛైర్మన్ ప్రకటన చూశారా ?
ఆదివారం సెలవు అవసరమా అన్న వ్యక్తే లీవ్‌ తీసుకోమంటున్నారు- ఎల్ అండ్ టి ఛైర్మన్ ప్రకటన చూశారా ?
Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
Embed widget