అన్వేషించండి

Siddaramaiah: సిద్దరామయ్యకి పదవి గండం! భూ కుంభకోణం కేసులో విచారణకు అంతా సిద్ధం

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి భూ కుంభకోణం కేసులో వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ కేసులో ఆయనను విచారించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

Karnataka Land Scam Case: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ల్యాండ్‌ స్కామ్‌ కేసులో ఆయన ఇరుక్కునే అవకాశాలున్నాయి. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA)కి స్థల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సిద్ద రామయ్య. కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గహ్లోట్‌ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ముగ్గురు సోషల్ యాక్టివిస్ట్‌లు వేసిన పిటిషన్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి నోటీసులు అందాయి. ఇదే విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఈ కేసుని రాజకీయ కుట్రగా చెబుతున్నారు సిద్దరామయ్య. గత నెలలోనే ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు గవర్నర్. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఎందుకు చర్యలు తీసుకోకూడదో కూడా వివరించాలని స్పష్టం చేశారు. దీనిపై సిద్దరామయ్య సర్కార్ భగ్గుమంది. వెంటనే ఆ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండి పడింది. రూ. కోట్ల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. జులైలో లోకాయుక్త పోలీసులకు ఇదే విషయమై ఫిర్యాదు చేశారు. సిద్దరామయ్య సతీమణి పార్వతి పేరుపైన 14 స్థలాల్ని కేటాయించినట్టు ఆరోపించారు. ఈ కారణంగా రూ.45 కోట్ల స్కామ్ జరిగినట్టు చెబుతున్నారు. (Also Read: Rajasthan: మత ఘర్షణలతో రగులుతున్న రాజస్థాన్! ఇంటర్నెట్ సేవలు బంద్ - పలు చోట్ల 144 సెక్షన్)

సిద్దరామయ్యతో పాటు ఆయన సతీమణి పార్వతి, కొడుకు యతీంద్ర, MUDAలోని సీనియర్ అధికారుల పేర్లనూ ఈ ఫిర్యాదులో చేర్చారు. కేసరే గ్రామంలో MUDA సిద్దరామయ్య సతీమణి పార్వతికి చెందిన భూమిని సేకరించింది. అందుకు బదులుగా ఆమెకి మైసూరులో ఓ ప్లాట్‌ని కేటాయించింది. అయితే...ఈ ప్లాట్‌ విలువ చాలా ఎక్కువ అని, కావాలనే ఆమెకి ప్రయోజనం కలిగించేలా అధికారులు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు పిటిషనర్లు. సిద్దరామయ్య భార్యకి ఆ స్థలం గిఫ్ట్‌గా వచ్చిందని వాదిస్తున్నా...పిటిషనర్లు మాత్రం ఆ స్థలాన్ని ఆక్రమించారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసుపై కొత్త FIR నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ వివాదంపై డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఈ రాజకీయ దాడిని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సిద్దరామయ్యకి అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు. లీగల్‌గా ఏం చేయొచ్చో ఇప్పటికే ఓ నిర్ణయించుకున్నామని అన్నారు. వెనకబడిన వర్గానికి చెందిన నేతపై ఇలా రాజకీయంగా కక్ష సాధిస్తున్నారని మండి పడ్డారు. 

Also Read: Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్, కోల్‌కత్తా ఘటనపై లక్షలాది మంది డాక్టర్ల నిరసన

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget