అన్వేషించండి

Railway Ticket Booking: రైల్వే టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ ఉండాల్సిందే! మారిన రూల్స్ గురించి తెలుసుకోండి!

Railway Ticket Booking: ఐఆర్సిటిసి ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే టికెట్ బుకింగ్ సౌకర్యం ఉంది. మిగతా వాళ్లు జనవరి 5 నుంచి ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు టికెట్స్ బుక్ చేసుకోలేరు.

Railway Ticket Booking: దేశంలో రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. అలాంటిది మీరు రైలు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు ముఖ్యమైన వార్త. వాస్తవానికి IRCTC అడ్వాన్స్ రైలు టికెట్ బుకింగ్ నిబంధనల్లో పెద్ద మార్పు అమలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోకుండా నిర్ణీత సమయంలో రిజర్వ్ టికెట్ బుక్ చేసుకోవడం కష్టమవుతుంది. ఈ మార్పు ప్రత్యేకంగా 60 రోజుల ముందు తెరుచుకునే అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కు వర్తిస్తుంది.

జనవరి 5 నుంచి కొత్త నిబంధన అమలు

IRCTC కొత్త నిబంధనల ప్రకారం, జనవరి 5 నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు IRCTC ఖాతా ఆధార్‌తో వెరిఫైడ్ అయినవారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలుగుతారు. ఇంకా ఆధార్ లింక్ లేదా వెరిఫైడ్ కాని ప్రయాణికులు ఈ సమయంలో టికెట్ బుక్ చేసుకోలేరు. అలాంటి యూజర్లు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే రిజర్వేషన్ పర్మిషన్ పొందుతారు. గతంలో ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. తర్వాత ఈ సమయాన్ని 4 గంటలకు పెంచారు, కానీ ఇప్పుడు దానిని మొత్తం 8 గంటలకు పెంచారు. దీని అర్థం ఆధార్ వెరిఫైడ్ ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఏ తేదీల నుంచి మార్పులు అమలు అయ్యాయి?

భారతీయ రైల్వే ఈ నిబంధనను మూడు దశల్లో అమలు చేస్తోంది. మొదటి దశ డిసెంబర్ 29, 2025 నుంచి అమలులోకి వచ్చింది. అప్పుడు ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు బుకింగ్ నిలిపివేశారు. రెండో దశ జనవరి 5 నుంచి అమలులోకి వచ్చింది. అప్పుడు ఈ సమయాన్ని ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు పెంచారు. ఆ తర్వాత మూడో దశ జనవరి 12 నుంచి అమలులోకి వస్తుంది, అప్పుడు ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు టికెట్ బుక్ చేసుకోలేరు.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

సరైన ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ అందించడం, దళారులు, నకిలీ ఖాతాలపై నియంత్రణ సాధించడం ఈ చర్య  ఉద్దేశ్యమని రైల్వే తెలిపింది. ఆధార్ వెరిఫికేషన్ తో బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది. ఓపెనింగ్ రోజు సాధారణ ప్రయాణికులకు టికెట్ లభించే అవకాశం పెరుగుతుంది. ఈ మార్పు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. రైల్వే కౌంటర్, అంటే విండో నుంచి టికెట్ బుకింగ్ నిబంధనల్లో ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే, కౌంటర్ నుంచి టికెట్ తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు OTP వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. దీని కోసం మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.

ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

ఈ కొత్త నిబంధనతో, తమ IRCTC ఖాతాను ఇప్పటికే ఆధార్‌తో లింక్ చేసుకున్న ప్రయాణికులకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ తెరవగానే, ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన యూజర్ మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలరు. దీనివల్ల కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశం గతంలో కంటే చాలా పెరుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly by election: తమిళనాడు ఉపఎన్నికల రగడ - విజయ్‌కి షాకిచ్చిన కమ్యూనిస్టులు! తిరుచ్చి ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?
తమిళనాడు ఉపఎన్నికల రగడ - విజయ్‌కి షాకిచ్చిన కమ్యూనిస్టులు! తిరుచ్చి ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?
Disha Salian death case 2026: సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
Rich Mla Turns Beggar: మా వాచ్‌మెన్ గుర్తుపట్టలేదు, ఆకలి తీర్చిన చిరు వ్యాపారి - భిక్షాటన అనుభవంపై బీజేపీ ఎమ్మెల్యే
మా వాచ్‌మెన్ గుర్తుపట్టలేదు, ఆకలి తీర్చిన చిరు వ్యాపారి - భిక్షాటన అనుభవంపై బీజేపీ ఎమ్మెల్యే
Phone Scroll Psychology Habit: పొద్దున్నే ఫోన్ చూస్తున్నారా? ఇది కేవలం అడిక్షన్ మాత్రమే కాదు.. దీని వెనుక దాగున్న సైకాలజీ ఇదే!
పొద్దున్నే ఫోన్ చూస్తున్నారా? ఇది కేవలం అడిక్షన్ మాత్రమే కాదు.. దీని వెనుక దాగున్న సైకాలజీ ఇదే!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Embed widget