అన్వేషించండి

విదేశీ శక్తులతో రాహుల్ కుమ్మక్కయ్యారు, కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది - జేపీ నడ్డా

JP Nadda on Rahul Gandhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.

JP Nadda on Rahul Gandhi: 

టూల్‌కిట్‌లో భాగమే..

రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. భారత దేశ వ్యతిరేక శక్తుల్లో రాహుల్ గాంధీ కూడా ఒకరు అంటూ తీవ్రంగా విమర్శించారు. యాంటీ ఇండియా "టూల్‌కిట్‌"లో రాహుల్ చేరిపోయారని ఆరోపించారు. 

"రాహుల్ గాంధీ భారత్‌ను కించపరిచారు. పార్లమెంట్‌ను కూడా అవమానించారు. పరాయి దేశంలో మన దేశ పరువు తీశారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నే వారితో చేతులు కలిపారు"

- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు 

భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే విదేశీ శక్తులతో రాహుల్‌ చేతులు కలుపుతున్నారని మండి పడ్డారు నడ్డా. అంతే కాదు. యూకేలో తన ప్రసంగంలో విదేశాలు భారత్‌ అంతర్గత విషయాల్లో కగలజేసుకోవాలని డిమాండ్ చేశారని అన్నారు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రాహుల్ అవమాన పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"రాహుల్ వైఖరి విదేశీ కుట్రదారులను బలపరచకపోవడం కాకపోతే మరేంటి..? భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని..యూఎస్ యూరప్ కలగజేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని అన్నారు. ఇండియా ప్రజాస్వామ్యానికి ఖ్యాతి గడించిన దేశం. ఏ శక్తి కూడా దాన్ని విచ్ఛిన్నం చేయలేదు. ఇవాళ దేశంలో ఎవరూ కాంగ్రెస్ మాట వినడం లేదు. ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదు. అందుకే అన్ని చోట్లా కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతోంది. జార్జ్ సోరోస్, రాహుల్ ఒకేలా మాట్లాడటంలో అంతరార్థం ఏంటి..? రాహుల్ తప్పకుండా దేశానికి క్షమాపణలు చెప్పాలి. " 

- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు 

బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీ భారత్‌పై, మోదీ సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్‌ను కించపరిచారంటూ బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. ఇటీవలే ఆ పర్యటన ముగించి వచ్చిన రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్  ఏర్పాటు చేశారు. తనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మోదీ హయాంలో నిజంగా ప్రజాస్వామ్యమనేదే ఉంటే...కచ్చితంగా తనకు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వచ్చి ఉండేదని సెటైర్లు వేశారు. ఇదే సమయంలో గౌతమ్ అదాని, ప్రధాని మధ్య రిలేషన్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తాను పార్లమెంట్‌లోకి వచ్చిన మరు నిముషమే సభను వాయిదా వేస్తారని విమర్శించారు.

"నాకు మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కుని ప్రజాస్వామ్యం కల్పించింది. నిజంగా దేశంలో డెమొక్రసీ ఉంటే నేను పార్లమెంట్‌లో మాట్లాడగలిగే వాడిని. ఇది నిజంగా మన దేశ ప్రజాస్వామ్యానికి పరీక్ష. అదానీ అంశంపై మేం పదేపదే ప్రశ్నిస్తున్నాం. అందుకే మోదీ సర్కార్ భయపడుతోంది. ఇకపై నాకు పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అనుమతి దొరకకపోవచ్చు. మోదీ, అదానీ మధ్య సంబంధం ఏంటి అనేదే నా ప్రశ్న. అదానీ అంశంపై నేను చేసిన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టించారు. ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని దాచేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. నేను ఇవాళ ఉదయం పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాను. నలుగురు మంత్రులు నా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. నాపై ఆరోపణలు చేశారు. కొద్ది రోజుల క్రితం నేను పార్లమెంట్‌లో అదానీ అంశం గురించి మాట్లాడాను. దాన్ని రికార్డుల నుంచి తొలగించారు. "

- రాహుల్ గాంధీ

Also Read: ప్రధాని మోదీకి నోబుల్ శాంతి బ‌హుమ‌తి! అబ్బే ఉత్తుత్తి ప్ర‌చార‌మే


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget