అన్వేషించండి

Railway Ticket Booking: రైల్వే టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ ఉండాల్సిందే! మారిన రూల్స్ గురించి తెలుసుకోండి!

Railway Ticket Booking: ఐఆర్సిటిసి ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే టికెట్ బుకింగ్ సౌకర్యం ఉంది. మిగతా వాళ్లు జనవరి 5 నుంచి ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు టికెట్స్ బుక్ చేసుకోలేరు.

Railway Ticket Booking: దేశంలో రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. అలాంటిది మీరు రైలు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు ముఖ్యమైన వార్త. వాస్తవానికి IRCTC అడ్వాన్స్ రైలు టికెట్ బుకింగ్ నిబంధనల్లో పెద్ద మార్పు అమలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోకుండా నిర్ణీత సమయంలో రిజర్వ్ టికెట్ బుక్ చేసుకోవడం కష్టమవుతుంది. ఈ మార్పు ప్రత్యేకంగా 60 రోజుల ముందు తెరుచుకునే అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కు వర్తిస్తుంది.

జనవరి 5 నుంచి కొత్త నిబంధన అమలు

IRCTC కొత్త నిబంధనల ప్రకారం, జనవరి 5 నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు IRCTC ఖాతా ఆధార్‌తో వెరిఫైడ్ అయినవారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలుగుతారు. ఇంకా ఆధార్ లింక్ లేదా వెరిఫైడ్ కాని ప్రయాణికులు ఈ సమయంలో టికెట్ బుక్ చేసుకోలేరు. అలాంటి యూజర్లు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే రిజర్వేషన్ పర్మిషన్ పొందుతారు. గతంలో ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. తర్వాత ఈ సమయాన్ని 4 గంటలకు పెంచారు, కానీ ఇప్పుడు దానిని మొత్తం 8 గంటలకు పెంచారు. దీని అర్థం ఆధార్ వెరిఫైడ్ ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఏ తేదీల నుంచి మార్పులు అమలు అయ్యాయి?

భారతీయ రైల్వే ఈ నిబంధనను మూడు దశల్లో అమలు చేస్తోంది. మొదటి దశ డిసెంబర్ 29, 2025 నుంచి అమలులోకి వచ్చింది. అప్పుడు ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు బుకింగ్ నిలిపివేశారు. రెండో దశ జనవరి 5 నుంచి అమలులోకి వచ్చింది. అప్పుడు ఈ సమయాన్ని ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు పెంచారు. ఆ తర్వాత మూడో దశ జనవరి 12 నుంచి అమలులోకి వస్తుంది, అప్పుడు ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు టికెట్ బుక్ చేసుకోలేరు.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

సరైన ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ అందించడం, దళారులు, నకిలీ ఖాతాలపై నియంత్రణ సాధించడం ఈ చర్య  ఉద్దేశ్యమని రైల్వే తెలిపింది. ఆధార్ వెరిఫికేషన్ తో బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది. ఓపెనింగ్ రోజు సాధారణ ప్రయాణికులకు టికెట్ లభించే అవకాశం పెరుగుతుంది. ఈ మార్పు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. రైల్వే కౌంటర్, అంటే విండో నుంచి టికెట్ బుకింగ్ నిబంధనల్లో ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే, కౌంటర్ నుంచి టికెట్ తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు OTP వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. దీని కోసం మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.

ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

ఈ కొత్త నిబంధనతో, తమ IRCTC ఖాతాను ఇప్పటికే ఆధార్‌తో లింక్ చేసుకున్న ప్రయాణికులకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ తెరవగానే, ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన యూజర్ మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలరు. దీనివల్ల కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశం గతంలో కంటే చాలా పెరుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget