అన్వేషించండి

Wrestlers Protest: జంతర్ మంతర్ వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త‌త‌, పోలీసులతో ఘర్షణలో ఇద్దరు రెజ్ల‌ర్ల‌కు గాయాలు

Wrestlers Protest: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నరెజ్లర్లకు పోలీసుల మధ్య ఘర్షణ జ‌రిగింది. బాధ్యుల‌పై చ‌ర్య‌ల కోసం రెజ్ల‌ర్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్​పై లైంగిక ఆరోపణలు చేస్తూ... ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నరెజ్లర్లకు  పోలీసుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. బుధవారం (మే 3) రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు తమపై దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. 

మాలవ్య నగర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని ఆందోళ‌న‌కారుల కోసం మంచాల‌ను తీసుకురాగా ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతి అనుమతి లేకుండా మడత మంచాల‌తో ఆ ప్రాంతానికి చేరుకున్నార‌ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు, పోలీసులతో జరిగిన ఘర్షణలో తన సోదరుడు గాయపడ్డాడని రెజ్లర్ గీతా ఫోగట్ ఆరోపించారు. "రెజ్లర్లపై పోలీసులు చేసిన దాడిలో నా తమ్ముడు దుష్యంత్ ఫోగట్ తలకు గాయ‌మైంది, మరో రెజ్లర్ కూడా గాయపడ్డాడు. ఇది చాలా సిగ్గుచేటు" అని గీతా ఫోగట్ ట్వీట్ చేసింది.

పోలీసుల అదుపులో దీపేంద‌ర్ హుడా

కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మాట్లాడుతూ.. తాను ఆటగాళ్లను కలిసేందుకు జంతర్ మంతర్ చేరుకున్నానని, అయితే పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఆయ‌న ఒక వీడియోను ట్వీట్ చేస్తూ, "ఆటగాళ్ల యోగక్షేమాలను విచారించడానికి నేను జంతర్ మంతర్ చేరుకున్నప్పుడు, ఢిల్లీ పోలీసులు నన్ను నిర్బంధించారు. ఇప్పుడు నన్ను వసంత్ విహార్ పోలీసు పోస్ట్‌కు తీసుకువచ్చారు" అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నిర‌స‌న‌

"దేశం గర్వించేలా చేసిన మన ఆడపడుచులు వీరే" అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. "మ‌న‌కు ఎన్నో పతకాలు తెచ్చిపెట్టిన వారిపై హోంమంత్రి అమిత్ షా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పడమే వారు చేసిన‌ ఏకైక నేరం" అని ట్వీట్‌లో పేర్కొంది.

మరో ట్వీట్‌లో, రెజ్ల‌ర్ల‌పై ఢిల్లీ పోలీసుల దౌర్జన్యాలను తెలుసుకున్న వెంటనే కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని కాంగ్రెస్ పేర్కొంది. పోలీసులు బ‌ల‌వంతంగా ఆయ‌న‌ను  అదుపులోకి తీసుకున్నార‌ని ఆరోపించింది. ఆందోళ‌న చేస్తున్న వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చింది. 

హోం మంత్రికి బజరంగ్ పునియా లేఖ

బుధ‌వారం రాత్రి జరిగిన ఘటనలపై బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. త‌మ‌ డిమాండ్ల కోసం 11 రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని  లేఖలో పేర్కొన్నారు. మే 3వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో, విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, ఢిల్లీ ఏసీపీ ధర్మేంద్ర, 100 మంది పోలీసులతో కలిసి త‌మ‌పై దాడి చేశార‌ని., ఇందులో దుష్యంత్ ఫోగట్, రాహుల్ యాదవ్‌కు గాయాల‌య్యాని తెలిపారు. వినేష్ ఫోగట్‌ను పోలీసులు దుర్భాషలాడారని, సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్‌లను మగ అధికారులు నెట్టారని లేఖలో పేర్కొన్నారు.

హోంమంత్రికి 4 డిమాండ్లు

1- ఘటనకు బాధ్యులైన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.

2- నిరసన ప్రదేశంలో మాకు అవసరమైన కనీస వస్తువులు వాటర్‌ప్రూఫ్ టెంట్లు, బలమైన స్టేజ్, బెడ్, సౌండ్ సిస్టమ్, మ్యాట్రెస్, ప్రాక్టీస్ కోసం రెజ్లింగ్ మ్యాట్‌లు, జిమ్ పరికరాలను తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలి.

3- వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న మా సహచరులందరినీ వెంటనే విడుద‌ల‌ చేయాలి.

4- మా డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులతో త్వరలో చర్చలు జరపాలి.

ఇలాంటి రోజు కోసం మేము పతకాలు సాధించామా?: వినేష్ ఫోగట్
జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులతో వివాదం తర్వాత వినేష్ ఫోగట్ కన్నీళ్లు పెట్టుకుంది. విలేక‌రుల సమావేశంలో వినేష్ మాట్లాడుతూ.. దేశం కోసం పతకాలు సాధించినప్పుడు, ఇలాంటి రోజు  వ‌స్తుంద‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని తెలిపింది. ఏ ఆటగాడు దేశం కోసం పతకం సాధించకూడదని నేను చెబుతాన‌ని పేర్కొంది. ఇప్పటి వరకు నేలపై పడుకున్నామ‌ని, వర్షం కార‌ణంగా పడుకోవడానికి మంచం అడిగామని, అయితే అందుకు పోలీసులు అనుమతించలేదని చెప్పింది. మద్యం మత్తులో ఉన్న ఒక పోలీసు త‌మ‌తో అనుచితంగా ప్రవర్తించాడ‌ని ఆరోపించింది. ఇన్ని కుంభకోణాలు చేసినా, బ్రిజ్‌భూషణ్ తన ఇంట్లో హాయిగా నిద్రిస్తున్నారని, అయితే తాము ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని వినేష్ ఫొగ‌ట్‌ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 

ఢిల్లీ పోలీసులు ఏం చెప్పారు?
ఢిల్లీ డిప్యూటి పోలీస్‌ కమిషనర్ ప్రణవ్ తాయల్ మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతి అనుమతి లేకుండా 'మడత' మంచంతో నిరసన స్థలానికి వచ్చారని తెలిపారు. దీని గురించి ప్రశ్నించగా, భారతి మద్దతుదారులు ట్రక్కు నుంచి మంచాలను తీసేందుకు ప్రయత్నించారని, చిన్న గొడవ జరగడంతో భారతితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP DesamBJP Madhavi Latha vs Akbaruddin Owaisi | శ్రీరామ నవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవి లత | ABP DesamTruck Hit Motorcycle In Hyderabad  | బైకును ఢీ కొట్టిన లారీ.. పిచ్చి పట్టినట్లు ఈడ్చుకెళ్లాడు | ABPPerada Tilak vs Ram Mohan Naidu | రామ్మోహన్ నాయుడు ఓడిపోతారు ఇదే కారణమంటున్న పేరాడ తిలక్ |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Jeep Compass New Car: జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
UPSC 2023 Ranker Ananya Reddy: కేసీఆర్ అధికారం ఎందుకు కోల్పోయారు? మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అధికారం ఎందుకు కోల్పోయారు? మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget