అన్వేషించండి

​​Iran-India Relations: ఇరాన్ భారత్ మైత్రిని బలపరిచిన ఇబ్రహీం రైసీ, ఆయన హయాంలోనే కీలక ఒప్పందాలు

Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ హయాంలో భారత్ ఇరాన్ మధ్య మైత్రి బలపడిందని ప్రధాని మోదీ చెప్పడం వెనక కొన్ని కారణాలున్నాయి.

India Iran Relations: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో భారత్‌, ఇరాన్ మధ్య మైత్రిని బలపర్చడంలో రైసీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. అటు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా విచారం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ప్రధాని మోదీ ప్రస్తావించినట్టుగానే ఇబ్రహీం రైసీ హయాంలో రెండు దేశాల మధ్య మైత్రి బలపడింది. భారత్‌తో ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించేందుకే ఆసక్తి చూపించారు రైసీ. 2021 వరకూ ఇరాన్ అధ్యక్షుడిగా హసన్ రౌహానీ ఉన్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ విజయం సాధించారు. విదేశాంగ మంత్రిగా అమిర్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరూ భారత్‌కి మిత్రులే. ఇరాన్‌లో భారత్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిందంటే అందుకు కారణం వీళ్ల చొరవే. ముఖ్యంగా ఇరాన్‌లోని Chabahar Portపై  భారత్ పెట్టుబడులు పెట్టింది. దాని వెనక ఓ కారణం ఉంది. పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌కి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది చాబహార్ పోర్ట్. గ్వాదర్ పోర్ట్‌ కోసం చైనా గట్టిగానే పెట్టుబడులు పెట్టింది. రష్యాతో అనుసంధానించే చాబహార్‌ పోర్ట్‌ భారత్‌కి వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. అందులోనూ గ్వాదర్‌ పోర్ట్‌కి దగ్గర్లో ఉండడం వల్ల చైనా, పాకిస్థాన్‌కి కౌంటర్‌గా చాబహార్ పోర్ట్‌పై ఫోకస్ పెట్టింది. 

ఈ ఏడాది జనవరిలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్‌లో పర్యటించారు. ఆ సమయంలోనే భారత్ ఇరాన్ మధ్య Chabahar Port Deal  కుదిరింది. దీంతో పాటు నార్త్-సౌత్ కారిడార్‌ అభివృద్ధికీ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. గత వారమే షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్‌ ఈ డీల్‌పై సంతకం చేశారు. వచ్చే పదేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగేలా డీల్ కుదిరింది. ఇరాన్‌కి భారత్‌ మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చింది. BRICS లో ఇరాన్‌ని చేర్చాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో సౌతాఫ్రికాలో జరిగిన BRICS summitలో ఇరాన్‌ని కూడా అధికారికంగా చేర్చుకున్నారు. అందుకు కృతజ్ఞతగా భారత్‌ కలలు కంటున్న  Global South కి ఇరాన్‌ మద్దతునిస్తోంది. ఇలా రెండు దేశాలు పరస్పరం సహకరించుకోడానికి రైసీ చాలా చొరవ చూపించారు. 

Also Read: Paresh Rawal: ఓటు వేయకపోతే ట్యాక్స్‌ భారీగా పెంచాలి, కఠిన శిక్ష వేయాలి - పరేశ్ రావల్ సంచలన వ్యాఖ్యలు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
Tinmar Mallanna:  తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
Pawan Kalyan Latest News Today In Telugu: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Telugu TV Movies Today: చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP DesamErrum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP DesamArya Vysya Corporation Chairman Doondi Rakesh Interview | ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ ఇంటర్వ్యూ | ABP DesamTirupati Deputy Mayor Election MLC Kidnap | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో హై టెన్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
Tinmar Mallanna:  తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
Pawan Kalyan Latest News Today In Telugu: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Telugu TV Movies Today: చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
Delhi Elections 2025: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Revanth Reddy Challenge: చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
Embed widget